హిందీ టీవీ సీరియళ్లు, షోలు చూసేవాళ్లకు గౌతమి కపూర్ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీఐడీ సహా పలు సీరియళ్లలో ఆమె నటించింది. హాట్ స్టార్లో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ స్పెషల్ ఆప్స్లో కేకే మీనన్ భార్య పాత్రలోనూ గౌతమి మంచి గుర్తింపే సంపాదించింది. గౌతమి పలు చిత్రాల్లోనూ క్యారెక్టర్ రోల్స్ చేసింది. ఆమె భర్త రామ్ కపూర్ కూడా హిందీ సీరియళ్లు, సినిమాలతో బాగానే పాపులర్. నటిగా ఎక్కువగా ట్రెడిషనల్ రోల్సే చేసిన గౌతమి.. తనకున్న ఇమేజ్కు భిన్నంగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో గౌతమి ఏమందంటే..?
తన కూతురు 16వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా తనతో జరిగిన సంభాషణ గురించి గౌతమి ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె ఆ వయసుకు రాగానే తనకు ఏం గిఫ్ట్ ఇద్దామా అని ఆలోచించానని.. ఆ క్రమంలో సెక్స్ టాయ్స్ ఏం కావాలి అని తెలుసుకునే ప్రయత్నం చేశానని.. వైబ్రేటర్ గిఫ్ట్గా ఇవ్వాలా అని అడిగానని గౌతమి వెల్లడించింది. తన నుంచి ఇది ఊహించని తన కూతురు నీకేమైనా మతిపోయిందా అన్నట్లు చూసిందని.. చాలా ఇబ్బంది పడిందని గౌతమి తెలిపింది. కానీ తన తల్లి ఆ వయసులో తనతో అలా మాట్లాడలేకపోయిందని.. అవసరాలు, ఆనందాల గురించి ఆలోచించలేదని.. తాను అనుభవించలేకపోయిన సంతోషాలను తన కూతురికి ఇవ్వాలన్న ఉద్దేశంతో తాను ఆమెను ఈ ప్రశ్నలు అడిగినట్లు గౌతమి వెల్లడించింది.
ఐతే తన కూతురు ఆ సమయానికి తనతో కోపంగా వ్యవహరించినప్పటికీ.. ఇంకో మూడేళ్ల తర్వాత తనకు పరిణతి వచ్చి.. తాను అప్పుడలా అడగడం కరెక్టే అని చెప్పిందని గౌతమి వెల్లడించడం గమనార్హం. ఐతే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారమే రేపాయి. మన సొసైటీ అంత అడ్వాన్స్డ్ అయిపోయిందా.. కూతురితో ఓ తల్లి ఇలాగేనా మాట్లాడేది.. దీని ద్వారా సొసైటీకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అంటూ గౌతమి మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
This post was last modified on August 9, 2025 7:08 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…