తెలుగమ్మాయిలకు తెలుుగలో ఛాన్సులు రావడమే కష్టం. అలాంటిది నేరుగా బాలీవుడ్కు వెళ్లి అవకాశం అందుకోవడం అంటే గగనమే. శోభిత దూళిపాళ్ల మినహాయిస్తే అలా అవకాశం అందుకున్న వాళ్లు దాదాపుగా కనిపించరు. ఐతే ఇప్పుడు ఓ హైదరాబాదీ అమ్మాయి నేరుగా బాలీవుడ్లో ఒకేసారి రెండు సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. ఆమె తెలుగులో కంటే ముందు హిందీలోనే కథానాయికగా అరంగేట్రం చేస్తుండటం విశేషం. తన పేరు.. అమ్రిన్ ఖురేషి. అందాల పోటీల్లో మెరిసిన ఈ అమ్మాయి.. రాజ్ కుమార్ సంతోషి లాంటి పెద్ద దర్శకుడి సినిమాతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆ సినిమా పేరు.. బ్యాడ్ బాయ్.
ఈ చిత్రానికి తెలుగు సినిమాతో కనెక్షన్ ఉండటం విశేషం. కొన్నేళ్ల కిందట తెలుగులో సూపర్ హిట్ అయిన రాజ్ తరుణ్ మూవీ ‘సినిమా చూపిస్త మావ’కు ఇది రీమేక్. ఇందులో ఒకప్పటి స్టార్ హీరో మిథున్ చక్రవర్తి తనయుడైన నమషి చక్రవర్తి కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఒకప్పుడు అగ్ర కథానాయకులతో సినిమాలు తీసిన రాజ్ కుమార్ సంతోషి.. గత కొన్నేళ్లలో డౌన్ అయినప్పటికీ.. లెజెండరీ స్టేటస్ ఉన్న అలాంటి డైరెక్టర్ చిత్రంతో అమ్రిన్ ఖురేషి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుండటం విశేషం.
ఆమె మరో హిందీ సినిమాలో కూడా కథానాయికగా నటించబోతోంది. అది కూడా తెలుగు రీమేకే కావడం యాదృచ్ఛికం. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘జులాయి’ హిందీలో ఈ రీమేక్లో ఎవరు హీరోగా నటించేది ఇంకా ఖరారవ్వలేదు కానీ.. కథానాయికగా మాత్రం అమ్రిన్ ఖురేషి ఫిక్సయింది. కియారా అద్వానీని గుర్తు తెచ్చేలా పర్ఫెక్ట్ లుక్తో ఉన్న అమ్రిన్ ఈ సినిమాలో బాలీవుడ్లో ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.
This post was last modified on November 20, 2020 4:54 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…