తెలుగులో ఒక చిత్రానికి, ఇంకో చిత్రానికి పెద్దగా గ్యాప్ లేకుండా.. చాలా వేగంగా సినిమాలు చేసుకుపోయే స్టార్ హీరోల్లో మాస్ రాజా రవితేజ ఒకరు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన స్పీడు చూపిస్తుంటారు. ఒక సినిమా పూర్తయ్యేలోపు ఇంకో సినిమాకు అన్నీ రెడీ చేసుకుని.. ఇది అవ్వగానే దాని మీదికి వెళ్లిపోతుంటారాయన. కొన్ని సందర్భాల్లో ఒకేసారి రెండు సినిమాల్లోనూ నటిస్తుంటారు మాస్ రాజా. ప్రస్తుతం ఆయన ‘మాస్ జాతర’ సినిమాను పూర్తి చేయనున్నారు.
ఇది చివరి దశలో ఉండగానే కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని రవితేజ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అది కూడా దాదాపు సగం చిత్రీకరణ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈలోపు రవితేజ చేయబోయే మరో సినిమాకు రంగం సిద్ధమవుతోంది. ఈసారి మాస్ రాజా ఓ కన్నడ దర్శకుడితో జట్టు కట్టబోతుండడం విశేషం. తన పేరు.. ఏపీ అర్జున్. సీనియర్ హీరో అర్జున్ మేనల్లుడైన ధ్రువ్ సర్జాతో ‘మార్టిన్’ సినిమా తీసిన దర్శకుడు.. ఏపీ అర్జున్.
పాన్ ఇండియా స్థాయిలో రిలీజైన ‘మార్టిన్’ ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. మాస్ పేరుతో మరీ క్రింజ్ సీన్లు తీశారంటూ ట్రోలింగ్ కూడా జరిగింది ఆ సినిమా రిలీజ్ టైంలో. కాకపోతే మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా అర్జున్కు పేరొచ్చింది.
రవితేజ అంటేనే మాస్ అన్న సంగతి తెలిసిందే. అందుకే అర్జున్తో తన ఇమేజ్కు సరిపోయే సినిమా చేయడానికి రవితేజ రెడీ అయినట్లున్నాడు. బెంగళూరుకు చెందిన ఒక కార్పొరేట్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతోందట. దీన్ని పాన్ ఇండియా స్థాయిలో చేయాలని కూడా చూస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఇక ‘మాస్ జాతర’ సినిమా ఈ నెల 27నే రిలీజ్ కావాల్సి ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న సినిమాను వచ్చే సంక్రాంతికి అనుకుంటున్నారు.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…