రిలీజ్ ముందు వరకు కూలీదే పూర్తి డామినేషన్. కానీ అనూహ్యంగా రెండో రోజు నుంచి నెంబర్ల గేమ్ మొదలయ్యింది. ముఖ్యంగా నెగటివ్ టాక్ వచ్చిన వార్ 2 కి బుక్ మై షోలో పెద్ద నెంబర్లు కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. నిజానికిది టాక్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల జరిగింది కాదు. బాలీవుడ్ లో సైయారా తర్వాత చెప్పుకోదగ్గ రిలీజ్ రాలేదు. అజయ్ దేవగన్, త్రిప్తి డిమ్రి కొత్త సినిమాలు రెండూ బోల్తా కొట్టాయి. దీంతో థియేటర్ ఎక్స్ పీరియన్స్ కోసం తహతహలాడిన హిందీ ప్రేక్షకులకు వార్ 2 తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. అందులోనూ హృతిక్ రోషన్ మూవీ కాబట్టి దానికి ప్రాధాన్యం ఇచ్చేశారు.
వార్ 2లో జూనియర్ ఎన్టీఆర్ ఉండటం ఒక బోనస్ గా భావించారు తప్ప ప్రత్యేకంగా ఆ అంశం మీదే ఉత్తరాది జనాలు ఈ సినిమాని చూడటం లేదు. దానికి సాక్ష్యం తెలుగు వెర్షన్ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేకపోవడమే. తారక్ ఇమేజ్ ఓపెనింగ్స్ కి పనికి వచ్చినా అందులో పాత్ర, దాన్ని డిజైన్ చేసిన తీరు ఫ్యాన్స్ కి సైతం నచ్చలేదు. సహజంగానే కామన్ పబ్లిక్ పెదవి విరిచారు. బిసి సెంటర్స్ కోరుకునే మాస్ ఎలిమెంట్స్ లేకపోవడమే కాక సెకండాఫ్ లో ప్రీ క్లైమాక్స్ వరకు జూనియర్ పాత్ర నెగటివ్ షేడ్ లో ఉండటం వాళ్ళకు అసలు నచ్చలేదు. ఈ అంశం ఫలితం మీద ప్రభావం చూపించింది.
ఇదే జోరు సోమవారం నుంచి ఉంటుందనే గ్యారంటీ లేదు. ఓపెనింగ్స్ పరంగా హిందీలోనూ వార్ 2 కొత్త రికార్డులు సృష్టించలేకపోయింది. ఆ మాటకొస్తే వార్ కన్నా తక్కువ నెంబర్లే వచ్చాయి. కాకపోతే టాక్ వచ్చినంత తక్కువ స్థాయిలో కలెక్షన్లు పడిపోకపోవడం కొంత ఊరట కలిగిస్తోంది. తెలుగు హక్కులు కొన్న డిస్ట్రిబ్యూటర్ నాగవంశీకి నష్టాలు తప్పవు. హిందీ కన్నా ఒక్క రూపాయి ఎక్కువ రావాలన్న కోరిక నెరవేరేలా లేదు. కూలికి వచ్చిన మిక్స్డ్ టాక్ సైతం వార్ 2కి ఉపయోగపడలేదు. నార్త్ సైడ్ వార్ 2 పికప్ కావడానికి ప్రధాన కారణం హృతిక్కేనని ఒప్పుకోక తప్పదు. వసూళ్లు స్పష్టం చేస్తున్న వాస్తవమిది.
This post was last modified on August 16, 2025 4:51 pm
ఒక భారీ చిత్రం విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోవడం గత కొద్ది కాలంలో తొలిసారిగా…
గాడ్ ఆఫ్ వార్.. ఏడాది కిందట్నుంచి టాలీవుడ్లో విపరీతంగా చర్చనీయాంశం అవుతున్న ప్రాజెక్టు. ఇప్పటిదాకా ఎక్కువగా ఫ్యామిలీ, మాస్, యాక్షన్…
సినిమాల్లో పాత్రలను కొంతమంది నిజ జీవితంలో కూడా ఎంతో ఓన్ చేసుకుంటారు. తెరపై వారికి అన్యాయం జరిగితే నిజంగానే వారికేదో నష్టం…
పార్లమెంటులో డీలిమిటేషన్ సహా.. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు.. ఎంతసమయమైనా ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఈ వ్యవహారంపై…
అధికారాన్ని కోల్పోయిన తర్వాత బెంగళూరు–తాడేపల్లి మధ్యనే ఎక్కువగా సమయం గడుపుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు కొత్త నిర్ణయంపై…
వైసిపి అధినేత వైయస్ జగన్ తీరుపై మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏం రాక్షస మనస్తత్వం అంటూ…