సోషల్ మీడియా జమానాలో ఏఐ టెక్నాలజీ ప్రపంచాన్ని శాశించే దిశగా వెళ్తున్న ట్రెండ్ లో దర్శకులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాల్సిందే. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ క్వాలిటీలో ఏ మాత్రం కాంప్రమైజ్ అయినా దాని వల్ల వచ్చే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. కేవలం నిమిషం టీజర్ తో విశ్వంభర చేసుకున్న డ్యామేజ్ ఎంతో కళ్లారా చూశాం. హరిహర వీరమల్లు సాయంత్రం షోకే కొంత కంటెంట్ మార్చాల్సి వచ్చిందంటే నెగటివ్ ఫీడ్ బ్యాక్ వల్ల వచ్చిన ఇంపాక్టే. ఇప్పుడు వార్ 2 విజువల్ ఎఫెక్ట్స్ మీద సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒకటి రెండు చోట్ల మినహాయించి క్వాలిటీ మరీ నాసిరకంగా ఉండటాన్ని అభిమానులే తప్పుబడుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రో సీన్ నే తీసుకుంటే మరీ ఓవర్ ది బోర్డ్ హీరోయిజంని చూపించే క్రమంలో సముద్రం నుంచి ఆకాశంపైకి వెళ్లి తిరిగి అక్కడి నుంచి దుండగుల షిప్పు మీదకు దాడి చేసే ఎపిసోడ్ లో క్వాలిటీ ఎగుడుదిగుడుగా ఉంది. ఇద్దరు హీరోలు విమానం మీద చేసే ఫైట్ సైతం జారుడు బల్ల తరహాలో మరీ లాజిక్స్ దూరంగా సిల్లీగా అనిపించడానికి కారణం దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆలోచనా విధానం ప్లస్ విఎఫ్ఎక్స్ లోపాలు. ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసేలా పోరాటాలు పెట్టొచ్చు. అవి నమ్మశక్యంగా ఉండాలి. కానీ నవ్వులాటగా ఉండకూడదు. వార్ 2లో జరిగిన తప్పు, తడబాటు ముమ్మాటికీ ఇదే.
విజువల్ ఎఫెక్ట్స్ మీద అతిగా ఆధారపడితే ఇలానే జరుగుతుందని చెప్పడం కాదు. పాతిక ముప్పై సంవత్సరాల క్రితమే కోడి రామకృష్ణ లాంటి దర్శకులు అమ్మోరు, అంజి లాంటి సినిమాల్లో ల్యాండ్ మార్క్ అనిపించే విఎఫ్ఎక్స్ ఎపిసోడ్స్ ని అద్భుతంగా చూపించారు. అలాంటిది సాంకేతిక ఇంత అభివృద్ధి చెందాక కూడా అదిపురుష్, వార్ 2 లాంటివి అత్తెసరు గ్రాఫిక్స్ తో విమర్శలు తెచ్చుకోవడం ముమ్మాటికీ స్వయంకృతాపరాధమే. హనుమాన్, కార్తికేయ 2 పరిమిత బడ్జెట్ లోనే వండర్స్ చేశాయి. మరి నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టమని గర్వంగా చెప్పుకున్న వార్ 2 వాటిలో సగం కూడా లేకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…