నిన్న విడుదలైన కూలీలో నలుగురు అతి పెద్ద స్టార్లున్నారు. రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర. అయితే పాత్రల పరంగా వీళ్ళ కన్నా ఎక్కువ స్కోప్, నిడివి, ట్విస్టులు దక్కిన ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటి పేరు సౌబిన్ సాహిర్. మంజుమ్మల్ బాయ్స్ తో మనకు దగ్గరైన ఈ మలయాళ నటుడి టాలెంట్ చిన్నది కాదు. తక్కువ బడ్జెట్ చిత్రాలతోనే స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. కూలీలో అవకాశం రాగానే చాలా ఆఫర్లు వదులుకుని మరీ దీని కోసం నెలల తరబడి కాల్ షీట్లు ఇచ్చాడు. ఇప్పుడు తెరమీద దానికి తగ్గ ప్రతిఫలం కనిపిస్తోంది. నాగ్ కంటే ఎక్కువ విలనిజం తన మీదే పండింది.
టాక్స్, రివ్యూల సంగతి పక్కనపెడితే కూలిలో సౌబిన్ సాహిర్ కు మంచి స్పందన దక్కుతోంది. ముఖ్యంగా క్రూరత్వం నింపుకున్న పాత్రలో నటించడం కాదు జీవించేశాడు. ఒక సీన్ లో నిజంగానే పచ్చి బురదలో నుంచి బయటికి వచ్చి ఎక్స్ ప్రెషన్లు ఇవ్వడం యాక్టింగ్ కు పరాకాష్ట. ఇక రెండో పేరు రచిత రామ్. కన్నడలో పేరున్న హీరోయిన్. 2013లో ప్రభాస్ డార్లింగ్ రీమేక్ బుల్ బుల్ తో పరిచయమై తక్కువ టైంలోనే స్టార్లతో నటించే అవకాశం దక్కించుకుంది. 2022లో సూపర్ మచ్చితో తెలుగులో పరిచయమయ్యింది కానీ అది డిజాస్టర్ కావడంతో మళ్ళీ టాలీవుడ్ ఆఫర్లు రాలేదు. ఇప్పుడు కూలి కొత్త బ్రేక్ ఇచ్చింది.
అతి మాములుగా కనిపించి హఠాత్తుగా షేడ్స్ మారిపోయే పాత్రలో రచిత రామ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ట్విస్టులు ఇక్కడ చెప్పడం భావ్యం కాదు కానీ లోకేష్ కనగరాజ్ తన పాత్రని డిజైన్ చేసిన విధానం నిజంగా బాగుంది. డెప్త్ పరంగా తనకే ఎక్కువ ఎడ్జ్ దక్కిందనేది వాస్తవం. ముఖ్యంగా సెకండాఫ్ గ్రాఫ్ ఈమెతో పాటు సౌబిన్ సాహిర్ మీద ఎక్కువగా నడుస్తుంది. అమీర్ ఖాన్ నైనా గుర్తు పెట్టుకుంటామో లేదో కానీ వీళ్ళు మాత్రం ప్రత్యేకమైన ముద్ర వేస్తారు. బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉంటుందనేది పక్కన పెడితే సౌబిన్, రచితలకు తమిళ తెలుగులో మంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
This post was last modified on August 15, 2025 11:58 am
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…