అక్కినేని నాగార్జున తన కుటుంబం విషయంలో ఎంత బాధ్యతతో ఉంటాడో అందరికీ తెలిసిందే. తన కొడుకులతో పాటు అక్కినేని ఫ్యామిలీలో అందరినీ చాలా బాగా చూసుకుంటాడని ఆయనకు పేరుంది. తన మేనల్లుడు సుమంత్, మేనకోడలు సుప్రియ.. అలాగే అక్క నాగసుశీల కుటుంబం విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ వహిస్తారు. ముఖ్యంగా భర్తను కోల్పోయిన నాగసుశీలకు నాగ్ ఎంత అండగా నిలుస్తున్నాడనే విషయం జగపతిబాబు నిర్వహిస్తున్న ఒక టీవీ షోలో వెల్లడైంది.
నాగసుశీలతో పాటు అన్నయ్య వెంకట్లతో కలిసి ఈ షోలో పాల్గొన్న సందర్భంగా నాగ్ తమ కుటుంబం పట్ల ఎంత బాధ్యతగా ఉంటాడో నాగసుశీల స్వయంగా వెల్లడించారు. ఆ ఎమోషనల్ మూమెంట్ షో చూసేవాళ్లందరి కళ్లల్లో నీళ్లు తెప్పించింది. నాగసుశీల భర్త, సుశాంత్ తండ్రి సత్యభూషణరావు చాలా ఏళ్ల కిందటే చనిపోయారు. దీర్ఘ కాలిక అనారోగ్యంతో ఆయన కన్ను మూశారు. ఐతే ఆయన మంచంపట్టి పూర్తిగా కదలికలు ఆగిపోయాక డాక్టర్లు ఇక ప్రాణం నిలవడం కష్టమని తేల్చేశారట. ఐతే ఇక పూర్తిగా ఆశలు కోల్పోయాక కూడా సత్యభూషణ్ ప్రాణం పోలేదట.
ఆ సమయంలో నాగార్జున తన అక్క దగ్గరికి వచ్చి.. ఆయన ఇంకా ఎందుకు ప్రాణం ఆపుకుంటున్నారు.. ఆయనకు ఏదైనా అసంతృప్తి ఉందా.. దేని గురించైనా ఆందోళన చెందుతున్నారా అని అడిగాడట. ఆ తర్వాత తన బావ దగ్గరికి వెళ్లి.. ‘‘అక్కకు, సుశాంత్కు నేనున్నాను. వాళ్ల బాధ్యత నాది. వాళ్లని కంటికి రెప్పలా కాపాడుకుంటాను’’ అని ఆయన చేయి పట్టుకుని భరోసా ఇచ్చాడట నాగ్. ఆ సమయంలో తన భర్తలో కదలికలు ఆగిపోయినా, ఎదుటి వాళ్లు చెప్పేది విని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాడని.. నాగ్ ఈ మాట చెప్పాక ఆయనకు ఒక భరోసా వచ్చి, తర్వాతి రోజే తుది శ్వాస విడిచాడని నాగసుశీల ఎంతో భావోద్వేగంతో చెప్పారు. ఈ మాటలు చెబుతున్నపుడు నాగార్జున కళ్లలో నీళ్లు తిరిగాయి.
This post was last modified on August 17, 2025 6:13 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…