అయిదేళ్ళు నిర్మాణంలో ఉండి, ఏడెనిమిది సార్లు వాయిదాలు పడి, వందల కోట్ల పెట్టుబడులు మోసిన హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుందో చూశాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరో పీడకలను మిగిలించి డిజాస్టరయ్యింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ పుణ్యమాని ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ వాటిని నిలబెట్టుకునే కంటెంట్ లేకపోవడంతో ఫైనల్ గా ఫెయిల్యూర్ తప్పలేదు. ఇప్పటికే దీనికొచ్చిన నష్టాల గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సరే ఆడని సంగతి పక్కనపెడితే థియేటర్లలో చూడని జనాల సంఖ్య లక్షల్లో ఉంది. వాళ్లకు గుడ్ న్యూస్ చెబుతూ అమెజాన్ ప్రైమ్ అధికారిక ప్రకటన ఇచ్చింది.
ఇవాళ అర్ధరాత్రి నుంచి అంటే ఆగస్ట్ 20 హరిహర వీరమల్లు స్ట్రీమింగ్ కు రాబోతోంది. థియేటర్ రిలీజ్ జరుపుకున్న సరిగ్గా 28వ రోజున ఆన్ లైన్ లోకి వచ్చేస్తోంది. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఒప్పందం టైంలో నాలుగు వారాల విండో రాసుకున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు షెడ్యూల్ అయ్యింది. కాకపోతే ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ మరీ నాలుగు వారాలకే ఓటిటిలో రావడం అంత మంచి పరిణామం కాదనేది బయ్యర్ వర్గాలు సాధారణంగా చెప్పే మాట. కానీ సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఈ తక్కువ విండోనే ప్రొడ్యూసర్లకే శ్రీరామ రక్షలా నిలుస్తోందనేది కూడా వాస్తవమే.
ఇప్పుడు డిజిటల్ లో చూడబోతున్న ఆడియన్స్ రియాక్షన్లు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. ట్రోలింగ్ చేస్తారా లేక సనాతన ధర్మం గురించి పవన్ టచ్ చేసిన కాన్సెప్ట్ ని స్వాగతిస్తారా అనేది ఆసక్తికరం కానుంది. ఇదంతా ఓకే కానీ హరిహర వీరమల్లు పార్ట్ 2 అంతిమ యుద్ధం ఉంటుందో లేదో అనే దానికి సమాధానం ఇన్ డైరెక్ట్ గా దొరుకుతోంది. మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్ చూసి సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడం రిస్కే అవుతుంది. పైగా ఇప్పుడొచ్చిన నష్టాలకు తోడు రత్నం కొత్తగా పెట్టుబడులు తేవడం కష్టం. రేపటి నుంచి సోషల్ మీడియాలో హరిహర వీరమల్లుకు సంబంధించిన రియాక్షన్స్ ఎలా ఉంటాయో వెయిట్ అండ్ సీ.
This post was last modified on August 19, 2025 7:29 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…