తెలుగు సినిమాల్లో హీరోలకు ఉండే ప్రాధాన్యం వేరు. చిన్నదైనా, పెద్దదైనా.. దాదాపు ప్రతి సినిమాలోనూ హీరోనే హైలైట్ అవుతుంటాడు. క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతగా పెర్ఫామ్ చేసినా.. హీరోలను డామినేట్ చేసే సందర్భాలు అరుదుగా వస్తుంటాయి. ఐతే స్క్రీన్ స్పేస్తో సంబంధం లేకుండా కొన్నిసార్లు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టులు చెలరేగిపోయి హీరోలను డామినేట్ చేస్తుంటారు.
తెలుగులో కొత్తగా రిలీజైన ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’లో ఇదే జరిగింది. ఇందులో హీరోగా నటించిన ఆనంద్ దేవరకొండ తొలి సినిమా ‘దొరసాని’తో పోలిస్తే బాగానే నటించినా.. అతడి తండ్రి పాత్రలో కనిపించిన గోపరాజు రమణ సినిమాలో బాగా హైలైట్ అయిపోయాడు. ఈ నటుడు చాలా ఏళ్ల నుంచే ఇండస్ట్రీలో ఉన్నాడు. సినిమాలతో పాటు సీరియళ్లలోనూ నటించాడు. కానీ తన ప్రత్యేకతను చాటుకునే అవకాశం అవి ఆయనకు ఇవ్వలేదు.
ఐతే ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’లో తండ్రి పాత్ర గోపరాజు రమణ కోసమే పుట్టినట్లుంది. తనకు పట్టున్న గుంటూరు యాసలో డైలాగులు చెప్పే అవకాశం రావడం, పాత్రను బాగా తీర్చిదిద్దడంతో ఆయన చెలరేగిపోయారంతే. పెద్దగా పేరు లేని నటుడే అయినా.. ఈ సినిమా చూడటం మొదలుపెట్టిన కొన్ని నిమిషాలకే ఆ పాత్రతో ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోతారు. పల్లెటూళ్లలో చాలా కఠినంగా కనిపించే తండ్రుల పాత్రలను డిట్టో దించేస్తూ ఆ పాత్రను అద్భుతంగా పండించాడు గోపరాజు రమణ.
తన కొడుకు తన ప్రేమ గురించి చెప్పినపుడు స్పందించే తీరు చూస్తే.. ఆ సీన్ థియేటర్లలో అయితే కేరింతలతో హోరెత్తిపోయేదనిపిస్తుంది. దాదాపుగా ప్రతి సన్నివేశంలోనూ ఈ పాత్ర ఆసక్తి రేకెత్తిస్తుంది. తెరపై మిగతా పాత్రలన్నింటినీ పక్కకు నెట్టేసి హైలైట్ అవుతుంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నది గోపరాజు రమణ గురించే. ఉన్నంతలో మంచి టాకే తెచ్చుకున్న ఈ సినిమా ఆనంద్కు ఏమాత్రం ఉపయోగపడుతుందో కానీ.. గోపరాజు రమణ కెరీర్కు మాత్రం ఇది మంచి మలుపయ్యేలా ఉంది.
This post was last modified on November 20, 2020 1:09 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…