కన్నడలో అంచనాలే లేకుండా చిన్న సినిమాగా విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన సు ఫ్రమ్ సో తెలుగులో మొన్న శుక్రవారం మైత్రి ద్వారా విడుదలయ్యింది. ఒరిజినల్ వెర్షన్ కేవలం మూడు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగో వారంలోకి అడుగు పెట్టకముందే యాభై కోట్లకు దగ్గరగా వెళ్తున్న ఈ సెన్సేషన్ మన దగ్గర కూడా అదే ఫలితాన్ని అందుకుంటుందని నిర్మాతలు భావించారు. ఆ మేరకు ప్రమోషన్లు చేశారు. టీమ్ హైదరాబాద్ వచ్చి ప్రత్యేకంగా ముచ్చట్లు పంచుకున్నారు. థియేటర్ల బయట వేచి చూసి ఆడియన్స్ రియాక్షన్లు తెలుసుకున్నారు. ఇంతా చేసి సు ఫ్రమ్ సో టాలీవుడ్ లో మాత్రం సోసోగానే వెళ్తోంది.
ఇక చేతిలో ఉన్నది రెండు రోజులే. ఎల్లుండి వార్ 2, కూలీ వచ్చేస్తున్నాయి కాబట్టి సు ఫ్రమ్ సో సెలవు తీసుకోనుంది. గతంలో మైత్రి ఇదే తరహాలో రిలీజ్ చేసిన మంజుమ్మల్ బాయ్స్ మంచి వసూళ్లు సాధించింది. కానీ అదే మేజిక్ ని శాండల్ వుడ్ మూవీ రిపీట్ చేయలేకపోయింది. దీనికి కారణాలు స్పష్టం. నేటివిటీ మన ఆడియన్స్ కి అంతగా కనెక్ట్ కాలేదు. ఆర్గానిక్ కామెడీ ఉన్నప్పటికీ ఇలాంటివి గతంలో చూసిన ఫీలింగ్ మనోళ్లలో ఉంది. దానికి తోడు చిన్న ఈవెంట్ తప్ప పబ్లిసిటీ పరంగా ఎక్కువ శ్రద్ద తీసుకోలేదు. ఫలితంగా ఇది వచ్చిన సంగతే సాధారణ జనాలకు తెలియకుండా పోయింది.
ఇతర భాషల్లో సంచలనం సృష్టించినవి మన దగ్గర సేమ్ రిజల్ట్ అందుకుంటాయన్న గ్యారెంటీ లేదు. సు ఫ్రమ్ సోతో మరోసారి అది ఋజువయ్యింది. ఒకరకంగా చెప్పాలంటే టైటిల్ మైనస్ అయ్యింది. అర్థం కానట్టు వెరైటీగా పెట్టడంతో కామన్ పబ్లిక్ దీన్ని సీరియస్ గా తీసుకోలేదు. దానికి బదులు మరో పేరు పెట్టినా కొంచెం ఫుల్ వచ్చేదని ట్రేడ్ అభిప్రాయపడుతోంది. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ మినహాయించి కింది కేంద్రాల్లో వీకెండ్ లో కూడా పెద్దగా ఆక్యుపెన్సీలు కనిపించలేదు. అన్నింటికన్నా ఎక్కువ మహావతార్ నరసింహ ప్రభావం తీవ్రంగా పడింది. దాని ధాటిని కింగ్డమే తట్టుకోలేకపోయింది. ఇక సు ఫ్రమ్ సో ఎంత.
This post was last modified on August 12, 2025 12:15 pm
రేపు విడుదల కాబోతున్న కొత్త సినిమాల ప్రమోషన్ల ఘట్టం ముగిసిపోయింది. ఎవరికి వారు శాయశక్తులా తమ పబ్లిసిటీకి ఏమేం కావాలో…
అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు.…
పునర్విభజన చట్టంలో భాగంగా అసెంబ్లీ స్థానాల్ని గుండుగుత్తగా యాభై శాతం పెంచుతారన్న దానిపై ఎవరికి ఎలాంటి సందేహాల్లేవు. కాకుంటే.. లోక్…
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే...బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ...తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా…
లోక్ సభలో ఈ రోజు ప్రవేశ పెట్టే డీలిమిటేషన్ బిల్లు..మహిళా బిల్లు.. దీనికి తగ్గట్లుగా రాజ్యాంగ సవరణ బిల్లు మొత్తంగా…