ఎన్నాళ్ళో వేచిన ఉదయం అంటూ డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు పాట పాడే రోజు వచ్చేసింది. డబ్బింగా స్ట్రెయిటా అనేది పక్కన పెడితే రెండు పెద్ద ప్యాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు విడుదలవుతుండటంతో థియేటర్ల దగ్గర వాతావరణం వర్షం కన్నా ఆహ్లాదంగా ఉంది. బుక్ మై షోలో టికెట్లు దొరకడం లేదు. హాలు ఓనర్లు వరస కాల్స్ తో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కొందరు ఏకంగా స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. నిన్నటి దాకా అత్తెసరు ఆక్యుపెన్సీలతో నింపాదిగా కాలం గడిపిన సిబ్బందికి రేపటి నుంచి క్షణం తీరిక ఉండదు. క్యాంటీన్లు, పార్కింగ్ స్టాండ్లు అన్నీ జనంతో కిక్కిరిసిపోనున్నాయి. దానికి తగ్గ ఏర్పాట్లతో సర్వం సిద్ధంగా ఉంది.
అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో కూలి ముందంజలో ఉన్నప్పటికీ వార్ 2 కూడా ధీటుగా వేగం పుంజుకోవడం తెలుగు రాష్ట్రాల వరకు మంచి పరిణామం. టాక్ కనక పాజిటివ్ ఉంటే రెండు సినిమాలు చేయబోయే ఊచకోత మాములుగా ఉండదు. యుఎస్ నుంచి వినిపిస్తున్న రిపోర్ట్స్ సానుకూలంగానే ఉన్న నేపథ్యంలో అదే తరహాలో ఇక్కడా స్పందన ఉంటే కలెక్షన్ల సునామి మాములుగా ఉండదు. ఒకపక్క వర్షాలు ఇబ్బంది పెడుతున్నా సరే ప్రేక్షకులు వాటిని లెక్క చేయడం లేదు. మొదటిరోజే రజనీకాంత్, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జునలను చూసేయాలనే ఆత్రంతో సెకండ్లలో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు.
గురువారంతో మొదలుపెట్టి ఆదివారం దాకా మొత్తం నాలుగు రోజులు వీకెండ్ రావడం వార్ 2, కూలికి అతి పెద్ద వరంగా నిలవనుంది. తెలంగాణలో టికెట్ రేట్లు పెంచకుండా గరిష్ట ధరలకే కట్టుబడటం కలెక్షన్ల విషయంలో చాలా పాజిటివ్ గా మారనుంది. అయితే ఏపీలో పెంపు ఇచ్చారు కాబట్టి దాని ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుందనేది రెండు రోజుల్లో క్లారిటీ వస్తుంది. కూలీ అడ్వాన్స్ తోనే వంద కోట్లు దాటిన మొదటి కోలీవుడ్ మూవీగా కొత్త రికార్డు సృష్టించగా వార్ 2 స్లో అండ్ స్టడీ సూత్రంగా స్థిరంగా స్పీడందుకునే పనిలో ఉంది. ఇప్పుడు అందరూ కోరుకునేది ఒకటే. రెండు హిట్టవ్వాలి. థియేటర్లు కళకళలాడాలి.
This post was last modified on August 14, 2025 12:34 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…