వచ్చే నెల సెప్టెంబర్ 5 బాక్సాఫీస్ కు పెద్ద పరీక్షే ఎదురయ్యేలా ఉంది. ఒకటి రెండు కాదు ఏకంగా అయిదు ప్యాన్ ఇండియా సినిమాలు తలపడటం ఆసక్తి రేపుతోంది. తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ‘మిరాయ్’ రిలీజ్ డేట్ లో ఎలాంటి మార్పు లేదని ఇటీవలే నిర్మాత టిజి విశ్వప్రసాద్ కన్ఫర్మ్ చేయడంతో వాయిదా ప్రచారాలకు చెక్ పడిపోయింది. హనుమాన్ తర్వాత చేసిన మూవీ కావడంతో తేజ సజ్జ మార్కెట్ పెరుగుదల దీని మీదే ఆధారపడి ఉంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ కి అధిక ప్రాధాన్యం ఇచ్చిన ఈ మూవీలో మంచు మనోజ్ విలన్ గా నటించడం మరో హైలైట్ కానుంది.
పోస్ట్ పోన్ల పర్వంలో తడిసిన అనుష్క ‘ఘాటీ’ అదే రోజు రానుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత స్వీటీ కనిపిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ మెంట్ లో ఉన్నారు. మొన్నటి దాకా పెద్దగా బజ్ లేదు కానీ ట్రైలర్ తర్వాత దర్శకుడు క్రిష్ ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. రష్మిక మందన్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ రావడం దాదాపు ఖరారే. అఫీషియల్ అనౌన్స్ మెంట్ రేపో ఎల్లుండో ఇవ్వొచ్చని టాక్. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో రూపొందిన ఈ లవ్ థ్రిల్లర్ పూర్తిగా రష్మిక ఇమేజ్ మీదే మార్కెట్ అవుతోంది. ఇవి కాకుండా మరో రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి.
శివ కార్తికేయన్ ‘మదరాసి’ మీద క్రమంగా హైప్ పెరిగేలా ఉంది. అమరన్ తర్వాతి మూవీ కావడంతో తెలుగులోనూ బిజినెస్ ఆఫర్లు బాగున్నాయి. మురుగదాస్ డైరెక్షన్ లో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం మెయిన్ అట్రాక్షన్. బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’కి సురేష్ సంస్థ అండగా నిలుస్తోంది. టీజర్ అయితే విషయం ఉందనే సందేశం ఇచ్చింది. ఇలా అందరూ మూకుమ్మడిగా సెప్టెంబర్ 5నే ఎంచుకోవడం ప్రేక్షకులకు ఎక్కువ ఆప్షన్లు ఇస్తుంది కానీ ఓపెనింగ్స్ పరంగా పరస్పరం ప్రభావితం చెందడం ఖాయం. ఎవరో ఒకరు తప్పుకుంటారేమో చూడాలి.
This post was last modified on August 7, 2025 10:31 pm
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…