Movie News

సౌత్ క్యారెక్టర్లే గొప్ప అన్న పూజా హెగ్డే

సౌత్‌లో కొన్ని సినిమాలు చేసి బాలీవుడ్‌కు వెళ్లే హీరోయిన్లందరూ.. ఇక్కడి సినిమాలను తక్కువ చేసి మాట్లాడ్డం ఎన్నో సందర్భాల్లో జరిగింది. చాలామంది ఇక్కడి సినిమాలను డీగ్రేడ్ చేసిన వాళ్లే. కెరీర్ బాగున్నంత కాలం తమ వద్దకు వచ్చే గ్లామర్ పాత్రలకు ఓకే చెప్పి సినిమాల్లో నటిస్తారు. కానీ ఇక్కడ డౌన్ అయి అక్కడ కొన్ని మంచి పాత్రలు పడగానే.. సౌత్ వాళ్లు తమ టాలెంట్‌ను గుర్తించలేదని.. గ్లామర్ డాల్ లాగా చూశారని.. సరైన పాత్రలు ఇవ్వలేదని బురదజల్లే ప్రయత్నం చేస్తారు. ఐతే పూజా హెగ్డే మాత్రం దీనికి భిన్నంగా మాట్లాడి ఆశ్చర్యపరిచింది. ఆమె స్వతహాగా బాలీవుడ్ హీరోయినే. కానీ తెలుగు, తమిళంలోనే మంచి పాత్రలు పడ్డాయి.

హిట్లు కూడా ఇక్కడే వచ్చాయి. ఐతే ఈ మధ్య తెలుగులో ఆమెకు ఛాన్సులు తగ్గాయి. తమిళంలో కొంచెం బిజీ అయింది. హిందీలో కూడా అవకాశాలకు లోటు లేదు.
ఐతే ఒక ఇంటర్వ్యూలో పూజా మాట్లాడుతూ.. బాలీవుడ్ తనకు సరైన పాత్రలు ఇవ్వలేదని వాపోయింది. అక్కడి వాళ్లు తనను గ్లామర్ హీరోయిన్ లాగే చూశారని.. పెద్దగా గుర్తింపు లేని పాత్రలే ఇచ్చారని వ్యాఖ్యానించింది.

కానీ సౌత్ సినిమాల్లో మాత్రం తనకు మంచి మంచి క్యారెక్టర్లు దొరికాయని ఆమె చెప్పింది. చివరగా తాను నటించిన ‘రెట్రో’ సినిమాలో కార్తీక్ సుబ్బరాజ్ అద్భుతమైన పాత్ర డిజైన్ చేశాడని.. తాను ఎలా పెర్ఫామ్ చేయగలనో ఆ సినిమా చూపించిందని ఆమె చెప్పింది. ఇలాంటి పాత్రలు మరిన్ని చేయాలని ఉందని పూజా పేర్కొంది. తెలుగులో కూడా పూజా అరవింద సమేత, రాధేశ్యామ్ లాంటి చిత్రాల్లో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలే చేసింది. బాలీవుడ్లో మాత్రం ‘మొహెంజదారో’లో మినహాయిస్తే దాదాపుగా అన్నీ గ్లామర్ క్యారెక్టర్లే చేసింది పూజా.

This post was last modified on August 12, 2025 6:05 pm

Share

Recent Posts

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

58 minutes ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

60 minutes ago

సుహాస్ వాడకం ఇలా ఉండాలి

టాలెంట్ ఎంత ఉన్నా సక్సెస్ విషయంలో పోరాడుతూనే ఉన్న హీరోల్లో సుహాస్ ఒకడు. కలర్ ఫోటోకు జాతీయ అవార్డు వచ్చినా…

2 hours ago

పహల్గామ్‌పై బ్రిక్స్ ఒక్క మాట.. చైనా కూడా ఒప్పుకుంది!

పహల్గామ్ ఉగ్రదాడి విషయంలో భారత్‌కు అంతర్జాతీయ వేదికపై కీలక మద్దతు లభించింది. ఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఆమోదించిన న్యూఢిల్లీ…

3 hours ago

గుంటూరు మేయర్ సీటు ఎవరికి

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మక స్థానాల్లో గుంటూరు మేయర్ స్థానం ఒకటి. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు అమరావతి రాజధాని పరిసరాల్లో ఉండటంతో…

3 hours ago

వైసీపీ ఇలా చేస్తే.. విజ‌య‌వాడ మొత్తం టీడీపీదే..!

వ్యూహాల క‌లిమి.. నాయ‌కుల చెలిమి ఏ పార్టీకైనా అత్యంత అవ‌స‌రం. ఈ విష‌యంలో వైసీపీ చేస్తున్న వ్వ‌వ‌హారం.. పార్టీని దుంప‌నాశ‌నం…

4 hours ago