ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీల మధ్య ఎంత అంతరం చెరిగిపోయినా సరే.. ఓ భారతీయ నటుడికి హాలీవుడ్ సినిమాలో అవకాశం దక్కడం గొప్ప విషయమే. అలాంటి అరుదైన ఛాన్స్ తన చేతికి వచ్చినట్లే వచ్చి చేజారిందని అంటున్నాడు మలయాళ విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్. మలయాళంలో చిన్న సినిమాలతో మొదలుపెట్టి.. చాలా పెద్ద రేంజికి ఎదిగిపోయాడు ఫాహద్. విక్రమ్, పుష్ప-2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో అతను తిరుగులేని పాపులారిటీ సంపాదించాడు. ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ వాంటెడ్ యాక్టర్లలో ఒకడైన ఫాహద్కు హాలీవుడ్లో నటించే అవకాశం వచ్చిందట.
కానీ తనకు ఇంగ్లిష్ సరిగా రాకపోవడం వల్ల ఆ ఛాన్స్ మిస్ అయినట్లు తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఫాహద్ షాకింగ్ విషయం వెల్లడించాడు. అకాడమీ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అలెజాండ్రో గొంజాలెజ్ ఇనారిటు ఫాహద్కు తన సినిమాలో ఒక రోల్ ఆఫర్ చేశాడట. ది రివెనెంట్, బర్డ్ మ్యాన్ లాంటి భారీ చిత్రాలు రూపొందించిన దర్శకుడాయన. తన సినిమాలో నటిస్తావా అంటూ ఇనారిటునే స్వయంగా తనకు కాల్ చేసి అడిగాడని.. కానీ తాను ఆయనతో మాట్లాడిన విధానంతో ఆయన సంతృప్తి చెందలేదని.. తన ఇంగ్లిష్ యాక్సెంట్ ఆయనకు నచ్చలేదని ఫాహద్ తెలిపాడు.
భాషలో మెరుగులు దిద్దుకునేందుకు మూడు నెలల పాటు అమెరికాకు వెళ్లి అక్కడే ఉండాల్సిన పరిస్థితి తలెత్తిందని.. ఆ విషయం తనే వాళ్లకు చెప్పానని.. అన్నీ అనుకున్నట్లు జరిగితే తాను అమెరికాకు వెళ్లి ఇంగ్లిష్ యాక్సెంట్పై పట్టు సాధించి ఆ సినిమాలో నటించేవాడినని.. కానీ వాళ్లే ఆసక్తి చూపించలేదని ఫాహద్ తెలిపాడు. ఐతే కమర్షియల్ కోణంలో చూస్తే ఆ పాత్రకు తాను సరిపోనని.. ఆ రోల్ పోయిందని తనకు చింత ఏమీ లేదని.. తనకు గుర్తింపు ఇచ్చిన మలయాళంలో సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఉంటానని ఫాహద్ అన్నాడు.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…