మీరు హెడ్డింగ్ లో చూస్తున్న స్టేట్ మెంట్ రజనీకాంత్ అభిమానుల నుంచి వినిపిస్తోంది. కూలీ తర్వాత జైలర్ 2 ఉన్న సంగతి తెలిసిందే. ఇవయ్యాక ఏ దర్శకుడితో చేస్తాడనే దాని మీద చెన్నై వర్గాల్లో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. కానీ సిరుతై శివ చెప్పిన కథకు తలైవర్ సానుకూలంగా స్పందించారనే టాక్ ఒకటి ఫ్యాన్స్ లో టెన్షన్ రేపుతోంది. ఇంతకు తన కలయికలో రజని అన్నాతే (పెద్దన్న) చేశారు. మితిమీరిన సిస్టర్ సెంటిమెంట్ డ్రామాతో శివ డిజాస్టర్ ఇచ్చారు. తమిళంలో కొంత ఓకే కానీ తెలుగు లాంటి ఇతర భాషల్లో కనీస వసూళ్లు రానంత దారుణమైన తిరస్కారానికి గురయ్యింది.
సరే ఇలాంటి ఫ్లాపులు ఏ దర్శకుడికైనా కామన్ అనుకోవచ్చు. నాలుగు సంవత్సరాల టైం తీసుకుని సూర్యతో ఆయన తీసిన ప్యాన్ ఇండియా కళాఖండం గురించి మళ్ళీ గుర్తు చేయనక్కర్లేదు. కంగువ అంటే చాలు మూవీ లవర్స్ ఇప్పుడు కూడా ఖంగు తింటారు. రెండేళ్ల సూర్య విలువైన సమయాన్ని వృథా చేశాడని సూర్య అభిమానులు ఇప్పటికీ ఫీలవుతూ ఉంటారు. ఇదంతా జరిగి సుమారు ఏడాది కావొస్తోంది. ఈలోగ శివ పలుమార్లు రజనీకాంత్ ని కలుసుకోవడం, స్టోరీ లైన్ చెప్పి ఇంప్రెస్ చేయడం జరిగిపోయాయట. కాకపోతే ఫైనల్ వెర్షన్ విన్నాకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.
ఇది నిజం కాకూడదని ఫ్యాన్స్ కోరిక. అయినా సీనియర్ హీరోలు ఎవరి మాట వినే పరిస్థితి లేదు. ఒకసారి ఫిక్స్ అయితే మొండిగా ముందుకు వెళ్లిపోతున్నారు. చిరంజీవి భోళా శంకర్ అలా వచ్చిందే. కాకపోతే రజనీకాంత్ కొంచెం జాగ్రత్తగా అడుగులు వేస్తూ కొత్త జనరేషన్ డైరెక్టర్లతోనే చేతులు కలుపుతున్నారు. జైలర్ తర్వాత వెట్టయన్, లాల్ సలామ్ నిరాశ పరిచినప్పటికీ కూలి మళ్ళీ సూపర్ స్టార్ పవర్ చూపిస్తుందని కోలీవుడ్ నమ్మకంగా ఉంది. ముఖ్యంగా వెయ్యి కోట్ల గ్రాసర్ అవుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఏది ఏమైనా ఏడు పదుల వయసులో రజనీకాంత్ సెలక్షన్ అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే.
This post was last modified on August 7, 2025 2:51 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…