బాలీవుడ్లో మోస్ట్ కాంట్రవర్శల్ డైరెక్టర్లలో వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఒకరు. కొన్నేళ్ల ముందు వరకు ఈ దర్శకుడికి పెద్దగా పేరు లేదు. ఐతే 2022లో ‘కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా తీసి సంచలనం రేపాడు. కశ్మీర్ పండిట్ల ఊచకోత నేపథ్యంలో సాగే ఈ సినిమా తీవ్ర వివాదం రేపింది. అదే సమయంలో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్నందుకుంది. కొందరు కశ్మీర్ పండిట్ల దీన గాథలను అద్భుతంగా చూపించారంటూ వివేక్ మీద ప్రశంసలు కురిపిస్తే.. ముస్లింల మీద ద్వేషాన్ని పెంచేలా తీసిన ప్రాపగండా మూవీ ఇదంటూ ఈ చిత్రాన్ని దుయ్యబట్టారు. వివేక్ విమర్శలను పట్టించుకోకుండా ఈ సక్సెస్ను మాత్రమే తీసుకుని.. ఆ తర్వాత కూడా ఈ తరహా సినిమాలే తీయడంలో నిమగ్నమయ్యాడు.
‘వ్యాక్సిన్ వార్’ సినిమా వివేక్కు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా.. ఇప్పుడు ‘బెంగాల్ ఫైల్స్’ మూవీతో రెడీ అయ్యాడు. 1947లో పశ్చిమ బెంగాల్లో జరిగిన మతపరమైన దాడుల నేపథ్యంలో సాగే సినిమా ఇది. దీని టీజర్ లాంచ్ కాగానే దుమారం రేగింది. బెంగాల్కు చెందిన అనేకమంది రాజకీయ నాయకులు వివేక్ మీద విరుచుకుపడ్డారు. ముఖ్యంగా అధికార టీఎంసీ పార్టీ వాళ్లు వివేక్ను టార్గెట్ చేశారు. ఇక్కడ మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ఆ రాష్ట్రంలో పదుల సంఖ్యలో వివేక్ మీద కేసులు నమోదయ్యాయి. ఈ సినిమాను తమ రాష్ట్రంలో రిలీజ్ చేయనివ్వమని.. వివేక్ ఇక్కడికి వస్తే అతడి అంతు చూస్తామని వార్నింగ్లు ఇచ్చారు.
ఐతే ఇంత వివాదం చెలరేగాక.. తాను పశ్చిమ బెంగాల్ను బెంగాల్కు వెళ్తే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని తెలిసి కూడా వివేక్ అగ్నిహోత్రి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. పశ్చిమ బెంగాల్లోనే ‘బెంగాల్ ఫైల్స్’ ట్రైలర్ లాంచ్ చేస్తానని.. అక్కడ తనను ఎవరు ఆపుతారో చూస్తానని వివేక్ అన్నాడు. అంతే కాక ‘బెంగాల్ ఫైల్స్’ సినిమాను బెంగాల్లో రిలీజ్ చేసి తీరుతానని కూడా ఆయన తేల్చి చెప్పారు. సెప్టెంబరు 5న ‘బెంగాల్ ఫైల్స్’ రిలీజ్ కావాల్సి ఉండగా.. నిజంగానే వివేక్ కోల్కతాకు వెళ్లి ట్రైలర్ లాంచ్ చేయాలనుకుంటే అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఖాయం. అలాగే ఈ సినిమా రిలీజ్ టైంలో కూడా అక్కడ పరిస్థితులు అదుపు తప్పుతాయని భావిస్తున్నారు.
This post was last modified on August 7, 2025 6:15 pm
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…