ఇంకో ఏడు రోజుల్లో విడుదల కాబోతున్న వార్ 2 ప్రమోషన్ల పరంగా కూలి కన్నా వెనుకబడి ఉండటాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫీలవుతున్న వైనం స్పష్టం. హైదరాబాద్ లో ఆగస్ట్ 10 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగొచ్చనే ప్రచారం ఉంది కానీ అనుమతుల కోసం నిర్మాణ సంస్థ ఎదురు చూస్తోంది. అవి రాగానే ఏర్పాట్లు వేగవంతం చేస్తారు. వార్ 2 ఫైనల్ వెర్షన్ ని 2 గంటల 53 నిమిషాలకు లాక్ చేయడం బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన స్పై మూవీస్ అన్నింటిలో ఇదే అత్యంత పెద్దది. వార్ మొదటి భాగం 2 గంటల 34 నిమిషాలే ఉంటుంది. సీక్వెల్ పది నిముషాలు అదనం.
మాములుగా ఉత్తరాది మల్టీప్లెక్సులు ఎక్కువ నిడివిని ఇష్టపడవు. ఖర్చులు తగ్గించుకోవడం కోసం రెండున్నర గంటలు లేదా అంతకన్నా గరిష్టంగా ఒక పావు గంట ఎక్కువ ఉంటే చాలనుకుంటారు. యష్ రాజ్ అధినేత ఆదిత్య చోప్రా సైతం ఇదే అభిప్రాయంతో ఉంటారు. యాక్షన్ మూవీస్ ని పరుగులు పెట్టించాల్సి తప్పించి లెన్త్ పెంచకూడదనేది ఆయన పాలసీ. కానీ వార్ 2 విషయంలో అది పక్కన పెట్టాల్సి వచ్చింది. ఒక ఇరవై నిముషాలు ట్రిమ్ చేసే అవకాశం ఉంటే చూడమని దర్శకుడు అయాన్ ముఖర్జీకి చెప్పినా, అలా చేస్తే ఒక హీరోకి ప్రాధాన్యం తగ్గుతుందని భావించి నో చెప్పారని ముంబై టాక్.
సో స్పై సిరీస్ లో అతి పెద్ద మూవీ వార్ 2 కానుంది. ఇప్పటికైతే అడ్వాన్స్ బుకింగ్స్, అంచనాలు, హైప్, ఆడియో విషయంలో కూలినే ముందంజలో ఉన్నప్పటికీ థియేటర్ లో కంటెంట్ చూశాక తారక్, హృతిక్ ఫాన్స్ సర్ప్రైజ్ అవుతారని టీమ్ చెబుతోంది. దేవర తర్వాత పదకొండు నెలల గ్యాప్ తెచ్చిన తారక్ కోసం అభిమానులు ఘనంగా స్వాగతం చెప్పేందుకు రెడీ అవుతున్నారు. హృతిక్ రోషన్ మరో హీరో అయినప్పటికీ, వార్ 2 డబ్బింగ్ మూవీగానే రిలీజవుతున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం స్ట్రెయిట్ సినిమా రేంజ్ లో హడావిడి చేయబోతున్నారు. తెల్లవారుఝామున స్పెషల్ ప్రీమియర్లతో వార్ 2 ఓపెన్ కానుంది.
This post was last modified on August 7, 2025 1:08 pm
గత ఏడాది డిసెంబర్ దురంధర్ విడుదలతో మొదలుపెట్టి మార్చిలో రిలీజైన దురంధర్ ది రివెంజ్ దాకా పాకిస్థాన్ జనాలు, మీడియా…
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…