జూనియర్ ఎన్టీఆర్ తల్లి పేరు షాలిని అన్న సంగతి తెలిసిందే. కానీ ‘వార్-2’ ప్రి రిలీజ్ ఈవెంట్లో షాలినితో పాటు తన అన్న కళ్యాణ్ రామ్ తల్లి అయిన లక్ష్మిని కూడా తల్లిగా సంబోధించి తన అన్న కుటుంబంతో తనకు ఎలాంటి అనుబంధం ఉందో చాటి చెప్పాడు. తన పాతికేళ్ల సినీ ప్రయాణం గురించి ఎంతో ఉద్వేగంగా మాట్లాడిన తారక్.. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులందరినీ గుర్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో ముందుగా తన తండ్రి హరికృష్ణ పేరును ప్రస్తావించాడు తారక్. ఆ తర్వాత తల్లి షాలిని పేరు చెప్పి.. కళ్యాణ్ రామ్ తల్లి లక్ష్మిని కూడా తన తల్లి అనే సంబోధించాడు తారక్. ఆ తర్వాత దివంగత జానకిరామ్, కళ్యాణ్ రామ్ల పేర్లు ప్రస్తావించి.. వీళ్లందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నాడు.
ఇక సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ.. ఆయన ఆశీస్సులు తనపై ఎప్పుడూ ఉంటాయని.. అవి ఉన్నంత వరకు తనను ఎవ్వరూ ఆపలేరని వ్యాఖ్యానించాడు తారక్. ఇక అభిమానుల గురించి మాట్లాడుతూ తారక్ ఎప్పట్లాగే భావోద్వేగానికి గురయ్యాడు. పాతికేళ్ల ముందు తన తొలి సినిమా ప్రారంభోత్సవానికి వెళ్లినపుడు తన వెంట తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారని.. వారు కాకుండా ఒక్కరూ లేరని.. అలాంటిది ఇప్పుడు ఇంతమంది అభిమానులను సంపాదించుకున్నానని తారక్ చెప్పాడు. తొలి సినిమా మొదలైనపుడు ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో తెలియదని తారక్ అన్నాడు.
ఐతే తన తొలి సినిమా రిలీజ్ కాకముందే ముజీబ్ అని ఆదోని నుంచి ఒక వ్యక్తి వచ్చాడని.. మెహిదీపట్నంలోని తన ఆఫీస్కు అతను వస్తే ఎవరు అని అడిగితే ఫ్యాన్ అన్నాడని.. తొలి సినిమా రిలీజ్ కాకముందే ఫ్యాన్ ఏంటి అని అడిగితే.. తానంటే పడిచచ్చిపోతానని చెప్పాడని తారక్ గుర్తు చేసుకున్నాడు. అంతలో ఆ ఫ్యాన్ వేదిక మీదికి రాగా.. అతణ్ని అభిమానులకు పరిచయం చేశాడు తారక్.
తనకు జన్మనిచ్చింది తన తండ్రి హరికృష్ణ అయినప్పటికీ.. ఈ జీవితం అభిమానులకే అంకితమమని.. ఈ విషయాన్ని తన తండ్రితో కూడా చెప్పానని తారక్ అన్నాడు. ఇక ఫ్యాన్ వార్స్ వద్దంటూ అభిమానులను సుతిమెత్తగా హెచ్చరించిన తారక్.. మనకంటే గొప్ప వాళ్లు చాలామంది ఉన్నారని, వాళ్లను గౌరవించాలని హితవు పలికాడు. వార్-2 సినిమా చాలా కష్టపడి చేశామని.. సినిమా గొప్పగా ఉంటుందని.. ఇందులో చాలా ట్విస్టులు ఉంటాయని.. వాటిని బయటపెట్టకండని అభిమానులను కోరాడు తారక్. తన ప్రసంగం చివర్లో అభిమానులకు తారక్ శిరస్సు వంచి వందనం చేయడం విశేషం.
This post was last modified on August 11, 2025 12:58 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…