Movie News

కొత్త వివాదంలో రాజా సాబ్

ఇప్పటికే పలు వాయిదాలు, బ్రేకుల మధ్య నలిగిపోయిన ది రాజా సాబ్ మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. ప్రొడక్షన్ పార్ట్ నర్ గా వ్యవహరిస్తున్న ఐవి(ivy) ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఢిల్లీ హై కోర్టులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మీద కేసు వేయడం సంచలనం రేపుతోంది. తమతో చేసుకున్న ఒప్పందం ప్రకారం సదరు ప్రొడక్షన్ హౌస్ వ్యవహరించలేదని, అందుకే తాము పెట్టుబడిగా పెట్టిన 218 కోట్లను వెనక్కు ఇప్పించాల్సిందిగా కోరుతూ పలు అభియోగాలు చేసింది. సమయానికి పూర్తి చేయకపోవడం, అప్డేట్స్ ఇవ్వకపోవడం, పెట్టిన ఖర్చుకు సంబంధించి లెక్కలు చూపించకపోవడం వాటిలో ప్రధానమైనవి.

నిధుల వాడకం గురించి కూడా ఐవి ప్రశ్నిస్తోంది. దీనికి సంబంధించి విశ్వప్రసాద్ ఇంకా స్పందించలేదు కానీ లీగల్ గా యాక్టివ్ గా ఉండటంతో పాటు మంచి పరిజ్ఞానం ఉన్న ఆయన దీనికి ఏం సమాధానం చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికీ రాజా సాబ్ డిసెంబర్ 5 విడుదలవుతుందా లేదా అని గ్యారెంటీగా తెలియడం లేదు. సంక్రాంతి అయితే బాగుంటుందని తెలుగు బయ్యర్లు కోరుతున్నారని ఇటీవలే విశ్వప్రసాద్ పలు ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతి తెలిసిందే. ఈలోగా ఇప్పుడీ బాంబు లాంటి వార్త వచ్చి పడింది. అయితే దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందా లేదాని చెప్పలేం.

ప్రభాస్ అభిమానులు ఈ పరిణామాల పట్ల టెన్షన్ పడుతున్నారు. అసలే లేట్ అయ్యిందని ఆందోళన చెందుతుంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పుడీ కేస్ ఏంటని చర్చించుకుంటున్నారు. ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన రాజా సాబ్ షూటింగ్ తో పాటు పాటల చిత్రీకరణ వల్ల పెండింగ్ పడుతూ వచ్చింది. దర్శకుడు మారుతీ ఎప్పటికప్పుడు ప్రాజెక్టు గురించి ఊరిస్తూ వచ్చారు తప్పించి మధ్యలో కొన్ని నెలల పాటు అప్డేట్స్ ఆగిపోయాయి. దీనికన్నా లేట్ గా మొదలైన ఫౌజీ వేగంగా పరుగులు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. మరి ఇప్పుడీ ఐవి చేసిన ఆరోపణలకు పీపుల్స్ మీడియా ఏమంటుందో చూడాలి.

This post was last modified on August 13, 2025 1:13 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Raja saab

Recent Posts

స్నేహితుడి కోసం… రాజీ పడని పవన్?

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌తో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సినిమాల‌కు టాటా చెప్పేస్తాడ‌ని గ‌త ఏడాది ఓ ప్ర‌చారం జ‌రిగింది.…

18 minutes ago

దృశ్యం-3… జార్జ్ కుట్టి దాచిన సీక్రెటేంటి?

ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…

2 hours ago

కూట‌మికి `బ్ర‌హ్మాస్త్రం` ఇచ్చేసిన‌ ప‌య్యావుల ..!

కూట‌మి నాయ‌కుల‌కు ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ కీల‌క రాజ‌కీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానిక‌రం`` అంటూ..…

2 hours ago

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు కౌంట్ డౌన్?

వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ (అనంతబాబు) డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు లో విచారణ…

4 hours ago

ధనుష్‌ను ఆకాశానికెత్తేసిన మృణాల్

తమిళ స్టార్ హీరో ధనుష్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య బంధం గురించి గత కొన్ని నెలలుగా ఎంత…

4 hours ago

తారక్, ప్రభాస్ ఇద్దరూ పునుగుల పిచ్చోళ్లే

టాలీవుడ్లో భోజన ప్రియులుగా కొందరు హీరోలకు పేరుంది. అందులో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్‌ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి. తనకు…

4 hours ago