ఇంకో ఏడు రోజుల్లో విడుదల కాబోతున్న వార్ 2 ప్రమోషన్ల పరంగా కూలి కన్నా వెనుకబడి ఉండటాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫీలవుతున్న వైనం స్పష్టం. హైదరాబాద్ లో ఆగస్ట్ 10 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగొచ్చనే ప్రచారం ఉంది కానీ అనుమతుల కోసం నిర్మాణ సంస్థ ఎదురు చూస్తోంది. అవి రాగానే ఏర్పాట్లు వేగవంతం చేస్తారు. వార్ 2 ఫైనల్ వెర్షన్ ని 2 గంటల 53 నిమిషాలకు లాక్ చేయడం బాలీవుడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన స్పై మూవీస్ అన్నింటిలో ఇదే అత్యంత పెద్దది. వార్ మొదటి భాగం 2 గంటల 34 నిమిషాలే ఉంటుంది. సీక్వెల్ పది నిముషాలు అదనం.
మాములుగా ఉత్తరాది మల్టీప్లెక్సులు ఎక్కువ నిడివిని ఇష్టపడవు. ఖర్చులు తగ్గించుకోవడం కోసం రెండున్నర గంటలు లేదా అంతకన్నా గరిష్టంగా ఒక పావు గంట ఎక్కువ ఉంటే చాలనుకుంటారు. యష్ రాజ్ అధినేత ఆదిత్య చోప్రా సైతం ఇదే అభిప్రాయంతో ఉంటారు. యాక్షన్ మూవీస్ ని పరుగులు పెట్టించాల్సి తప్పించి లెన్త్ పెంచకూడదనేది ఆయన పాలసీ. కానీ వార్ 2 విషయంలో అది పక్కన పెట్టాల్సి వచ్చింది. ఒక ఇరవై నిముషాలు ట్రిమ్ చేసే అవకాశం ఉంటే చూడమని దర్శకుడు అయాన్ ముఖర్జీకి చెప్పినా, అలా చేస్తే ఒక హీరోకి ప్రాధాన్యం తగ్గుతుందని భావించి నో చెప్పారని ముంబై టాక్.
సో స్పై సిరీస్ లో అతి పెద్ద మూవీ వార్ 2 కానుంది. ఇప్పటికైతే అడ్వాన్స్ బుకింగ్స్, అంచనాలు, హైప్, ఆడియో విషయంలో కూలినే ముందంజలో ఉన్నప్పటికీ థియేటర్ లో కంటెంట్ చూశాక తారక్, హృతిక్ ఫాన్స్ సర్ప్రైజ్ అవుతారని టీమ్ చెబుతోంది. దేవర తర్వాత పదకొండు నెలల గ్యాప్ తెచ్చిన తారక్ కోసం అభిమానులు ఘనంగా స్వాగతం చెప్పేందుకు రెడీ అవుతున్నారు. హృతిక్ రోషన్ మరో హీరో అయినప్పటికీ, వార్ 2 డబ్బింగ్ మూవీగానే రిలీజవుతున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం స్ట్రెయిట్ సినిమా రేంజ్ లో హడావిడి చేయబోతున్నారు. తెల్లవారుఝామున స్పెషల్ ప్రీమియర్లతో వార్ 2 ఓపెన్ కానుంది.
This post was last modified on August 7, 2025 1:08 pm
రాష్ట్రంలో వైద్యం ఖరీదైన వస్తువుగా మారిపోయింది. ఆరోగ్యశ్రీ ఉన్నప్పటికీ పరీక్షలు, ఇతరత్రా ఖర్చుల పేరుతో ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచి…
కన్నడ సినిమాలో అతి పెద్ద స్టార్లలో ఒకడైన దర్శన్.. ఏ బాధలూ లేని జీవితాన్ని, బంగారం లాంటి జీవితాన్ని ఎలా…
థియేటర్లలో రేపు నాలుగైదు సినిమాలు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఓటిటిలో వచ్చే కొత్త కంటెంట్ కోసం ఎదురు…
వైసీపీ అధినేత జగన్ వెనుక ఉండే కార్యకర్తలు, యువత అంతా `జెన్జీ` అంటూ వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా…
బీసీసీఐలో ఇప్పుడు కీలక మార్పులు జరగబోతున్నాయా? అవుననే అంటున్నాయి క్రీడా వర్గాలు. టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవికి…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న పవన్…