హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ బాలకృష్ణ – బోయపాటి శీను కలయికలో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం విడుదల తేదీ గురించి జరుగుతున్న ప్రచారాలకు చెక్ పడిపోయింది. సెప్టెంబర్ 25 థియేటర్లలో అడుగు పెట్టడాన్ని ఖరారు చేస్తూ నిర్మాణ సంస్థ 14 రీల్స్ అధికారికంగా మరోసారి కన్ఫర్మ్ చేసింది. డబ్బింగ్ పూర్తి చేసిన బాలయ్య, బోయపాటిల ఫోటోని షేర్ చేసుకుని ఆ గుడ్ న్యూస్ చెప్పేసింది. ఇంకొక్క పాట బాలన్స్ ఉందనే టాక్ నేపథ్యంలో ఈ నెలలోనే దాన్ని షూట్ చేయొచ్చని టాక్. పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్ తదితర పనులు శరవేగంగా పూర్తి చేసే దిశగా టీమ్ పరుగులు పెడుతోంది.
అసలీ డిస్కషన్స్ కి కారణం ఓజితో క్లాష్ రావడమే. నిజానికి ఈ తేదీని ముందు లాక్ చేసుకుంది అఖండ 2నే. దానికి అనుగుణంగానే షెడ్యూల్స్ ప్లాన్ చేసుకుంటూ ఏదీ మిస్ కాకుండా పక్కాగా పూర్తి చేసుకున్నారు. ఈలోగా ఓజి బరిలోకి రావడంతో ఎవరో ఒకరు తప్పుకుంటారనే ప్రచారం జరిగింది. తన ప్రొడక్షన్ కాకపోయినా ఈ మధ్యే విశ్వప్రసాద్ ఒకటే వస్తుందనే హింట్ ఇచ్చారు. తీరా చూస్తే ఎవరూ వెనక్కు తగ్గేదేలే అనడం పోటీని వేడెక్కిస్తోంది. డిస్ట్రిబ్యూటర్ల కోణంలో చూసుకుంటే ఓపెనింగ్స్ పరంగా బాలయ్య, పవన్ కళ్యాణ్ మధ్య కలెక్షన్లు పంచుకోవాల్సి రావడం నెంబర్లను ప్రభావితం చేస్తుంది.
సో ఓజి వర్సెస్ అఖండ 2 ఖరారైపోయింది. ఇంకో యాభై రోజుల కంటే తక్కువ సమయం ఉంది కాబట్టి ప్రమోషన్లు వేగవంతం చేయాలి. ఓజి నుంచి ఇప్పటికే మొదటి ఆడియో సింగల్ వచ్చేసింది. అఖండ 2 నే ఇంకా స్టార్ట్ చేయలేదు. రెండు సినిమాలకు తమన్ సంగీతం అందిస్తుండటం గమనించాల్సిన విషయం. ఖచ్చితంగా పోలికలు వస్తాయి కాబట్టి ఫ్యాన్స్ సంతృప్తి పరచాల్సిన పెద్ద బాధ్యత తన మీద ఉంది. ఎంతలేదన్నా రెండింటి మీద రెండు వందల కోట్లకు పైగా థియేటర్ బిజినెస్ ఆధారపడి ఉంటుంది అంటే డబుల్ గ్రాస్ రావాలి. చూస్తుంటే సెప్టెంబర్ 25 బాక్సాఫీస్ యుద్ధం మహా రసవత్తరంగా ఉండబోతోంది.
This post was last modified on August 8, 2025 2:00 pm
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
మలయాళంలో రీసెంట్ గా విడుదలైన బెత్లేహెమ్ కుటుంబ యూనిట్ కేరళలో ఘనవిజయం సాధించింది. విశ్వనాథ్ అండ్ సన్స్ తరహాలో హీరోయిన్…