తెలుగులో ఒక చిత్రానికి, ఇంకో చిత్రానికి పెద్దగా గ్యాప్ లేకుండా.. చాలా వేగంగా సినిమాలు చేసుకుపోయే స్టార్ హీరోల్లో మాస్ రాజా రవితేజ ఒకరు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన స్పీడు చూపిస్తుంటారు. ఒక సినిమా పూర్తయ్యేలోపు ఇంకో సినిమాకు అన్నీ రెడీ చేసుకుని.. ఇది అవ్వగానే దాని మీదికి వెళ్లిపోతుంటారాయన. కొన్ని సందర్భాల్లో ఒకేసారి రెండు సినిమాల్లోనూ నటిస్తుంటారు మాస్ రాజా. ప్రస్తుతం ఆయన ‘మాస్ జాతర’ సినిమాను పూర్తి చేయనున్నారు.
ఇది చివరి దశలో ఉండగానే కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రవితేజ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అది కూడా దాదాపు సగం చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈలోపు రవితేజ చేయబోయే మరో సినిమాకు రంగం సిద్ధమవుతోంది. ఈసారి మాస్ రాజా ఓ కన్నడ దర్శకుడితో జట్టు కట్టబోతుండడం విశేషం. తన పేరు.. ఏపీ అర్జున్. సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడైన ధ్రువ్ సర్జాతో ‘మార్టిన్’ సినిమా తీసిన దర్శకుడు.. ఏపీ అర్జున్.
పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ‘మార్టిన్’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. మాస్ పేరుతో మరీ క్రింజ్ సీన్లు తీశారంటూ ట్రోలింగ్ కూడా జరిగింది ఆ సినిమా రిలీజ్ టైంలో. కాకపోతే మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా అర్జున్కు పేరొచ్చింది.
రవితేజ అంటేనే మాస్ అన్న సంగతి తెలిసిందే. అందుకే అర్జున్తో తన ఇమేజ్కు సరిపోయే సినిమా చేయడానికి రవితేజ రెడీ అయినట్లున్నాడు. బెంగళూరుకు చెందిన ఒక కార్పొరేట్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోందట. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో చేయాలని కూడా చూస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక ‘మాస్ జాతర’ సినిమా ఈ నెల 27నే రిలీజ్ కావాల్సి ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమాను వచ్చే సంక్రాంతికి అనుకుంటున్నారు.
This post was last modified on August 6, 2025 5:49 pm
లెజెండరీ రైటర్, దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ఒక స్టేజ్ మీద తలవంచి క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది.…
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకాన్ని జియో ఎలాగైతే ఊహించని స్థాయికి తీసుకెళ్లిందో, ఇప్పుడు కృత్రిమ మేధ (AI) విషయంలోనూ అదే తరహా…
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…