ఆగస్ట్ నెల రవితేజ మాస్ జాతరతో ముగుస్తుందేమోనని చూస్తే అది కాస్తా వాయిదా పడటంతో ఇప్పుడు అందరి దృష్టి సెప్టెంబర్ మీదకు వెళ్తోంది. చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలే వరసగా క్యూ కట్టడంతో థియేటర్లకు మళ్ళీ కళ వస్తుందనే నమ్మకంతో బయ్యర్లు ఎదురు చూస్తున్నారు. ముందైతే సెప్టెంబర్ 4 ‘ఘాటీ’ వచ్చేస్తుంది. ఇందులో డౌట్ లేదు. మరుసటి రోజు ‘మాస్ జాతర’ని రిలీజ్ చేసే సాధ్యాసాధ్యాల గురించి నిర్మాత నాగవంశీ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడుతున్నారట. ఒకవేళ కుదరని పక్షంలో సెప్టెంబర్ 12కి వెళ్లాల్సి ఉంటుంది. కానీ అదే డేట్ కి తేజ సజ్జ ‘మిరాయ్’ని దింపాలని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్లాన్ చేసుకుంటోంది.
వీళ్లందరి కన్నా ముందుగా సెప్టెంబర్ 12 లాక్ చేసుకుంది బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ‘కిష్కిందపురి’ కోసం కొద్దిరోజుల క్రితమే టీజర్ తో పాటుగా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చారు. ఇప్పుడు మిరాయ్, మాస్ జాతర వచ్చే పక్షంలో థియేటర్ల పరంగా ఇబ్బందులు తలెత్తుతాయి. పోనీ సెప్టెంబర్ 25 వద్దామా అంటే అక్కడ డైనోసర్ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ‘ఓజి’తో తలపడే సాహసం ఎవరూ చేయలేరు. హరిహర వీరమల్లు పోయినా ఓజి మీద హైప్ ఇంచు కూడా తగ్గలేదు. అందుకే పంపిణీదారులు కనివిని ఎరుగని రేట్లను నిర్మాత దానయ్యకు ఆఫర్ చేస్తున్నారు. అఖండ 2 దాదాపు తప్పుకుందని ఫిలిం నగర్ టాక్.
ఇవి కాకుండా పైన చెప్పిన వాటిలో మార్పులు చేర్పులతో సంబంధం లేకండా తమిళ డబ్బింగులు శివ కార్తికేయన్ మదరాసి సెప్టెంబర్ 5, విజయ్ ఆంటోనీ భద్రకాళి సెప్టెంబర్ 12 దిగిపోతాయి. అంతే ఓ మొత్తం సినారియో చూసుకుంటే కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో అయిదు పెద్ద టాలీవుడ్ సినిమాలు ( ఘాటీ – మిరాయ్ – మాస్ జాతర – కిష్కిందపురి – ఓజి ) వచ్చేస్తాయి. అదనంగా రెండు అనువాద చిత్రాలు దిగుతాయి. క్యాస్టింగ్, బడ్జెట్ పరంగా అన్నీ ఆయా హీరో హీరోయిన్ల కెరీర్ లో చాలా పెద్దవి. మరి సెప్టెంబర్ లో తాకిడిలా రాబోతున్న కొత్త రిలీజుల్లో ఎవరు నెగ్గుతారో ఎవరు తగ్గుతారో ఇంకొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.
This post was last modified on August 20, 2025 6:19 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…