రేపు హైదరాబాద్ యూసఫ్ గూడలో జరగబోయే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ పట్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమనుల ఉద్వేగం మాములుగా లేదు. ఎందుకంటే తారక్ ని తెలుగు రాష్ట్రాల పబ్లిక్ స్టేజి మీద చూసి, తన మాటలు విని దశాబ్దం దాటేసింది. అన్న కళ్యాణ్ రామ్ సినిమా వేడుకలు లేదా ఇతర హీరోల కోసం గెస్టుగా వెళ్ళినప్పుడు తప్పించి తన కోసం ఈవెంట్ జరిగి అక్షరాలా పుష్కరం అయిపోయింది. గత ఏడాది దేవర వేడుకని నోవాటెల్ లో చేయాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఫ్యాన్స్ తాకిడి తట్టుకోలేక రద్దు చేయాల్సి వచ్చింది. వెన్యూ దాకా వచ్చిన అతిథులు తమ క్యారవాన్లలో వెనక్కు వెళ్లిపోయారు. తారక్ అసలు చేరుకునే ఛాన్స్ లేకపోయింది.
ఇప్పుడు పోలీస్ గ్రౌండ్స్ కాబట్టి అంత ఇబ్బంది ఉండదు. సో పెద్ద ఎత్తున జనాన్ని అనుమతించేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఆనందం కలిగించే విషయం. ఆందోళన ఏంటంటే గత రెండు రోజులుగా భాగ్యనగరాన్ని వర్షం ముంచెత్తుతోంది. ముఖ్యంగా సాయంత్రం పూట ఉగ్ర రూపం చూపిస్తోంది. ఎక్కడిక్కడ ట్రాఫిక్ స్తంభించి జన జీవనం అస్తవ్యస్తం అయిపోతోంది. ఇలాంటి సిచువేషన్ లో వార్ 2 ఈవెంట్ కు వరుణ దేవుడు ఏమైనా పరీక్ష పెడితే ఇబ్బందులు తప్పవు. ఒకవైపు సముద్రంలా ఫ్యాన్స్ తాకిడి, ఇంకో వైపు సునామిలా రోడ్ల మీద నీటి వరద. అందరికీ ఇది పెద్ద సవాల్ అవుతుంది.
అందుకే ఎలాంటి అడ్డంకులు పెట్టొద్దు దేవుడా అని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేడుకుంటున్నారు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే హృతిక్ రోషన్ లాంటి అతి పెద్ద బాలీవుడ్ స్టార్ నోటి వెంట యంగ్ టైగర్ గురించి ఎలివేషన్స్ వినే ఛాన్స్ రావడం. గెస్టులుగా వచ్చే త్రివిక్రమ్ లాంటి వాళ్ళు చెప్పబోయే విశేషాల కోసం అభిమానులు ఆతృతగా ఉన్నారు. వార్ 2 ప్రమోషన్లకు సంబంధించి జరగబోయే ఈవెంట్ ఇదొక్కటే. హీరో వైపు నుంచి ప్రెస్ మీట్ సూచనలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సో పబ్లిసిటీ ఘట్టంలో ఇదే అత్యంత కీలకం కానుంది. అందుకే ఎలాంటి విఘ్నాలు రాకూడదని నిర్మాతలు కోరుకుంటున్నారు.
This post was last modified on August 9, 2025 9:01 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…