సోషల్ మీడియా జమానాలో ఏఐ టెక్నాలజీ ప్రపంచాన్ని శాశించే దిశగా వెళ్తున్న ట్రెండ్ లో దర్శకులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ అయినా దాని వల్ల వచ్చే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. కేవలం నిమిషం టీజర్ తో విశ్వంభర చేసుకున్న డ్యామేజ్ ఎంతో కళ్లారా చూశాం. హరిహర వీరమల్లు సాయంత్రం షోకే కొంత కంటెంట్ మార్చాల్సి వచ్చిందంటే నెగటివ్ ఫీడ్ బ్యాక్ వల్ల వచ్చిన ఇంపాక్టే. ఇప్పుడు వార్ 2 విజువల్ ఎఫెక్ట్స్ మీద సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒకటి రెండు చోట్ల మినహాయించి క్వాలిటీ మరీ నాసిరకంగా ఉండటాన్ని అభిమానులే తప్పుబడుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రో సీన్ నే తీసుకుంటే మరీ ఓవర్ ది బోర్డ్ హీరోయిజంని చూపించే క్రమంలో సముద్రం నుంచి ఆకాశంపైకి వెళ్లి తిరిగి అక్కడి నుంచి దుండగుల షిప్పు మీదకు దాడి చేసే ఎపిసోడ్ లో క్వాలిటీ ఎగుడుదిగుడుగా ఉంది. ఇద్దరు హీరోలు విమానం మీద చేసే ఫైట్ సైతం జారుడు బల్ల తరహాలో మరీ లాజిక్స్ దూరంగా సిల్లీగా అనిపించడానికి కారణం దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆలోచనా విధానం ప్లస్ విఎఫ్ఎక్స్ లోపాలు. ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసేలా పోరాటాలు పెట్టొచ్చు. అవి నమ్మశక్యంగా ఉండాలి. కానీ నవ్వులాటగా ఉండకూడదు. వార్ 2లో జరిగిన తప్పు, తడబాటు ముమ్మాటికీ ఇదే.
విజువల్ ఎఫెక్ట్స్ మీద అతిగా ఆధారపడితే ఇలానే జరుగుతుందని చెప్పడం కాదు. పాతిక ముప్పై సంవత్సరాల క్రితమే కోడి రామకృష్ణ లాంటి దర్శకులు అమ్మోరు, అంజి లాంటి సినిమాల్లో ల్యాండ్ మార్క్ అనిపించే విఎఫ్ఎక్స్ ఎపిసోడ్స్ ని అద్భుతంగా చూపించారు. అలాంటిది సాంకేతిక ఇంత అభివృద్ధి చెందాక కూడా అదిపురుష్, వార్ 2 లాంటివి అత్తెసరు గ్రాఫిక్స్ తో విమర్శలు తెచ్చుకోవడం ముమ్మాటికీ స్వయంకృతాపరాధమే. హనుమాన్, కార్తికేయ 2 పరిమిత బడ్జెట్ లోనే వండర్స్ చేశాయి. మరి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టమని గర్వంగా చెప్పుకున్న వార్ 2 వాటిలో సగం కూడా లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.
This post was last modified on August 15, 2025 12:48 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…