తమ వేతనాలు, పారితోషకాలను 30 శాతం మేర పెంచాలంటూ తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఇటీవల మెరుపు సమ్మెకు దిగడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెతో హఠాత్తుగా షూటింగ్స్ ఆగిపోవడంతో ఇండస్ట్రీ అంతా స్తంభించిపోయింది. ఇప్పటికే మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులో సినీ కార్మికుల వేతనాలు ఎక్కువ అంటూ కొందరు నిర్మాతలు ఈ సమ్మెకు వ్యతిరేకంగా మాట్లాడారు. అదే సమయంలో మూడేళ్లుగా వేతనాల్లో పెంపు లేని నేపథ్యంలో కార్మికుల డిమాండ్ న్యాయమైందే అన్న అభిప్రాయాలూ వినిపించాయి. కానీ ఒకేసారి 30 శాతం పెంపు అంటే కష్టం అనే వాదనా వినిపించింది.
ఈ నేపథ్యంలో సినీ కార్మికులతో చర్చలు జరిపిన తెలుగు ఫిలిం ఛాంబర్ పెద్దలు.. ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.. జీతాలు పెంచడానికి సరే అన్నారు కానీ.. కార్మికులు కోరుకున్నట్లు కాదు. విడతల వారీగా వేతనాలు పెంచేలా ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలను సీనియర్ నిర్మాత దామోదర ప్రసాద్ మీడియా ద్వారా వెల్లడించారు.
రోజుకు రూ.2 వేలు సంపాదిస్తున్న సినీ కార్మికుడికి ఈ ఏడాది 15 శాతం పెంచడానికి చాంబర్ అంగీకరించింది. వచ్చే ఏడాది 5 శాతం, ఆ తర్వాతి ఏడాది మరో 5శాతం వేతనం పెరుగుతుంది. కార్మికులు ఎక్కువ అడిగారు కానీ.. తాము ఈ మేరకు పెంచేందుకు ఒప్పుకున్నామని దామోదర ప్రసాద్ తెలిపారు. రోజూ వెయ్యి రూపాయలు సంపాదిస్తున్న కార్మికుడికి ఇప్పుడు 20 శాతం పెంచేలా ప్రతిపాదించారు. రెండో ఏడాది పెంపు ఉండదు. మూడో ఏడాది 5 శాతం పెంపు ఉంటుంది.
చిన్న సినిమాలకు పని చేస్తున్న కార్మికులకు మాత్రం అవే వేతనాలు కొనసాగనున్నాయి. లో బడ్జెట్లో తీసే సినిమాల మీద భారం పడకుండా వాటికి పని చేసే కార్మికులకు మాత్రం అవే జీతాలు కొనసాగించాలని నిర్ణయించారు. తాము ఈ మేరకు ప్రతిపాదించామని.. వీటికి కార్మికులు సరే అంటే ఆ మేరకు వేతనాలు అమల్లోకి వస్తాయని దామోదర ప్రసాద్ తెలిపారు. మరి అంతిమంగా ఇరు వర్గాలు ఏం నిర్ణయిస్తాయో చూడాలి.
This post was last modified on August 9, 2025 8:02 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…