మీరు హెడ్డింగ్ లో చూస్తున్న స్టేట్ మెంట్ రజనీకాంత్ అభిమానుల నుంచి వినిపిస్తోంది. కూలీ తర్వాత జైలర్ 2 ఉన్న సంగతి తెలిసిందే. ఇవయ్యాక ఏ దర్శకుడితో చేస్తాడనే దాని మీద చెన్నై వర్గాల్లో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. కానీ సిరుతై శివ చెప్పిన కథకు తలైవర్ సానుకూలంగా స్పందించారనే టాక్ ఒకటి ఫ్యాన్స్ లో టెన్షన్ రేపుతోంది. ఇంతకు తన కలయికలో రజని అన్నాతే (పెద్దన్న) చేశారు. మితిమీరిన సిస్టర్ సెంటిమెంట్ డ్రామాతో శివ డిజాస్టర్ ఇచ్చారు. తమిళంలో కొంత ఓకే కానీ తెలుగు లాంటి ఇతర భాషల్లో కనీస వసూళ్లు రానంత దారుణమైన తిరస్కారానికి గురయ్యింది.
సరే ఇలాంటి ఫ్లాపులు ఏ దర్శకుడికైనా కామన్ అనుకోవచ్చు. నాలుగు సంవత్సరాల టైం తీసుకుని సూర్యతో ఆయన తీసిన ప్యాన్ ఇండియా కళాఖండం గురించి మళ్ళీ గుర్తు చేయనక్కర్లేదు. కంగువ అంటే చాలు మూవీ లవర్స్ ఇప్పుడు కూడా ఖంగు తింటారు. రెండేళ్ల సూర్య విలువైన సమయాన్ని వృథా చేశాడని సూర్య అభిమానులు ఇప్పటికీ ఫీలవుతూ ఉంటారు. ఇదంతా జరిగి సుమారు ఏడాది కావొస్తోంది. ఈలోగ శివ పలుమార్లు రజనీకాంత్ ని కలుసుకోవడం, స్టోరీ లైన్ చెప్పి ఇంప్రెస్ చేయడం జరిగిపోయాయట. కాకపోతే ఫైనల్ వెర్షన్ విన్నాకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట.
ఇది నిజం కాకూడదని ఫ్యాన్స్ కోరిక. అయినా సీనియర్ హీరోలు ఎవరి మాట వినే పరిస్థితి లేదు. ఒకసారి ఫిక్స్ అయితే మొండిగా ముందుకు వెళ్లిపోతున్నారు. చిరంజీవి భోళా శంకర్ అలా వచ్చిందే. కాకపోతే రజనీకాంత్ కొంచెం జాగ్రత్తగా అడుగులు వేస్తూ కొత్త జనరేషన్ డైరెక్టర్లతోనే చేతులు కలుపుతున్నారు. జైలర్ తర్వాత వెట్టయన్, లాల్ సలామ్ నిరాశ పరిచినప్పటికీ కూలి మళ్ళీ సూపర్ స్టార్ పవర్ చూపిస్తుందని కోలీవుడ్ నమ్మకంగా ఉంది. ముఖ్యంగా వెయ్యి కోట్ల గ్రాసర్ అవుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయి. ఏది ఏమైనా ఏడు పదుల వయసులో రజనీకాంత్ సెలక్షన్ అయితే జాగ్రత్తగా ఉండాల్సిందే.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…