మీరు హెడ్డింగ్ లో చూస్తున్న స్టేట్ మెంట్ రజనీకాంత్ అభిమానుల నుంచి వినిపిస్తోంది. కూలీ తర్వాత జైలర్ 2 ఉన్న సంగతి తెలిసిందే. ఇవయ్యాక ఏ దర్శకుడితో చేస్తాడనే దాని మీద చెన్నై వర్గాల్లో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. కానీ సిరుతై శివ చెప్పిన కథకు తలైవర్ సానుకూలంగా స్పందించారనే టాక్ ఒకటి ఫ్యాన్స్ లో టెన్షన్ రేపుతోంది. ఇంతకు తన కలయికలో రజని అన్నాతే (పెద్దన్న) చేశారు. మితిమీరిన సిస్టర్ సెంటిమెంట్ డ్రామాతో శివ డిజాస్టర్ ఇచ్చారు. తమిళంలో కొంత ఓకే కానీ తెలుగు లాంటి ఇతర భాషల్లో కనీస వసూళ్లు రానంత దారుణమైన తిరస్కారానికి గురయ్యింది.
సరే ఇలాంటి ఫ్లాపులు ఏ దర్శకుడికైనా కామన్ అనుకోవచ్చు. నాలుగు సంవత్సరాల టైం తీసుకుని సూర్యతో ఆయన తీసిన ప్యాన్ ఇండియా కళాఖండం గురించి మళ్ళీ గుర్తు చేయనక్కర్లేదు. కంగువ అంటే చాలు మూవీ లవర్స్ ఇప్పుడు కూడా ఖంగు తింటారు. రెండేళ్ల సూర్య విలువైన సమయాన్ని వృథా చేశాడని సూర్య అభిమానులు ఇప్పటికీ ఫీలవుతూ ఉంటారు. ఇదంతా జరిగి సుమారు ఏడాది కావొస్తోంది. ఈలోగ శివ పలుమార్లు రజనీకాంత్ ని కలుసుకోవడం, స్టోరీ లైన్ చెప్పి ఇంప్రెస్ చేయడం జరిగిపోయాయట. కాకపోతే ఫైనల్ వెర్షన్ విన్నాకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.
ఇది నిజం కాకూడదని ఫ్యాన్స్ కోరిక. అయినా సీనియర్ హీరోలు ఎవరి మాట వినే పరిస్థితి లేదు. ఒకసారి ఫిక్స్ అయితే మొండిగా ముందుకు వెళ్లిపోతున్నారు. చిరంజీవి భోళా శంకర్ అలా వచ్చిందే. కాకపోతే రజనీకాంత్ కొంచెం జాగ్రత్తగా అడుగులు వేస్తూ కొత్త జనరేషన్ డైరెక్టర్లతోనే చేతులు కలుపుతున్నారు. జైలర్ తర్వాత వెట్టయన్, లాల్ సలామ్ నిరాశ పరిచినప్పటికీ కూలి మళ్ళీ సూపర్ స్టార్ పవర్ చూపిస్తుందని కోలీవుడ్ నమ్మకంగా ఉంది. ముఖ్యంగా వెయ్యి కోట్ల గ్రాసర్ అవుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఏది ఏమైనా ఏడు పదుల వయసులో రజనీకాంత్ సెలక్షన్ అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే.
This post was last modified on August 7, 2025 2:51 pm
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…