విజయ్ దేవరకొండ ఇలా స్టార్ ఇమేజ్ సంపాదించాడో లేదో.. అలా అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండకు కూడా హీరో వేషాలపై ఆశ పుట్టేసింది. హడావుడిగా హీరో అయిపోయాడు. ‘దొరసాని’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. కానీ ఆ సినిమా అతను ఆశించిన ఫలితాన్ని మాత్రం అందించలేదు. ‘దొరసాని’ వచ్చింది వెళ్లింది కూడా తెలియని పరిస్థితి. ఈ సినిమా ఫ్లాప్ కావడం ఒక ఇబ్బందైతే.. ఇందులో విజయ్ లుక్స్, నటన మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడం మరో సమస్య.
ఐతేనేం ఆనంద్కు అవకాశాలకేమీ లోటు లేకపోయింది. ఒకటికి మూడు సినిమాలు లైన్లో పెట్టాడు. అందులో ఒకటి పూర్తి చేసి విడుదలకు కూడా సిద్ధం చేశాడు. అదే.. మిడిల్ క్లాస్ మెలోడీస్. కరోనా ఈ చిత్రానికి వరంలా మారిందనే చెప్పాలి. ఆనంద్ రెండో సినిమా థియేటర్లలో రిలీజైతే జనాలు ఏమాత్రం పట్టించుకునేవాళ్లన్నది సందేహమే. ఈ రోజుల్లో టాక్ ఎలా ఉన్నా హీరో స్థాయిని బట్టే జనాలు థియేటర్లు వెళ్తున్నారు. చిన్న సినిమాలు థియేటర్లలో ఆడటం చాలా చాలా కష్టమైపోతోంది.
ఐతే కరోనా కారణంగా థియేటర్లు మూతపడి ఉండటంతో చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోనే ఆనంద్ కొత్త సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ కూడా అమేజాన్ ప్రైమ్లో వచ్చేస్తోంది. గురువారం మిడ్ నైట్ నుంచే ఈ సినిమా స్ట్రీమ్ కానుంది. ఆనంద్ తొలి సినిమాతో పోలిస్తే ఈ చిత్రం ప్రామిసింగ్గా, పాజిటివ్గా కనిపిస్తోంది. మంచి ఎంటర్టైనర్లా కనిపిస్తున్న ఈ సినిమా ట్రైలర్తో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. కోటికి పైగా ఆ ట్రైలర్కు వ్యూస్ రావడం విశేషం.
చిన్న సినిమాలు బాగున్నా థియేటర్లకు వెళ్లి జనాలు చూడ్డం కష్టం. కానీ ఓటీటీలో మంచి టాక్ వస్తే జనాలు బాగానే చూస్తారు. ఓ మోస్తరుగా అనిపించే సినిమాలకు కూడా వ్యూస్ బాగానే వస్తున్నాయి. ‘ఒరేయ్ బుజ్జిగా’, ‘కలర్ ఫోటో’ లాంటి సినిమాలకు వచ్చిన స్పందనే అందుకు నిదర్శనం. కాబట్టి ఈసారి ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ మీద ఉన్న పాజిటివిటీకి సినిమా పర్వాలేదు అనిపించినా ఆనంద్ గట్టెక్కినట్లే.
This post was last modified on November 19, 2020 7:37 pm
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…
వైసీపీ అధినేత జగన్ పలువురు కీలక రాజకీయ వ్యూహకర్తలతో భేటీ అయ్యారా? వచ్చే ఎన్నికలు.. దీనికి ముందు ఆయన చేయనున్న…
ఇది జెన్ జీ కాలం. తప్పు ఎవరు చేసినా వదిలేదన్న రీతిలో నేటి యువత సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన…