హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ బాలకృష్ణ – బోయపాటి శీను కలయికలో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం విడుదల తేదీ గురించి జరుగుతున్న ప్రచారాలకు చెక్ పడిపోయింది. సెప్టెంబర్ 25 థియేటర్లలో అడుగు పెట్టడాన్ని ఖరారు చేస్తూ నిర్మాణ సంస్థ 14 రీల్స్ అధికారికంగా మరోసారి కన్ఫర్మ్ చేసింది. డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య, బోయపాటిల ఫోటోని షేర్ చేసుకుని ఆ గుడ్ న్యూస్ చెప్పేసింది. ఇంకొక్క పాట బాలన్స్ ఉందనే టాక్ నేపథ్యంలో ఈ నెలలోనే దాన్ని షూట్ చేయొచ్చని టాక్. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ తదితర పనులు శరవేగంగా పూర్తి చేసే దిశగా టీమ్ పరుగులు పెడుతోంది.
అసలీ డిస్కషన్స్ కి కారణం ఓజితో క్లాష్ రావడమే. నిజానికి ఈ తేదీని ముందు లాక్ చేసుకుంది అఖండ 2నే. దానికి అనుగుణంగానే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటూ ఏదీ మిస్ కాకుండా పక్కాగా పూర్తి చేసుకున్నారు. ఈలోగా ఓజి బరిలోకి రావడంతో ఎవరో ఒకరు తప్పుకుంటారనే ప్రచారం జరిగింది. తన ప్రొడక్షన్ కాకపోయినా ఈ మధ్యే విశ్వప్రసాద్ ఒకటే వస్తుందనే హింట్ ఇచ్చారు. తీరా చూస్తే ఎవరూ వెనక్కు తగ్గేదేలే అనడం పోటీని వేడెక్కిస్తోంది. డిస్ట్రిబ్యూటర్ల కోణంలో చూసుకుంటే ఓపెనింగ్స్ పరంగా బాలయ్య, పవన్ కళ్యాణ్ మధ్య కలెక్షన్లు పంచుకోవాల్సి రావడం నెంబర్లను ప్రభావితం చేస్తుంది.
సో ఓజి వర్సెస్ అఖండ 2 ఖరారైపోయింది. ఇంకో యాభై రోజుల కంటే తక్కువ సమయం ఉంది కాబట్టి ప్రమోషన్లు వేగవంతం చేయాలి. ఓజి నుంచి ఇప్పటికే మొదటి ఆడియో సింగల్ వచ్చేసింది. అఖండ 2 నే ఇంకా స్టార్ట్ చేయలేదు. రెండు సినిమాలకు తమన్ సంగీతం అందిస్తుండటం గమనించాల్సిన విషయం. ఖచ్చితంగా పోలికలు వస్తాయి కాబట్టి ఫ్యాన్స్ సంతృప్తి పరచాల్సిన పెద్ద బాధ్యత తన మీద ఉంది. ఎంతలేదన్నా రెండింటి మీద రెండు వందల కోట్లకు పైగా థియేటర్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది అంటే డబుల్ గ్రాస్ రావాలి. చూస్తుంటే సెప్టెంబర్ 25 బాక్సాఫీస్ యుద్ధం మహా రసవత్తరంగా ఉండబోతోంది.
This post was last modified on August 8, 2025 2:00 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…