అయిదేళ్ళు నిర్మాణంలో ఉండి, ఏడెనిమిది సార్లు వాయిదాలు పడి, వందల కోట్ల పెట్టుబడులు మోసిన హరిహర వీరమల్లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం అందుకుందో చూశాం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మరో పీడకలను మిగిలించి డిజాస్టరయ్యింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ పుణ్యమాని ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ వాటిని నిలబెట్టుకునే కంటెంట్ లేకపోవడంతో ఫైనల్ గా ఫెయిల్యూర్ తప్పలేదు. ఇప్పటికే దీనికొచ్చిన నష్టాల గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. సరే ఆడని సంగతి పక్కనపెడితే థియేటర్లలో చూడని జనాల సంఖ్య లక్షల్లో ఉంది. వాళ్లకు గుడ్ న్యూస్ చెబుతూ అమెజాన్ ప్రైమ్ అధికారిక ప్రకటన ఇచ్చింది.
ఇవాళ అర్ధరాత్రి నుంచి అంటే ఆగస్ట్ 20 హరిహర వీరమల్లు స్ట్రీమింగ్ కు రాబోతోంది. థియేటర్ రిలీజ్ జరుపుకున్న సరిగ్గా 28వ రోజున ఆన్ లైన్ లోకి వచ్చేస్తోంది. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు. ఒప్పందం టైంలో నాలుగు వారాల విండో రాసుకున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు షెడ్యూల్ అయ్యింది. కాకపోతే ఇంత పెద్ద ప్యాన్ ఇండియా మూవీ మరీ నాలుగు వారాలకే ఓటిటిలో రావడం అంత మంచి పరిణామం కాదనేది బయ్యర్ వర్గాలు సాధారణంగా చెప్పే మాట. కానీ సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఈ తక్కువ విండోనే ప్రొడ్యూసర్లకే శ్రీరామ రక్షలా నిలుస్తోందనేది కూడా వాస్తవమే.
ఇప్పుడు డిజిటల్ లో చూడబోతున్న ఆడియన్స్ రియాక్షన్లు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. ట్రోలింగ్ చేస్తారా లేక సనాతన ధర్మం గురించి పవన్ టచ్ చేసిన కాన్సెప్ట్ ని స్వాగతిస్తారా అనేది ఆసక్తికరం కానుంది. ఇదంతా ఓకే కానీ హరిహర వీరమల్లు పార్ట్ 2 అంతిమ యుద్ధం ఉంటుందో లేదో అనే దానికి సమాధానం ఇన్ డైరెక్ట్ గా దొరుకుతోంది. మొదటి భాగానికి వచ్చిన రెస్పాన్స్ చూసి సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడం రిస్కే అవుతుంది. పైగా ఇప్పుడొచ్చిన నష్టాలకు తోడు రత్నం కొత్తగా పెట్టుబడులు తేవడం కష్టం. రేపటి నుంచి సోషల్ మీడియాలో హరిహర వీరమల్లుకు సంబంధించిన రియాక్షన్స్ ఎలా ఉంటాయో వెయిట్ అండ్ సీ.
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…