ఈ శుక్రవారం విడుదలవుతున్న సినిమాల్లో కొంచెం బజ్ కనిపిస్తోంది అనుపమ పరమేశ్వరన్ పరదాకు ఒకటే. కంటెంట్ మీద నమ్మకంతో రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేశారు. దీంతో పాటుగా వస్తున్న మూవీ యునివర్సిటి పేపర్ లీక్. గతంలో ఓసారి రిలీజైనా అది వచ్చిన సంగతి ప్రేక్షకులకు తెలిసే లోపే వెళ్లిపోవడంతో హీరో కం దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి మరోసారి థియేటర్లకు తీసుకొస్తున్నారు. ప్రమోషన్లలో అండగా నిలబడేందుకు బ్రహ్మానందం, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి లాంటి టాప్ సెలబ్రిటీలు ముందుకొచ్చి తమకు తోచిన మాట సాయం చేస్తున్నారు.
నిజానికి ప్యాన్ ఇండియా మూవీస్ రాజ్యమేలుతున్న మార్కెట్ లో నారాయణమూర్తి సినిమాలు ఆడటం అంత సులభం కాదు. సామజిక సమస్యలను టికెట్లు కొని చూసేందుకు సాధారణ ఆడియన్స్ సిద్ధంగా లేరు. ఒకప్పుడు ఎర్ర సైన్యం, దండోరా, చీమల దండు లాంటివి ఆడాయంటే దానికి కారణం, అప్పట్లో చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల జనంలో అవగాహన, ఆవేదన రెండూ ఉండటం. కానీ ఇప్పటి మెకానికల్ లైఫ్ లో అది కొరవడింది. పరుగులు పెట్టే యాంత్రిక జీవితంలో కేవలం ఎంటర్ టైన్మెంట్ కోసం తప్ప సినిమాలు చూడటం లేదు. అందులోనూ సీరియస్ గా డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ కి దూరంగా ఉంటున్నారు.
ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ తన బాట వీడకుండా నారాయణమూర్తి చేసిన ప్రయత్నానికి మద్దతు దక్కితే అంత కన్నా మూవీ లవర్స్ సంతోషించడానికి ఏముంటుంది. ఏడు పదుల వయసులోనూ బ్రహ్మచారిగా ఉన్న పీపుల్స్ స్టార్ ఇప్పటి యువతను మాత్రం తనలా ఉండొద్దని కోరుతున్నారు. పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, ఇల్లు కట్టుకోమని సూచన చేస్తున్నారు. నిరాడంబర జీవితంలో ఇవన్నీ చేయకుండా తాను చాలా కోల్పోయాయని, తనలా మాత్రం ఉండొద్దని కోరుతున్నారు. ఇంత స్వచ్ఛంగా నిజాయితీగా ఉంటారు కాబట్టే నారాయణమూర్తి సినిమా ఆడాలని ఇండస్ట్రీనే కాదు సగటు పబ్లిక్ కూడా కోరుకుంటోంది.
This post was last modified on August 21, 2025 11:47 am
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…