బాలీవుడ్లో మోస్ట్ కాంట్రవర్శల్ డైరెక్టర్లలో వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఒకరు. కొన్నేళ్ల ముందు వరకు ఈ దర్శకుడికి పెద్దగా పేరు లేదు. ఐతే 2022లో ‘కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా తీసి సంచలనం రేపాడు. కశ్మీర్ పండిట్ల ఊచకోత నేపథ్యంలో సాగే ఈ సినిమా తీవ్ర వివాదం రేపింది. అదే సమయంలో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్నందుకుంది. కొందరు కశ్మీర్ పండిట్ల దీన గాథలను అద్భుతంగా చూపించారంటూ వివేక్ మీద ప్రశంసలు కురిపిస్తే.. ముస్లింల మీద ద్వేషాన్ని పెంచేలా తీసిన ప్రాపగండా మూవీ ఇదంటూ ఈ చిత్రాన్ని దుయ్యబట్టారు. వివేక్ విమర్శలను పట్టించుకోకుండా ఈ సక్సెస్ను మాత్రమే తీసుకుని.. ఆ తర్వాత కూడా ఈ తరహా సినిమాలే తీయడంలో నిమగ్నమయ్యాడు.
‘వ్యాక్సిన్ వార్’ సినిమా వివేక్కు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోగా.. ఇప్పుడు ‘బెంగాల్ ఫైల్స్’ మూవీతో రెడీ అయ్యాడు. 1947లో పశ్చిమ బెంగాల్లో జరిగిన మతపరమైన దాడుల నేపథ్యంలో సాగే సినిమా ఇది. దీని టీజర్ లాంచ్ కాగానే దుమారం రేగింది. బెంగాల్కు చెందిన అనేకమంది రాజకీయ నాయకులు వివేక్ మీద విరుచుకుపడ్డారు. ముఖ్యంగా అధికార టీఎంసీ పార్టీ వాళ్లు వివేక్ను టార్గెట్ చేశారు. ఇక్కడ మత కలహాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ఆ రాష్ట్రంలో పదుల సంఖ్యలో వివేక్ మీద కేసులు నమోదయ్యాయి. ఈ సినిమాను తమ రాష్ట్రంలో రిలీజ్ చేయనివ్వమని.. వివేక్ ఇక్కడికి వస్తే అతడి అంతు చూస్తామని వార్నింగ్లు ఇచ్చారు.
ఐతే ఇంత వివాదం చెలరేగాక.. తాను పశ్చిమ బెంగాల్ను బెంగాల్కు వెళ్తే తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని తెలిసి కూడా వివేక్ అగ్నిహోత్రి పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. పశ్చిమ బెంగాల్లోనే ‘బెంగాల్ ఫైల్స్’ ట్రైలర్ లాంచ్ చేస్తానని.. అక్కడ తనను ఎవరు ఆపుతారో చూస్తానని వివేక్ అన్నాడు. అంతే కాక ‘బెంగాల్ ఫైల్స్’ సినిమాను బెంగాల్లో రిలీజ్ చేసి తీరుతానని కూడా ఆయన తేల్చి చెప్పారు. సెప్టెంబరు 5న ‘బెంగాల్ ఫైల్స్’ రిలీజ్ కావాల్సి ఉండగా.. నిజంగానే వివేక్ కోల్కతాకు వెళ్లి ట్రైలర్ లాంచ్ చేయాలనుకుంటే అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఖాయం. అలాగే ఈ సినిమా రిలీజ్ టైంలో కూడా అక్కడ పరిస్థితులు అదుపు తప్పుతాయని భావిస్తున్నారు.
This post was last modified on August 7, 2025 6:15 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…