ఈ శుక్రవారం విడుదలవుతున్న సినిమాల్లో కొంచెం బజ్ కనిపిస్తోంది అనుపమ పరమేశ్వరన్ పరదాకు ఒకటే. కంటెంట్ మీద నమ్మకంతో రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేశారు. దీంతో పాటుగా వస్తున్న మూవీ యునివర్సిటి పేపర్ లీక్. గతంలో ఓసారి రిలీజైనా అది వచ్చిన సంగతి ప్రేక్షకులకు తెలిసే లోపే వెళ్లిపోవడంతో హీరో కం దర్శక నిర్మాత ఆర్ నారాయణమూర్తి మరోసారి థియేటర్లకు తీసుకొస్తున్నారు. ప్రమోషన్లలో అండగా నిలబడేందుకు బ్రహ్మానందం, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి లాంటి టాప్ సెలబ్రిటీలు ముందుకొచ్చి తమకు తోచిన మాట సాయం చేస్తున్నారు.
నిజానికి ప్యాన్ ఇండియా మూవీస్ రాజ్యమేలుతున్న మార్కెట్ లో నారాయణమూర్తి సినిమాలు ఆడటం అంత సులభం కాదు. సామజిక సమస్యలను టికెట్లు కొని చూసేందుకు సాధారణ ఆడియన్స్ సిద్ధంగా లేరు. ఒకప్పుడు ఎర్ర సైన్యం, దండోరా, చీమల దండు లాంటివి ఆడాయంటే దానికి కారణం, అప్పట్లో చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల జనంలో అవగాహన, ఆవేదన రెండూ ఉండటం. కానీ ఇప్పటి మెకానికల్ లైఫ్ లో అది కొరవడింది. పరుగులు పెట్టే యాంత్రిక జీవితంలో కేవలం ఎంటర్ టైన్మెంట్ కోసం తప్ప సినిమాలు చూడటం లేదు. అందులోనూ సీరియస్ గా డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ కి దూరంగా ఉంటున్నారు.
ఇంత ప్రతికూల పరిస్థితుల్లోనూ తన బాట వీడకుండా నారాయణమూర్తి చేసిన ప్రయత్నానికి మద్దతు దక్కితే అంత కన్నా మూవీ లవర్స్ సంతోషించడానికి ఏముంటుంది. ఏడు పదుల వయసులోనూ బ్రహ్మచారిగా ఉన్న పీపుల్స్ స్టార్ ఇప్పటి యువతను మాత్రం తనలా ఉండొద్దని కోరుతున్నారు. పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని, ఇల్లు కట్టుకోమని సూచన చేస్తున్నారు. నిరాడంబర జీవితంలో ఇవన్నీ చేయకుండా తాను చాలా కోల్పోయాయని, తనలా మాత్రం ఉండొద్దని కోరుతున్నారు. ఇంత స్వచ్ఛంగా నిజాయితీగా ఉంటారు కాబట్టే నారాయణమూర్తి సినిమా ఆడాలని ఇండస్ట్రీనే కాదు సగటు పబ్లిక్ కూడా కోరుకుంటోంది.
This post was last modified on August 21, 2025 11:47 am
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…
కొందరు దర్శకులు టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్గా ఉంటారు. తమతో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…
నివిన్ పౌలీ.. 11 ఏళ్ల ముందు ప్రేమమ్ మూవీతో పెద్ద హిట్టు కొట్టి స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ఆ…
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…