ఇప్పటిదాకా వచ్చిన వార్ 2 ప్రమోషనల్ కంటెంట్ లో విలన్ ఎవరో తెలియకుండా జాగ్రత్త పడిన యష్ రాజ్ ఫిలిమ్స్ ఎట్టకేలకు అతని ద్వారానే ప్రేక్షకులకు పరిచయం జరిపించేసింది. యానిమల్ తో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన బాబీ డియోల్ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లకు సవాల్ విసిరే క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటిదాకా స్పై యూనివర్స్ లో ఒక్క సినిమా చేయలేదని, ఏకంగా ఎపిక్ ఎంట్రీ దొరకడం చాలా ఆనందంగా ఉందని బాబీ డియోల్ చెప్పడంతో వార్ 2 మీద ఇంకో అదనపు ఆకర్షణ తోడయ్యింది. దర్శకుడు అయాన్ ముఖర్జీ చాలా ఇంటెన్స్ గా క్యారెక్టర్ డిజైన్ చేశారట.
షూటింగ్ టైంలో ప్రచారం జరిగినట్టు ఇద్దరు హీరోల్లో ఒకరికి నెగటివ్ షేడ్ ఉంటుందనేది వాస్తవం కాదు. కాకపోతే రెండు పాత్రలకు మధ్య ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుందని, అది తెరమీద సర్ప్రైజ్ ఇస్తుందని టీమ్ చెబుతోంది. యష్ రాజ్ సంస్థ టైగర్ 3 ద్వారా ఇమ్రాన్ హష్మీని గూఢచారి ప్రపంచంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు బాబీ డియోల్ ని లాంచ్ చేయడం ద్వారా స్కేల్ ఎంత పెద్దది అవుతోందో చెప్పినట్టే. ఆగస్ట్ 14 విడుదల కాబోతున్న వార్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. భారీ రిలీజ్ ప్లాన్ చేసుకున్న యష్ రాజ్ ఫిలిమ్స్ నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా వాటిని ఇంకో స్థాయికి తీసుకెళ్లింది.
కూలి డామినేషన్ లో కొంచెం వెనుకబడినట్టు కనిపిస్తున్న వార్ 2 మెల్లగా బజ్ పెంచేసుకుంటోంది. కియారా అద్వానీ గ్లామర్, బాబీ డియోల్ విలనిజం, భారీ యాక్షన్ ఎపిసోడ్లు, తారక్ హృతిక్ మధ్య ఫైట్లు ఇలా కంటెంట్ పరంగా హై వోల్టేజ్ ఉన్నప్పటికీ పబ్లిసిటీ విషయంలో కొంత వెనుకబడి ఉండటం ఫ్యాన్స్ లో అసంతృప్తి రేపింది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత లెక్కలు మారాయనే చెప్పాలి. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ తమ వంతుగా ఎలివేషన్లు ఎంత ఇవ్వాలో వాటిని సంపూర్ణంగా నెరవేర్చారు. ఇంకో నాలుగు రోజుల్లో రాబోయే తీర్పు కోసం ఇండస్ట్రీ సైతం అతృతగా ఎదురు చూస్తోంది.
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…
తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై ఓ రేంజి తరహా వ్యాఖ్యలు చేసిన…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు గుప్పించారు.…