విజయ్ దేవరకొండ ఇలా స్టార్ ఇమేజ్ సంపాదించాడో లేదో.. అలా అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండకు కూడా హీరో వేషాలపై ఆశ పుట్టేసింది. హడావుడిగా హీరో అయిపోయాడు. ‘దొరసాని’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. కానీ ఆ సినిమా అతను ఆశించిన ఫలితాన్ని మాత్రం అందించలేదు. ‘దొరసాని’ వచ్చింది వెళ్లింది కూడా తెలియని పరిస్థితి. ఈ సినిమా ఫ్లాప్ కావడం ఒక ఇబ్బందైతే.. ఇందులో విజయ్ లుక్స్, నటన మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడం మరో సమస్య.
ఐతేనేం ఆనంద్కు అవకాశాలకేమీ లోటు లేకపోయింది. ఒకటికి మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. అందులో ఒకటి పూర్తి చేసి విడుదలకు కూడా సిద్ధం చేశాడు. అదే.. మిడిల్ క్లాస్ మెలోడీస్. కరోనా ఈ చిత్రానికి వరంలా మారిందనే చెప్పాలి. ఆనంద్ రెండో సినిమా థియేటర్లలో రిలీజైతే జనాలు ఏమాత్రం పట్టించుకునేవాళ్లన్నది సందేహమే. ఈ రోజుల్లో టాక్ ఎలా ఉన్నా హీరో స్థాయిని బట్టే జనాలు థియేటర్లు వెళ్తున్నారు. చిన్న సినిమాలు థియేటర్లలో ఆడటం చాలా చాలా కష్టమైపోతోంది.
ఐతే కరోనా కారణంగా థియేటర్లు మూతపడి ఉండటంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోనే ఆనంద్ కొత్త సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ కూడా అమేజాన్ ప్రైమ్లో వచ్చేస్తోంది. గురువారం మిడ్ నైట్ నుంచే ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. ఆనంద్ తొలి సినిమాతో పోలిస్తే ఈ చిత్రం ప్రామిసింగ్గా, పాజిటివ్గా కనిపిస్తోంది. మంచి ఎంటర్టైనర్లా కనిపిస్తున్న ఈ సినిమా ట్రైలర్తో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. కోటికి పైగా ఆ ట్రైలర్కు వ్యూస్ రావడం విశేషం.
చిన్న సినిమాలు బాగున్నా థియేటర్లకు వెళ్లి జనాలు చూడ్డం కష్టం. కానీ ఓటీటీలో మంచి టాక్ వస్తే జనాలు బాగానే చూస్తారు. ఓ మోస్తరుగా అనిపించే సినిమాలకు కూడా వ్యూస్ బాగానే వస్తున్నాయి. ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘కలర్ ఫోటో’ లాంటి సినిమాలకు వచ్చిన స్పందనే అందుకు నిదర్శనం. కాబట్టి ఈసారి ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మీద ఉన్న పాజిటివిటీకి సినిమా పర్వాలేదు అనిపించినా ఆనంద్ గట్టెక్కినట్లే.
This post was last modified on November 19, 2020 7:37 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…