హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ బాలకృష్ణ – బోయపాటి శీను కలయికలో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం విడుదల తేదీ గురించి జరుగుతున్న ప్రచారాలకు చెక్ పడిపోయింది. సెప్టెంబర్ 25 థియేటర్లలో అడుగు పెట్టడాన్ని ఖరారు చేస్తూ నిర్మాణ సంస్థ 14 రీల్స్ అధికారికంగా మరోసారి కన్ఫర్మ్ చేసింది. డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య, బోయపాటిల ఫోటోని షేర్ చేసుకుని ఆ గుడ్ న్యూస్ చెప్పేసింది. ఇంకొక్క పాట బాలన్స్ ఉందనే టాక్ నేపథ్యంలో ఈ నెలలోనే దాన్ని షూట్ చేయొచ్చని టాక్. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ తదితర పనులు శరవేగంగా పూర్తి చేసే దిశగా టీమ్ పరుగులు పెడుతోంది.
అసలీ డిస్కషన్స్ కి కారణం ఓజితో క్లాష్ రావడమే. నిజానికి ఈ తేదీని ముందు లాక్ చేసుకుంది అఖండ 2నే. దానికి అనుగుణంగానే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటూ ఏదీ మిస్ కాకుండా పక్కాగా పూర్తి చేసుకున్నారు. ఈలోగా ఓజి బరిలోకి రావడంతో ఎవరో ఒకరు తప్పుకుంటారనే ప్రచారం జరిగింది. తన ప్రొడక్షన్ కాకపోయినా ఈ మధ్యే విశ్వప్రసాద్ ఒకటే వస్తుందనే హింట్ ఇచ్చారు. తీరా చూస్తే ఎవరూ వెనక్కు తగ్గేదేలే అనడం పోటీని వేడెక్కిస్తోంది. డిస్ట్రిబ్యూటర్ల కోణంలో చూసుకుంటే ఓపెనింగ్స్ పరంగా బాలయ్య, పవన్ కళ్యాణ్ మధ్య కలెక్షన్లు పంచుకోవాల్సి రావడం నెంబర్లను ప్రభావితం చేస్తుంది.
సో ఓజి వర్సెస్ అఖండ 2 ఖరారైపోయింది. ఇంకో యాభై రోజుల కంటే తక్కువ సమయం ఉంది కాబట్టి ప్రమోషన్లు వేగవంతం చేయాలి. ఓజి నుంచి ఇప్పటికే మొదటి ఆడియో సింగల్ వచ్చేసింది. అఖండ 2 నే ఇంకా స్టార్ట్ చేయలేదు. రెండు సినిమాలకు తమన్ సంగీతం అందిస్తుండటం గమనించాల్సిన విషయం. ఖచ్చితంగా పోలికలు వస్తాయి కాబట్టి ఫ్యాన్స్ సంతృప్తి పరచాల్సిన పెద్ద బాధ్యత తన మీద ఉంది. ఎంతలేదన్నా రెండింటి మీద రెండు వందల కోట్లకు పైగా థియేటర్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది అంటే డబుల్ గ్రాస్ రావాలి. చూస్తుంటే సెప్టెంబర్ 25 బాక్సాఫీస్ యుద్ధం మహా రసవత్తరంగా ఉండబోతోంది.
This post was last modified on August 8, 2025 2:00 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…