బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ చలాకీదనంతో వేగంగా సినిమాలు చేస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన గురించి కొత్తగా చెప్పాల్సింది లేదు. యానిమల్ నుంచి మనకు ఇంకా దగ్గరయ్యాడు. 90 దశకంలో మీసాలతో ఖాన్లకు గట్టి పోటీ ఇచ్చిన స్టార్ గా అనిల్ కపూర్ గుర్తింపు ప్రత్యేకం. అయితే తన కెరీర్ ప్రారంభం అయ్యింది టాలీవుడ్ లోనే. 1980 సంవత్సరం బాపు దర్శకత్వంలో వచ్చిన వంశవృక్షంతో సోలో హీరోగా తొలి అడుగులు వేశాడు. అయితే అది ఫ్లాప్ కావడంతో ఇక్కడి దర్శకులు తన ప్రతిభను గుర్తించలేదు. దీంతో ముంబై తిరిగి వెళ్ళిపోయాడు.
తర్వాత అక్కడ బ్లాక్ బస్టర్లు సాధించడం, మార్కెట్ మీద పట్టు సాధించడం జరిగిపోయాయి. నాలుగు దశాబ్దాల తర్వాత అనిల్ కపూర్ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్టు లేటెస్ట్ అప్డేట్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న ఎంటర్ టైనర్ లో ఆయన్ని ఒక కీలక పాత్ర కోసం సంప్రదించినట్టు తెలిసింది. ఇది నిజమైతే ఈ ప్రాజెక్టుకి నార్త్ లో ఇంకొంచెం హైప్ తోడవుతుంది. అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చిందా లేదానేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే అనిల్ కపూర్ హిందీ సినిమాలు, వెబ్ సిరీస్ లతో చాలా బిజీగా ఉన్నాడు. డేట్లు అంత సులభంగా దొరకడం లేదు.
మరి వెంకీ అట్లూరి ఎలా ప్లాన్ చేస్తాడో చూడాలి. జూనియర్ ఎన్టీఆర్ తో వార్ 2లో తెరను పంచుకున్న అనిల్ కపూర్ కు అది హిందీ సినిమా కాబట్టి రీ ఎంట్రీ కిందకు రాదు. కానీ సూర్యతో వెంకీ అట్లూరి చేసేతున్న మూవీ బై లింగువల్. తెలుగుతో పాటు తమిళంలో షూట్ చేస్తున్నారు. డబ్బింగ్ కాదు. సో ఆ లెక్కన ఇదే పునఃప్రవేశం కిందకు వస్తుంది. సూర్య, అనిల్ కపూర్ కాంబినేషన్ తెరమీద బాగుంటుంది. 2026 వేసవిని టార్గెట్ గా పెట్టుకున్న సూర్య మూవీని సితార ఎంటర్ టైన్మెంట్స్ పెద్ద బడ్జెట్ తో నిర్మిస్తోంది. కరుప్పు పూర్తయిపోవడంతో సూర్య ఫోకస్ మొత్తం దీని మీదే ఉంది.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…