తమ వేతనాలు, పారితోషకాలను 30 శాతం మేర పెంచాలంటూ తెలుగు ఫిలిం ఫెడరేషన్ ఇటీవల మెరుపు సమ్మెకు దిగడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ సమ్మెతో హఠాత్తుగా షూటింగ్స్ ఆగిపోవడంతో ఇండస్ట్రీ అంతా స్తంభించిపోయింది. ఇప్పటికే మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే తెలుగులో సినీ కార్మికుల వేతనాలు ఎక్కువ అంటూ కొందరు నిర్మాతలు ఈ సమ్మెకు వ్యతిరేకంగా మాట్లాడారు. అదే సమయంలో మూడేళ్లుగా వేతనాల్లో పెంపు లేని నేపథ్యంలో కార్మికుల డిమాండ్ న్యాయమైందే అన్న అభిప్రాయాలూ వినిపించాయి. కానీ ఒకేసారి 30 శాతం పెంపు అంటే కష్టం అనే వాదనా వినిపించింది.
ఈ నేపథ్యంలో సినీ కార్మికులతో చర్చలు జరిపిన తెలుగు ఫిలిం ఛాంబర్ పెద్దలు.. ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.. జీతాలు పెంచడానికి సరే అన్నారు కానీ.. కార్మికులు కోరుకున్నట్లు కాదు. విడతల వారీగా వేతనాలు పెంచేలా ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలను సీనియర్ నిర్మాత దామోదర ప్రసాద్ మీడియా ద్వారా వెల్లడించారు.
రోజుకు రూ.2 వేలు సంపాదిస్తున్న సినీ కార్మికుడికి ఈ ఏడాది 15 శాతం పెంచడానికి చాంబర్ అంగీకరించింది. వచ్చే ఏడాది 5 శాతం, ఆ తర్వాతి ఏడాది మరో 5శాతం వేతనం పెరుగుతుంది. కార్మికులు ఎక్కువ అడిగారు కానీ.. తాము ఈ మేరకు పెంచేందుకు ఒప్పుకున్నామని దామోదర ప్రసాద్ తెలిపారు. రోజూ వెయ్యి రూపాయలు సంపాదిస్తున్న కార్మికుడికి ఇప్పుడు 20 శాతం పెంచేలా ప్రతిపాదించారు. రెండో ఏడాది పెంపు ఉండదు. మూడో ఏడాది 5 శాతం పెంపు ఉంటుంది.
చిన్న సినిమాలకు పని చేస్తున్న కార్మికులకు మాత్రం అవే వేతనాలు కొనసాగనున్నాయి. లో బడ్జెట్లో తీసే సినిమాల మీద భారం పడకుండా వాటికి పని చేసే కార్మికులకు మాత్రం అవే జీతాలు కొనసాగించాలని నిర్ణయించారు. తాము ఈ మేరకు ప్రతిపాదించామని.. వీటికి కార్మికులు సరే అంటే ఆ మేరకు వేతనాలు అమల్లోకి వస్తాయని దామోదర ప్రసాద్ తెలిపారు. మరి అంతిమంగా ఇరు వర్గాలు ఏం నిర్ణయిస్తాయో చూడాలి.
This post was last modified on August 9, 2025 8:02 pm
నిన్న కల్ట్ టీజర్ రిలీజయ్యాక దాని మీద పెద్ద చర్చే జరుగుతోంది. ముఖ్యంగా హీరో కం దర్శకుడు విశ్వక్ సేన్…
హీరోల కోసం థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు చాలామందే ఉంటారు. హీరోయిన్ల గ్లామర్ కోసం కూడా కొంతమంది సినిమాలకు వస్తారు. కానీ…
“పవన్ కళ్యాణ్ హఠావో..పాలిటిక్స్ బచావో“ పుస్తక రచయిత, యూట్యూబర్ బొగ్గుల శ్రీనివాస్ అనుమానాస్పద మృతి వ్యవహారం తెలంగాణతో పాటు ఏపీ…
గత నెల రోజులుగా టాలీవుడ్ బాక్సాఫీస్ చాలా డ్రైగా ఉంది. కపుల్ ఫ్రెండ్లీ లాంటివి కాసింత పాజిటివ్ టాక్ తో…
జై హనుమాన్.. ఈ సినిమా కోసం రెండేళ్ల కిందట్నుంచి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2024 సంక్రాంతికి…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ల కలయికలో 46 ఏళ్ల తర్వాత సినిమా రాబోతుండడం వాళ్లిద్దరి అభిమానులనే…