తమ వేతనాలు, పారితోషకాలను 30 శాతం మేర పెంచాలంటూ తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఇటీవల మెరుపు సమ్మెకు దిగడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెతో హఠాత్తుగా షూటింగ్స్ ఆగిపోవడంతో ఇండస్ట్రీ అంతా స్తంభించిపోయింది. ఇప్పటికే మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులో సినీ కార్మికుల వేతనాలు ఎక్కువ అంటూ కొందరు నిర్మాతలు ఈ సమ్మెకు వ్యతిరేకంగా మాట్లాడారు. అదే సమయంలో మూడేళ్లుగా వేతనాల్లో పెంపు లేని నేపథ్యంలో కార్మికుల డిమాండ్ న్యాయమైందే అన్న అభిప్రాయాలూ వినిపించాయి. కానీ ఒకేసారి 30 శాతం పెంపు అంటే కష్టం అనే వాదనా వినిపించింది.
ఈ నేపథ్యంలో సినీ కార్మికులతో చర్చలు జరిపిన తెలుగు ఫిలిం ఛాంబర్ పెద్దలు.. ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.. జీతాలు పెంచడానికి సరే అన్నారు కానీ.. కార్మికులు కోరుకున్నట్లు కాదు. విడతల వారీగా వేతనాలు పెంచేలా ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలను సీనియర్ నిర్మాత దామోదర ప్రసాద్ మీడియా ద్వారా వెల్లడించారు.
రోజుకు రూ.2 వేలు సంపాదిస్తున్న సినీ కార్మికుడికి ఈ ఏడాది 15 శాతం పెంచడానికి చాంబర్ అంగీకరించింది. వచ్చే ఏడాది 5 శాతం, ఆ తర్వాతి ఏడాది మరో 5శాతం వేతనం పెరుగుతుంది. కార్మికులు ఎక్కువ అడిగారు కానీ.. తాము ఈ మేరకు పెంచేందుకు ఒప్పుకున్నామని దామోదర ప్రసాద్ తెలిపారు. రోజూ వెయ్యి రూపాయలు సంపాదిస్తున్న కార్మికుడికి ఇప్పుడు 20 శాతం పెంచేలా ప్రతిపాదించారు. రెండో ఏడాది పెంపు ఉండదు. మూడో ఏడాది 5 శాతం పెంపు ఉంటుంది.
చిన్న సినిమాలకు పని చేస్తున్న కార్మికులకు మాత్రం అవే వేతనాలు కొనసాగనున్నాయి. లో బడ్జెట్లో తీసే సినిమాల మీద భారం పడకుండా వాటికి పని చేసే కార్మికులకు మాత్రం అవే జీతాలు కొనసాగించాలని నిర్ణయించారు. తాము ఈ మేరకు ప్రతిపాదించామని.. వీటికి కార్మికులు సరే అంటే ఆ మేరకు వేతనాలు అమల్లోకి వస్తాయని దామోదర ప్రసాద్ తెలిపారు. మరి అంతిమంగా ఇరు వర్గాలు ఏం నిర్ణయిస్తాయో చూడాలి.
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…