హిందీ టీవీ సీరియళ్లు, షోలు చూసేవాళ్లకు గౌతమి కపూర్ పేరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీఐడీ సహా పలు సీరియళ్లలో ఆమె నటించింది. హాట్ స్టార్లో సూపర్ హిట్ అయిన వెబ్ సిరీస్ స్పెషల్ ఆప్స్లో కేకే మీనన్ భార్య పాత్రలోనూ గౌతమి మంచి గుర్తింపే సంపాదించింది. గౌతమి పలు చిత్రాల్లోనూ క్యారెక్టర్ రోల్స్ చేసింది. ఆమె భర్త రామ్ కపూర్ కూడా హిందీ సీరియళ్లు, సినిమాలతో బాగానే పాపులర్. నటిగా ఎక్కువగా ట్రెడిషనల్ రోల్సే చేసిన గౌతమి.. తనకున్న ఇమేజ్కు భిన్నంగా ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆమె మీద సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో గౌతమి ఏమందంటే..?
తన కూతురు 16వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా తనతో జరిగిన సంభాషణ గురించి గౌతమి ఈ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె ఆ వయసుకు రాగానే తనకు ఏం గిఫ్ట్ ఇద్దామా అని ఆలోచించానని.. ఆ క్రమంలో సెక్స్ టాయ్స్ ఏం కావాలి అని తెలుసుకునే ప్రయత్నం చేశానని.. వైబ్రేటర్ గిఫ్ట్గా ఇవ్వాలా అని అడిగానని గౌతమి వెల్లడించింది. తన నుంచి ఇది ఊహించని తన కూతురు నీకేమైనా మతిపోయిందా అన్నట్లు చూసిందని.. చాలా ఇబ్బంది పడిందని గౌతమి తెలిపింది. కానీ తన తల్లి ఆ వయసులో తనతో అలా మాట్లాడలేకపోయిందని.. అవసరాలు, ఆనందాల గురించి ఆలోచించలేదని.. తాను అనుభవించలేకపోయిన సంతోషాలను తన కూతురికి ఇవ్వాలన్న ఉద్దేశంతో తాను ఆమెను ఈ ప్రశ్నలు అడిగినట్లు గౌతమి వెల్లడించింది.
ఐతే తన కూతురు ఆ సమయానికి తనతో కోపంగా వ్యవహరించినప్పటికీ.. ఇంకో మూడేళ్ల తర్వాత తనకు పరిణతి వచ్చి.. తాను అప్పుడలా అడగడం కరెక్టే అని చెప్పిందని గౌతమి వెల్లడించడం గమనార్హం. ఐతే ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారమే రేపాయి. మన సొసైటీ అంత అడ్వాన్స్డ్ అయిపోయిందా.. కూతురితో ఓ తల్లి ఇలాగేనా మాట్లాడేది.. దీని ద్వారా సొసైటీకి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అంటూ గౌతమి మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…