ఏపీ తెలంగాణలో వార్ 2 స్పెషల్ షోలు తెల్లవారుఝాము నాలుగు గంటల నుంచి వేసేందుకు డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. సాధారణంగా హిందీలో అంత ఉదయాన్నే ప్రీమియర్లు వేయరు. ముందు రోజు రాత్రి లేదా మహా అయితే మార్నింగ్ ఆరు తర్వాత ఉంటాయి తప్ప వేరే టైమింగ్స్ పెట్టుకోరు. కానీ తెలుగులో అలా కాదు. దేవర, పుష్ప 2కి మిడ్ నైట్ షోలు పడ్డాయి. బ్రహ్మాండంగా వర్కవుట్ చేసుకున్నాయి. ఇదే స్ట్రాటజీ గేమ్ ఛేంజర్, హరిహర వీరమల్లుకు పని చేయలేదు. సరే ఏదైనా కంటెంట్ మీద ఆధారపడి ఉంటుంది కనక ఫలితం వచ్చే దాకా ఎదురు చూడాలి.
ఇదిలా ఉండగా వార్ 2 ప్రీమియర్లు వేయడం సేఫా కాదా అనే దాని మీద పంపిణి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎంత జూనియర్ ఎన్టీఆర్ ఉన్నా ఇది హిందీ మూవీ. మనకు డబ్బింగ్ వెర్షనే వస్తుంది. సో బాలీవుడ్ ఫ్లేవర్ తో నిండి ఉంటుంది. నిద్ర పోకుండా అంత చీకటి ఉండగానే ఫ్యాన్స్ వస్తున్న షోల మీద విపరీతమైన అంచనాలు నెలకొంటున్నాయి. యావరేజ్ ఉన్నా చాలు అసంతృప్తితో ఫ్లాప్ అని రుద్దేస్తున్నారు. గుంటూరు కారం లాంటి సినిమాలకు దీని వల్ల జరిగిన డ్యామేజ్ చాలా ఎక్కువ. అందుకే వార్ 2 విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. పర్మిషన్లైతే అడిగారని వినికిడి.
ఇది కాకుండా యష్ రాజ్ ఫిలిమ్స్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. ఎందుకంటే ఉత్తరాది కంటే రెండు మూడు గంటల ముందే దక్షిణాదిలో షోలు వేయడం వల్ల వచ్చే ఫలితాల గురించి ఒక విశ్లేషణ చేసుకోవాలి. అసలే కూలీతో పోటీ ఉంది. వార్ 2 ని ఎంత లేదనుకున్నా తమిళ అభిమానులు టార్గెట్ చేసుకుని తీరతారు. పరస్పరం నెగటివ్ ప్రాపగండాలు చేసుకోవడానికి కొందరు సిద్ధంగా ఉంటారు. ఇవన్నీ వార్ 2 కాచుకోవాల్సి ఉంటుంది. నేటివిటీ ఫ్యాక్టర్ ఒక్కటే సమస్యగా మారనున్న వార్ 2కి అండగా నిలబడుతోంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులే. దేవరలాగా దీన్ని కూడా కాచుకుంటే బ్లాక్ బస్టర్ ఖాతాలో పడినట్టే.
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…
ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖులపై అసభ్యకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రశ్న రావణ్ సహా పలువురు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
పశ్చిమాసియాలో నెలకొన్న శాంతియుత పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారిపోయాయి. ఇరాన్ ను లక్ష్యంగా చేసుకుని అమెరికా భీకర దాడులకు దిగింది.…