ఒకప్పుడు ఇద్దరు హీరోయిన్ల ముద్దుల ప్రియుడిగా శోభన్ బాబు తర్వాత అంత ఇమేజ్ సంపాదించుకున్న జగపతి బాబు సీనియర్ గా మారే కొద్దీ హీరో వేషాలు తగ్గించేయడం చూశాం. లెజెండ్ తో విలన్ గా మారి బాలకృష్ణకు ధీటుగా ఫ్యాక్షనిజంని పండించిన తీరు ఆయనకో గొప్ప ఇన్నింగ్స్ ని నిర్మించి ఇచ్చింది. ఎంతగా అంటే జగ్గు భాయ్ డేట్లు కావాలంటే దర్శక నిర్మాతలు చాలా ముందుగానే ప్లాన్ చేసుకునేలా. నాన్నకు ప్రేమతో, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్లు వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం ఇవ్వలేదు. అయితే ఈ మధ్య జగపతిబాబు దూకుడు కొంత తగ్గింది. ఇతర బాషల విలన్లు పెరిగాక స్లో అయ్యారు.
దీంతో తెలివిగా టాక్ షో యాంకర్ అవతారం ఎత్తేశారు. జీ ఛానల్ కోసం జయమ్ము నిశ్చయమ్మురా అనే కొత్త షోకి వ్యాఖ్యాతగా సెలెబ్రిటీలను తీసుకొచ్చి వాళ్ళ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ ముచ్చట్లు చెప్పుకునే కార్యక్రమానికి తెరతీశారు. నిజానికి ఇది కొత్త కాన్సెప్ట్ కాదు. బాలకృష్ణ అన్ స్టాపబుల్ ని పోలి ఉంటుంది. గతంలో దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, సమంత లాంటి ఎందరో ఇవి ట్రై చేసినవాళ్లే. అయినా సరే జగపతిబాబు హోస్ట్ చేస్తుంటే ఫ్రెష్ నెస్ కనిపిస్తోంది. అయితే జయమ్ము నిశ్చయమ్మురాకి మూలం ఇవి కాదు. ఎప్పుడో పది సంవత్సరాల క్రితం ఇదే జీ ఛానల్ లో వచ్చిన వీకెండ్ విత్ రమేష్ దీనికి ఆధారం,.
ఎందరో శాండల్ వుడ్ స్టార్లతో హీరో రమేష్ అరవింద్ దాన్ని నడిపించిన తీరు అద్భుత స్పందన తీసుకొచ్చింది. కన్నడలో ఉన్న పేరున్న నటీనటులు సాంకేతిక నిపుణులు అందరితోనూ రమేష్ ఈ షో చేశారు. ఇప్పుడదే ఫార్మాట్ లో జయమ్ము నిశ్చయమ్మురాని తీస్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఎపిసోడ్ లో వచ్చిన ప్రముఖులకు సర్ప్రైజ్ ఇచ్చేలా వాళ్ళ కుటుంబ సభ్యులు లేదా ఎక్కడో దూరంగా ఉన్న స్నేహితులు బంధువులను తీసుకొచ్చి ఆశ్చర్యపరుస్తారు. ఇప్పటికే నాగార్జున ఎపిసోడ్ హిట్టయ్యింది. శ్రీలీలది ప్రోమోతోనే ఆకట్టుకుంటోంది. ఊహించని బడా స్టార్లు చాలానే రాబోతున్నారట.
సనాతన ధర్మం అంటే అదేదో పెద్ద బూతు అన్నట్లుగా కొందరు నాయకులు చేసే కామెంట్లు హిందువులకు తీవ్ర ఆగ్రహమే తెప్పిస్తుంటాయి.…
వైసీపీ అధికారంలో ఉండగా.. ఆపార్టీకి చెందిన నాయకులు అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న విమర్శలు ఉన్నాయి. మద్యం నుంచి ఇసుక దాకా,…
పెద్ది ప్రమోషన్లు చివరి స్టేజికి వచ్చేశాయి. ఇంకో వారం కన్నా తక్కువ టైం ఉండటంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ పెరుగుతోంది.…
దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…
రాష్ట్రవ్యాప్తంగా మహానాడు మహా వైభవంగా జరిగింది. ఆన్లైన్ వేదికగా నిర్వహించినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ నాయకులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున…
కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…