ఏపీ తెలంగాణలో వార్ 2 స్పెషల్ షోలు తెల్లవారుఝాము నాలుగు గంటల నుంచి వేసేందుకు డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. సాధారణంగా హిందీలో అంత ఉదయాన్నే ప్రీమియర్లు వేయరు. ముందు రోజు రాత్రి లేదా మహా అయితే మార్నింగ్ ఆరు తర్వాత ఉంటాయి తప్ప వేరే టైమింగ్స్ పెట్టుకోరు. కానీ తెలుగులో అలా కాదు. దేవర, పుష్ప 2కి మిడ్ నైట్ షోలు పడ్డాయి. బ్రహ్మాండంగా వర్కవుట్ చేసుకున్నాయి. ఇదే స్ట్రాటజీ గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లుకు పని చేయలేదు. సరే ఏదైనా కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది కనక ఫలితం వచ్చే దాకా ఎదురు చూడాలి.
ఇదిలా ఉండగా వార్ 2 ప్రీమియర్లు వేయడం సేఫా కాదా అనే దాని మీద పంపిణి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎంత జూనియర్ ఎన్టీఆర్ ఉన్నా ఇది హిందీ మూవీ. మనకు డబ్బింగ్ వెర్షనే వస్తుంది. సో బాలీవుడ్ ఫ్లేవర్ తో నిండి ఉంటుంది. నిద్ర పోకుండా అంత చీకటి ఉండగానే ఫ్యాన్స్ వస్తున్న షోల మీద విపరీతమైన అంచనాలు నెలకొంటున్నాయి. యావరేజ్ ఉన్నా చాలు అసంతృప్తితో ఫ్లాప్ అని రుద్దేస్తున్నారు. గుంటూరు కారం లాంటి సినిమాలకు దీని వల్ల జరిగిన డ్యామేజ్ చాలా ఎక్కువ. అందుకే వార్ 2 విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. పర్మిషన్లైతే అడిగారని వినికిడి.
ఇది కాకుండా యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. ఎందుకంటే ఉత్తరాది కంటే రెండు మూడు గంటల ముందే దక్షిణాదిలో షోలు వేయడం వల్ల వచ్చే ఫలితాల గురించి ఒక విశ్లేషణ చేసుకోవాలి. అసలే కూలీతో పోటీ ఉంది. వార్ 2 ని ఎంత లేదనుకున్నా తమిళ అభిమానులు టార్గెట్ చేసుకుని తీరతారు. పరస్పరం నెగటివ్ ప్రాపగండాలు చేసుకోవడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. ఇవన్నీ వార్ 2 కాచుకోవాల్సి ఉంటుంది. నేటివిటీ ఫ్యాక్టర్ ఒక్కటే సమస్యగా మారనున్న వార్ 2కి అండగా నిలబడుతోంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే. దేవరలాగా దీన్ని కూడా కాచుకుంటే బ్లాక్ బస్టర్ ఖాతాలో పడినట్టే.
This post was last modified on August 8, 2025 4:51 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…