ఏపీ తెలంగాణలో వార్ 2 స్పెషల్ షోలు తెల్లవారుఝాము నాలుగు గంటల నుంచి వేసేందుకు డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. సాధారణంగా హిందీలో అంత ఉదయాన్నే ప్రీమియర్లు వేయరు. ముందు రోజు రాత్రి లేదా మహా అయితే మార్నింగ్ ఆరు తర్వాత ఉంటాయి తప్ప వేరే టైమింగ్స్ పెట్టుకోరు. కానీ తెలుగులో అలా కాదు. దేవర, పుష్ప 2కి మిడ్ నైట్ షోలు పడ్డాయి. బ్రహ్మాండంగా వర్కవుట్ చేసుకున్నాయి. ఇదే స్ట్రాటజీ గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లుకు పని చేయలేదు. సరే ఏదైనా కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది కనక ఫలితం వచ్చే దాకా ఎదురు చూడాలి.
ఇదిలా ఉండగా వార్ 2 ప్రీమియర్లు వేయడం సేఫా కాదా అనే దాని మీద పంపిణి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎంత జూనియర్ ఎన్టీఆర్ ఉన్నా ఇది హిందీ మూవీ. మనకు డబ్బింగ్ వెర్షనే వస్తుంది. సో బాలీవుడ్ ఫ్లేవర్ తో నిండి ఉంటుంది. నిద్ర పోకుండా అంత చీకటి ఉండగానే ఫ్యాన్స్ వస్తున్న షోల మీద విపరీతమైన అంచనాలు నెలకొంటున్నాయి. యావరేజ్ ఉన్నా చాలు అసంతృప్తితో ఫ్లాప్ అని రుద్దేస్తున్నారు. గుంటూరు కారం లాంటి సినిమాలకు దీని వల్ల జరిగిన డ్యామేజ్ చాలా ఎక్కువ. అందుకే వార్ 2 విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. పర్మిషన్లైతే అడిగారని వినికిడి.
ఇది కాకుండా యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. ఎందుకంటే ఉత్తరాది కంటే రెండు మూడు గంటల ముందే దక్షిణాదిలో షోలు వేయడం వల్ల వచ్చే ఫలితాల గురించి ఒక విశ్లేషణ చేసుకోవాలి. అసలే కూలీతో పోటీ ఉంది. వార్ 2 ని ఎంత లేదనుకున్నా తమిళ అభిమానులు టార్గెట్ చేసుకుని తీరతారు. పరస్పరం నెగటివ్ ప్రాపగండాలు చేసుకోవడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. ఇవన్నీ వార్ 2 కాచుకోవాల్సి ఉంటుంది. నేటివిటీ ఫ్యాక్టర్ ఒక్కటే సమస్యగా మారనున్న వార్ 2కి అండగా నిలబడుతోంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే. దేవరలాగా దీన్ని కూడా కాచుకుంటే బ్లాక్ బస్టర్ ఖాతాలో పడినట్టే.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…
కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…
జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…
కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…
ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…
ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…