Movie News

మళ్ళీ జైలుకు వెళ్లిన స్టార్ హీరో

గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రేణుకస్వామి హత్యకేసు సినీ ప్రియులు అంత సులభంగా మర్చిపోలేరు. స్వంత అభిమానిని పిలిపించి మరీ మర్డర్ చేయించిన అభియోగం మీద శాండల్ వుడ్ స్టార్ హీరో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడని 2024 జూన్ 11 అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏడు నెలలు కారాగారంలో మగ్గిన తర్వాత కర్ణాటక హైకోర్టు వీళ్లకు డిసెంబర్ లో బెయిల్ మంజూరు చేసింది. అప్పటి నుంచి దర్శన్ ఇంట్లో ఉంటూ బయట తిరుగుతున్నాడు. తనను కలుసుకోవడానికి వచ్చిన అభిమానులతో ఫోటోలు దిగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఆగిపోయిన షూటింగులు త్వరలో మొదలుపెడతారనే వార్తలు వస్తున్న టైంలో దర్శన్ కు సుప్రీమ్ కోర్టు మొట్టికాయ వేసింది. బెయిలుని రద్దు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేయడంతో అతనితో పాటు పవిత్ర గౌడని మళ్ళీ పోలీసులు జైలుకు తరలించారు. కారణాలు ఏమైనా ఇలాంటి వారిని బయట ఉంచడం వక్రబుద్దితో సమానమని న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపుతోంది. స్వయానా దర్శన్ అభిమాని అయిన రేణుకస్వామిని అతని హీరోనే హత్య చేయించినట్టు ఘటన జరిగిన వెంటనే బలమైన ఆధారాలు దొరికాయి. అయినా కూడా బెయిలు దక్కడం పట్ల అప్పట్లోనే నిరసన స్వరం గట్టిగా వినిపించింది.

దర్శన్ లాయర్లు మరోసారి బెయిలు కోసం ప్రయత్నించేందుకు రెడీ అవుతున్నారు. ఈసారి మాత్రం సులభంగా బయటికి వచ్చేలా లేడు. స్వయంగా సుప్రీమ్ కోర్టే అభ్యంతరం చెప్పినప్పుడు ఇక ఎవరైనా చేయగలింది ఏమి లేదు. దర్శన్ లో ఎలాంటి పశ్చత్తాపం లేదని, అతనికి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందేనని అభిప్రాయాలు ఎక్కువవుతున్న తరుణంలో ఇప్పుడీ పరిణామం హాట్ టాపిక్ గా మారింది. పవిత్రకు అసభ్య సందేశాలు పంపాడనే కారణంతో దర్శన్ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బెదిరిస్తే పోయడానికి ప్రాణం తీసేదాకా వెళ్ళాడు. తీరా చూస్తే సినిమాని మించిన వయొలెంట్ డ్రామా అతని జీవితంలోనే జరిగింది.

This post was last modified on August 14, 2025 7:05 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Darshan

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

6 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

7 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

7 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

7 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

7 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

8 hours ago