ఇప్పటిదాకా వచ్చిన వార్ 2 ప్రమోషనల్ కంటెంట్ లో విలన్ ఎవరో తెలియకుండా జాగ్రత్త పడిన యష్ రాజ్ ఫిలిమ్స్ ఎట్టకేలకు అతని ద్వారానే ప్రేక్షకులకు పరిచయం జరిపించేసింది. యానిమల్ తో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన బాబీ డియోల్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లకు సవాల్ విసిరే క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటిదాకా స్పై యూనివర్స్ లో ఒక్క సినిమా చేయలేదని, ఏకంగా ఎపిక్ ఎంట్రీ దొరకడం చాలా ఆనందంగా ఉందని బాబీ డియోల్ చెప్పడంతో వార్ 2 మీద ఇంకో అదనపు ఆకర్షణ తోడయ్యింది. దర్శకుడు అయాన్ ముఖర్జీ చాలా ఇంటెన్స్ గా క్యారెక్టర్ డిజైన్ చేశారట.
షూటింగ్ టైంలో ప్రచారం జరిగినట్టు ఇద్దరు హీరోల్లో ఒకరికి నెగటివ్ షేడ్ ఉంటుందనేది వాస్తవం కాదు. కాకపోతే రెండు పాత్రలకు మధ్య ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుందని, అది తెరమీద సర్ప్రైజ్ ఇస్తుందని టీమ్ చెబుతోంది. యష్ రాజ్ సంస్థ టైగర్ 3 ద్వారా ఇమ్రాన్ హష్మీని గూఢచారి ప్రపంచంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు బాబీ డియోల్ ని లాంచ్ చేయడం ద్వారా స్కేల్ ఎంత పెద్దది అవుతోందో చెప్పినట్టే. ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. భారీ రిలీజ్ ప్లాన్ చేసుకున్న యష్ రాజ్ ఫిలిమ్స్ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా వాటిని ఇంకో స్థాయికి తీసుకెళ్లింది.
కూలి డామినేషన్ లో కొంచెం వెనుకబడినట్టు కనిపిస్తున్న వార్ 2 మెల్లగా బజ్ పెంచేసుకుంటోంది. కియారా అద్వానీ గ్లామర్, బాబీ డియోల్ విలనిజం, భారీ యాక్షన్ ఎపిసోడ్లు, తారక్ హృతిక్ మధ్య ఫైట్లు ఇలా కంటెంట్ పరంగా హై వోల్టేజ్ ఉన్నప్పటికీ పబ్లిసిటీ విషయంలో కొంత వెనుకబడి ఉండటం ఫ్యాన్స్ లో అసంతృప్తి రేపింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత లెక్కలు మారాయనే చెప్పాలి. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ తమ వంతుగా ఎలివేషన్లు ఎంత ఇవ్వాలో వాటిని సంపూర్ణంగా నెరవేర్చారు. ఇంకో నాలుగు రోజుల్లో రాబోయే తీర్పు కోసం ఇండస్ట్రీ సైతం అతృతగా ఎదురు చూస్తోంది.
This post was last modified on August 11, 2025 2:19 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…