హరిహర వీరమల్లు కథానాయిక నిధి అగర్వాల్ తాజాగా ఒక అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఇటీవల భీమవరంలో ఒక స్టోర్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సందర్భంగా ఆమె ప్రభుత్వ వాహనంలో ప్రయాణిస్తూ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియో ఈ రోజు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది అధికార దుర్వినియోగం కాదా.. పనవ్ కళ్యాణ్ పక్కన కథానాయికగా నటిస్తే.. ప్రభుత్వ వాహనంలో తిరగనిస్తారా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా వైసీపీ వాళ్లకు ఈ వీడియో ఆయుధంగా మారింది. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో నిధి అగర్వాల్ స్పందించింది.
తన పేరుతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. తనకు ప్రభుత్వం ఈ వాహనం సమకూర్చలేదని.. ఈవెంట్ నిర్వాహకులే ఆ వాహనం ఇచ్చి పంపారని ఆమె వెల్లడించింది. దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేసింది.
‘ఇటీవల భీమవరంలో ఓ స్టోర్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సందర్భంగా జరిగిన పరిణామాలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఈ విషయంలో నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈవెంట్ నిర్వాహకులు నా కోసం ఏర్పాటు చేసిన వాహనం ఆంధ్రప్రదేశ్ ప్ఘ్రభుత్వానిది.
అందులో నా పాత్ర ఏమీ లేదు. ప్రభుత్వ అధికారులే నా కోసం వాహనాన్ని పంపినట్లు రాస్తున్నారు. అవి నిరాధారమైన వార్తలు. ఈ విషయంలో నాకెలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ అధికారులెవరూ నాకు ఎలాంటి వాహనం పంపలేదు. నా అభిమానులకు వాస్తవాలను చెప్పడం నా బాధ్యత. ప్రతి విషయంలోనూ ప్రేమ, సహకారం అందిస్తున్న అభిమానులకు థ్యాంక్స్’’ అని నిధి స్పష్టం చేసింది. ఐతే ప్రభుత్వ అధికారులు పంపకపోయినా.. వాహనం అయిదే గవర్నమెంట్దే కావడంతో ఈ విషయంలో విమర్శలు తప్పట్లేదు. మరి ఆ కారు ఏ డిపార్ట్మెంట్ది, ప్రైవేటు కార్యక్రమానికి దాన్ని ఎలా ఉపయోగించారు అన్నది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం ఎదురు చూడాల్సిందే.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…