హరిహర వీరమల్లు కథానాయిక నిధి అగర్వాల్ తాజాగా ఒక అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఇటీవల భీమవరంలో ఒక స్టోర్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సందర్భంగా ఆమె ప్రభుత్వ వాహనంలో ప్రయాణిస్తూ కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఆ వీడియో ఈ రోజు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది అధికార దుర్వినియోగం కాదా.. పనవ్ కళ్యాణ్ పక్కన కథానాయికగా నటిస్తే.. ప్రభుత్వ వాహనంలో తిరగనిస్తారా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా వైసీపీ వాళ్లకు ఈ వీడియో ఆయుధంగా మారింది. ఈ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో నిధి అగర్వాల్ స్పందించింది.
తన పేరుతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. తనకు ప్రభుత్వం ఈ వాహనం సమకూర్చలేదని.. ఈవెంట్ నిర్వాహకులే ఆ వాహనం ఇచ్చి పంపారని ఆమె వెల్లడించింది. దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేసింది.
‘ఇటీవల భీమవరంలో ఓ స్టోర్ ప్రారంభోత్సవానికి వెళ్లిన సందర్భంగా జరిగిన పరిణామాలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. ఈ విషయంలో నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఈవెంట్ నిర్వాహకులు నా కోసం ఏర్పాటు చేసిన వాహనం ఆంధ్రప్రదేశ్ ప్ఘ్రభుత్వానిది.
అందులో నా పాత్ర ఏమీ లేదు. ప్రభుత్వ అధికారులే నా కోసం వాహనాన్ని పంపినట్లు రాస్తున్నారు. అవి నిరాధారమైన వార్తలు. ఈ విషయంలో నాకెలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ అధికారులెవరూ నాకు ఎలాంటి వాహనం పంపలేదు. నా అభిమానులకు వాస్తవాలను చెప్పడం నా బాధ్యత. ప్రతి విషయంలోనూ ప్రేమ, సహకారం అందిస్తున్న అభిమానులకు థ్యాంక్స్’’ అని నిధి స్పష్టం చేసింది. ఐతే ప్రభుత్వ అధికారులు పంపకపోయినా.. వాహనం అయిదే గవర్నమెంట్దే కావడంతో ఈ విషయంలో విమర్శలు తప్పట్లేదు. మరి ఆ కారు ఏ డిపార్ట్మెంట్ది, ప్రైవేటు కార్యక్రమానికి దాన్ని ఎలా ఉపయోగించారు అన్నది తెలియాల్సి ఉంది. పూర్తి వివరాల కోసం ఎదురు చూడాల్సిందే.
This post was last modified on August 12, 2025 11:32 am
ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…
ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్షాలు ఇచ్చిన…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమైన ప్రముఖ నటుడు దళపతి విజయ్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు పరిశీలకులు…
శర్వానంద్ హీరోగా అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన బైకర్ తొలి రెండు రోజులు నెమ్మదిగానే నడిచింది. టాక్ స్లోగా ఉండటం,…