Movie News

నాగ్ భరోసాతో కన్నుమూసిన బావ

అక్కినేని నాగార్జున తన కుటుంబం విషయంలో ఎంత బాధ్యతతో ఉంటాడో అందరికీ తెలిసిందే. తన కొడుకులతో పాటు అక్కినేని ఫ్యామిలీలో అందరినీ చాలా బాగా చూసుకుంటాడని ఆయనకు పేరుంది. తన మేనల్లుడు సుమంత్, మేనకోడలు సుప్రియ.. అలాగే అక్క నాగసుశీల కుటుంబం విషయంలో ఆయన ఎంతో శ్రద్ధ వహిస్తారు. ముఖ్యంగా భర్తను కోల్పోయిన నాగసుశీలకు నాగ్ ఎంత అండగా నిలుస్తున్నాడనే విషయం జగపతిబాబు నిర్వహిస్తున్న ఒక టీవీ షోలో వెల్లడైంది. 

నాగసుశీలతో పాటు అన్నయ్య వెంకట్‌లతో కలిసి ఈ షోలో పాల్గొన్న సందర్భంగా నాగ్‌‌ తమ కుటుంబం పట్ల ఎంత బాధ్యతగా ఉంటాడో నాగసుశీల స్వయంగా వెల్లడించారు. ఆ ఎమోషనల్ మూమెంట్ షో చూసేవాళ్లందరి కళ్లల్లో నీళ్లు తెప్పించింది. నాగసుశీల భర్త, సుశాంత్ తండ్రి సత్యభూషణరావు చాలా ఏళ్ల కిందటే చనిపోయారు. దీర్ఘ కాలిక అనారోగ్యంతో ఆయన కన్ను మూశారు. ఐతే ఆయన మంచంపట్టి పూర్తిగా కదలికలు ఆగిపోయాక డాక్టర్లు ఇక ప్రాణం నిలవడం కష్టమని తేల్చేశారట. ఐతే ఇక పూర్తిగా ఆశలు కోల్పోయాక కూడా సత్యభూషణ్ ప్రాణం పోలేదట. 

ఆ సమయంలో నాగార్జున తన అక్క దగ్గరికి వచ్చి.. ఆయన ఇంకా ఎందుకు ప్రాణం ఆపుకుంటున్నారు.. ఆయనకు ఏదైనా అసంతృప్తి ఉందా.. దేని గురించైనా ఆందోళన చెందుతున్నారా అని అడిగాడట. ఆ తర్వాత తన బావ దగ్గరికి వెళ్లి.. ‘‘అక్కకు, సుశాంత్‌కు నేనున్నాను. వాళ్ల బాధ్యత నాది. వాళ్లని కంటికి రెప్పలా కాపాడుకుంటాను’’ అని ఆయన చేయి పట్టుకుని భరోసా ఇచ్చాడట నాగ్. ఆ సమయంలో తన భర్తలో కదలికలు ఆగిపోయినా, ఎదుటి వాళ్లు చెప్పేది విని అర్థం చేసుకునే స్థితిలో ఉన్నాడని.. నాగ్ ఈ మాట చెప్పాక ఆయనకు ఒక భరోసా వచ్చి, తర్వాతి రోజే తుది శ్వాస విడిచాడని నాగసుశీల ఎంతో భావోద్వేగంతో చెప్పారు. ఈ మాటలు చెబుతున్నపుడు నాగార్జున కళ్లలో నీళ్లు తిరిగాయి.

Kumar

Recent Posts

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

1 hour ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

2 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

2 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

3 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

3 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

5 hours ago