వార్.. బాలీవుడ్లో పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాల్లో ఒకటి. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సిద్దార్థ్ ఆనంద్ రూపొందించాడీ చిత్రాన్ని. 2019లోనే ఈ చిత్రం రూ.475 కోట్ల మేర వసూళ్లు సాధించడం విశేషం. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్శ్లో ఆ సమయానికి ఇదే అతి పెద్ద హిట్. హృతిక్ రోషన్ ఈ సినిమాకు అతి పెద్ద ఆకర్షణగా నిలిచాడు. మళ్లీ హృతిక్నే పెట్టి సీక్వెల్ తీస్తూ, సౌత్ సూపర్ స్టార్లలో ఒకడైన జూనియర్ ఎన్టీఆర్ను మరో హీరో పాత్రకు ఎంచుకోవడంతో ‘వార్-2’కు మొదట్లో బంపర్ క్రేజ్ కనిపించింది. సినిమా బాగా తీస్తే ఇది వెయ్యి కోట్ల సినిమా అయ్యేదేమో.
కానీ ఇప్పుడు ‘వార్’ వసూళ్లలో 50-60 శాతానికి మించి కలెక్ట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. హృతిక్కు తోడు ఎన్టీఆర్ వచ్చాడు, కోరుకున్నంత బడ్జెట్ పెట్టే నిర్మాత ఉన్నాడు. సీక్వెల్కు ఉండే అడ్వాంటేజ్ కూడా ప్లస్. ఇన్ని ఉన్నా ‘వార్-2’ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సినిమా యావరేజ్గా ఉన్నా కాంబినేషన్, సీక్వెల్ క్రేజ్తో బాగా ఆడేది. కానీ సినిమా పాస్ మార్కులు కూడా వేయించుకోలేకపోయింది.
‘వార్-2’ ఫెయిల్యూర్ విషయంలో ప్రధానంగా నిందించాల్సింది దర్శకుడు అయాన్ ముఖర్జీనే. ఇలాంటి యాక్షన్ మూవీని డీల్ చేయడంలో అతడి పనితనం ఏమాత్రం కనిపించలేదు. బ్యాంగ్ బ్యాంగ్, వార్, పఠాన్ చిత్రాలతో స్టైలిష్ యాక్షన్ సినిమాలు తీయడంలో తనకు తానే సాటి అని సిద్దార్థ్ ఆనంద్ రుజువు చేశాడు. తెలిసిన కథలనే అతను ఆసక్తికరంగా ప్రెజెంట్ చేసేవాడు. తన టేకింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. వీఎఫెక్స్ మీద అతడికి పట్టుంది. కానీ అయాన్ ఈ విషయాలన్నింట్లో తేలిపోయాడు. తన టేకింగే పేలవం. ప్రధాన పాత్రలు రెంటినీ సరిగా తీర్చిదిద్దుకోలేదు. వాటి ప్రెజెంటేషన్, యాక్టర్ల పెర్ఫామెన్స్ కూడా ఎఫెక్టివ్గా లేదు. వీఎఫెక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
అన్ని వనరులూ ఉండి కూడా.. వాటిని ఉపయోగించుకోవడంలో అయాన్ విఫలమయ్యాడు. అందుకే ‘వార్-2’కు అంత నెగెటివ్ టాక్ వచ్చింది. దాని బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ కూడా అంతంతమాత్రంగా ఉంది. కారణాలు ఏవైనా కానీ.. ‘వార్’ తీసిన సిద్దార్థ్ను కాదని, అయాన్ చేతిలో ‘వార్-2’ను పెట్టడం యశ్ రాజ్ ఫిలిమ్స్ చేసిన అతి పెద్ద తప్పు అనడంలో సందేహం లేదు.
This post was last modified on August 18, 2025 7:18 pm
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…