అయిదేళ్ళు నిర్మాణంలో ఉండి, ఏడెనిమిది సార్లు వాయిదాలు పడి, వందల కోట్ల పెట్టుబడులు మోసిన హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుందో చూశాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరో పీడకలను మిగిలించి డిజాస్టరయ్యింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ పుణ్యమాని ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ వాటిని నిలబెట్టుకునే కంటెంట్ లేకపోవడంతో ఫైనల్ గా ఫెయిల్యూర్ తప్పలేదు. ఇప్పటికే దీనికొచ్చిన నష్టాల గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సరే ఆడని సంగతి పక్కనపెడితే థియేటర్లలో చూడని జనాల సంఖ్య లక్షల్లో ఉంది. వాళ్లకు గుడ్ న్యూస్ చెబుతూ అమెజాన్ ప్రైమ్ అధికారిక ప్రకటన ఇచ్చింది.
ఇవాళ అర్ధరాత్రి నుంచి అంటే ఆగస్ట్ 20 హరిహర వీరమల్లు స్ట్రీమింగ్ కు రాబోతోంది. థియేటర్ రిలీజ్ జరుపుకున్న సరిగ్గా 28వ రోజున ఆన్ లైన్ లోకి వచ్చేస్తోంది. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఒప్పందం టైంలో నాలుగు వారాల విండో రాసుకున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు షెడ్యూల్ అయ్యింది. కాకపోతే ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ మరీ నాలుగు వారాలకే ఓటిటిలో రావడం అంత మంచి పరిణామం కాదనేది బయ్యర్ వర్గాలు సాధారణంగా చెప్పే మాట. కానీ సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఈ తక్కువ విండోనే ప్రొడ్యూసర్లకే శ్రీరామ రక్షలా నిలుస్తోందనేది కూడా వాస్తవమే.
ఇప్పుడు డిజిటల్ లో చూడబోతున్న ఆడియన్స్ రియాక్షన్లు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. ట్రోలింగ్ చేస్తారా లేక సనాతన ధర్మం గురించి పవన్ టచ్ చేసిన కాన్సెప్ట్ ని స్వాగతిస్తారా అనేది ఆసక్తికరం కానుంది. ఇదంతా ఓకే కానీ హరిహర వీరమల్లు పార్ట్ 2 అంతిమ యుద్ధం ఉంటుందో లేదో అనే దానికి సమాధానం ఇన్ డైరెక్ట్ గా దొరుకుతోంది. మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్ చూసి సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడం రిస్కే అవుతుంది. పైగా ఇప్పుడొచ్చిన నష్టాలకు తోడు రత్నం కొత్తగా పెట్టుబడులు తేవడం కష్టం. రేపటి నుంచి సోషల్ మీడియాలో హరిహర వీరమల్లుకు సంబంధించిన రియాక్షన్స్ ఎలా ఉంటాయో వెయిట్ అండ్ సీ.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…