వచ్చే నెల సెప్టెంబర్ 5 బాక్సాఫీస్ కు పెద్ద పరీక్షే ఎదురయ్యేలా ఉంది. ఒకటి రెండు కాదు ఏకంగా అయిదు ప్యాన్ ఇండియా సినిమాలు తలపడటం ఆసక్తి రేపుతోంది. తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ‘మిరాయ్’ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని ఇటీవలే నిర్మాత టిజి విశ్వప్రసాద్ కన్ఫర్మ్ చేయడంతో వాయిదా ప్రచారాలకు చెక్ పడిపోయింది. హనుమాన్ తర్వాత చేసిన మూవీ కావడంతో తేజ సజ్జ మార్కెట్ పెరుగుదల దీని మీదే ఆధారపడి ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ కి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఈ మూవీలో మంచు మనోజ్ విలన్ గా నటించడం మరో హైలైట్ కానుంది.
పోస్ట్ పోన్ల పర్వంలో తడిసిన అనుష్క ‘ఘాటీ’ అదే రోజు రానుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత స్వీటీ కనిపిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ లో ఉన్నారు. మొన్నటి దాకా పెద్దగా బజ్ లేదు కానీ ట్రైలర్ తర్వాత దర్శకుడు క్రిష్ ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ రావడం దాదాపు ఖరారే. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రేపో ఎల్లుండో ఇవ్వొచ్చని టాక్. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ లవ్ థ్రిల్లర్ పూర్తిగా రష్మిక ఇమేజ్ మీదే మార్కెట్ అవుతోంది. ఇవి కాకుండా మరో రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.
శివ కార్తికేయన్ ‘మదరాసి’ మీద క్రమంగా హైప్ పెరిగేలా ఉంది. అమరన్ తర్వాతి మూవీ కావడంతో తెలుగులోనూ బిజినెస్ ఆఫర్లు బాగున్నాయి. మురుగదాస్ డైరెక్షన్ లో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం మెయిన్ అట్రాక్షన్. బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’కి సురేష్ సంస్థ అండగా నిలుస్తోంది. టీజర్ అయితే విషయం ఉందనే సందేశం ఇచ్చింది. ఇలా అందరూ మూకుమ్మడిగా సెప్టెంబర్ 5నే ఎంచుకోవడం ప్రేక్షకులకు ఎక్కువ ఆప్షన్లు ఇస్తుంది కానీ ఓపెనింగ్స్ పరంగా పరస్పరం ప్రభావితం చెందడం ఖాయం. ఎవరో ఒకరు తప్పుకుంటారేమో చూడాలి.
This post was last modified on August 7, 2025 10:31 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…
వ్యక్తిగత విషయాలే.. జగన్కు మైనస్ అవుతున్నాయా? ఆయన ఆలోచనా ధోరణి మారకపోతే ఇబ్బందులు తప్పవా? అంటే.. అవుననే సంకేతాలు పార్టీ…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…