అగ్ర హీరోల సినిమాలు వచ్చే ఏడాదిలో చాలా తక్కువ సంఖ్యలో రిలీజ్ అవుతాయి. అంటే పండుగల సీజన్లో కూడా పెద్ద సినిమాలు ఎక్కువగా వుండకపోవచ్చు. ఆచార్య, రాధేశ్యామ్ చిత్రాలే దసరాకు కానీ రాకపోవచ్చుననే టాక్ వినిపిస్తోంది. ఇక పుష్ప, సర్కారు వారి పాట చిత్రాలు 2022లోనే వచ్చేదంటూ ఊహాగానాలు సాగుతున్నాయి. వీటిలో ఒకటి రెండు సినిమాలు ముందుగా వచ్చేసినా కానీ వచ్చే ఏడాది పూర్తిగా మిడిల్ రేంజ్ సినిమాలదే హవా అవుతుంది. ఈ సంగతిని అందరికంటే ముందుగా పసిగట్టాడు శర్వానంద్. అందుకే ఒక సినిమా తర్వాత మరొకటి అనే తన స్టయిల్ని విడిచి పెట్టేసి ప్రస్తుత సిట్యువేషన్ని ఫుల్లుగా క్యాష్ చేసుకుంటున్నాడు.
ఇప్పుడు తన సినిమాలు నిర్మాణ దశలో రెండున్నాయి. మరో మూడు సినిమాలు త్వరలోనే పట్టాలెక్కుతున్నాయి. ఆమధ్య ఫ్లాప్స్ రావడంతో తన గ్రాఫ్ పడిపోయినా కానీ శర్వానంద్ అదేమీ పట్టించుకోవడం లేదు. ఈ బంచ్లో చేస్తోన్న సినిమాల్లో రెండు, మూడు హిట్టయినా కానీ తన మార్కెట్ ఎటూ పోదని భావిస్తున్నాడు. అందుకే మునుపటి కంటే పారితోషికం కాస్త తగ్గించుకుని నిర్మాతలను మరింతగా ఆకర్షిస్తున్నాడు. కాస్త పేరున్న హీరోలంతా మునుపటి కమిట్మెంట్లతో బిజీగా వుండడంతో శర్వానంద్ ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకున్నాడు.
This post was last modified on November 20, 2020 10:50 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…