తమ వేతనాలు, పారితోషకాలను 30 శాతం మేర పెంచాలంటూ తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఇటీవల మెరుపు సమ్మెకు దిగడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెతో హఠాత్తుగా షూటింగ్స్ ఆగిపోవడంతో ఇండస్ట్రీ అంతా స్తంభించిపోయింది. ఇప్పటికే మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులో సినీ కార్మికుల వేతనాలు ఎక్కువ అంటూ కొందరు నిర్మాతలు ఈ సమ్మెకు వ్యతిరేకంగా మాట్లాడారు. అదే సమయంలో మూడేళ్లుగా వేతనాల్లో పెంపు లేని నేపథ్యంలో కార్మికుల డిమాండ్ న్యాయమైందే అన్న అభిప్రాయాలూ వినిపించాయి. కానీ ఒకేసారి 30 శాతం పెంపు అంటే కష్టం అనే వాదనా వినిపించింది.
ఈ నేపథ్యంలో సినీ కార్మికులతో చర్చలు జరిపిన తెలుగు ఫిలిం ఛాంబర్ పెద్దలు.. ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.. జీతాలు పెంచడానికి సరే అన్నారు కానీ.. కార్మికులు కోరుకున్నట్లు కాదు. విడతల వారీగా వేతనాలు పెంచేలా ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలను సీనియర్ నిర్మాత దామోదర ప్రసాద్ మీడియా ద్వారా వెల్లడించారు.
రోజుకు రూ.2 వేలు సంపాదిస్తున్న సినీ కార్మికుడికి ఈ ఏడాది 15 శాతం పెంచడానికి చాంబర్ అంగీకరించింది. వచ్చే ఏడాది 5 శాతం, ఆ తర్వాతి ఏడాది మరో 5శాతం వేతనం పెరుగుతుంది. కార్మికులు ఎక్కువ అడిగారు కానీ.. తాము ఈ మేరకు పెంచేందుకు ఒప్పుకున్నామని దామోదర ప్రసాద్ తెలిపారు. రోజూ వెయ్యి రూపాయలు సంపాదిస్తున్న కార్మికుడికి ఇప్పుడు 20 శాతం పెంచేలా ప్రతిపాదించారు. రెండో ఏడాది పెంపు ఉండదు. మూడో ఏడాది 5 శాతం పెంపు ఉంటుంది.
చిన్న సినిమాలకు పని చేస్తున్న కార్మికులకు మాత్రం అవే వేతనాలు కొనసాగనున్నాయి. లో బడ్జెట్లో తీసే సినిమాల మీద భారం పడకుండా వాటికి పని చేసే కార్మికులకు మాత్రం అవే జీతాలు కొనసాగించాలని నిర్ణయించారు. తాము ఈ మేరకు ప్రతిపాదించామని.. వీటికి కార్మికులు సరే అంటే ఆ మేరకు వేతనాలు అమల్లోకి వస్తాయని దామోదర ప్రసాద్ తెలిపారు. మరి అంతిమంగా ఇరు వర్గాలు ఏం నిర్ణయిస్తాయో చూడాలి.
This post was last modified on August 9, 2025 8:02 pm
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…