ఒక హీరో హీరోయిన్ తరచుగా కలిసి కనిపిస్తే.. వాళ్ల మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైపోతుంది. అందులోనూ ఆ ఇద్దరిలో ఎవరైనా.. అవతలి వాళ్ల కుటుంబ సభ్యులతో అసోసియేట్ అయ్యారంటే ఈ ప్రచారం మరింత ఊపందుకుంటుంది. ఇప్పుడు తమిళ నటుడు ధనుష్, బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ల గురించి ఇలాగే మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియా జనాలు. బాలీవుడ్ మీడియాలో కూడా వీరి బంధం గురించి వార్తలు వస్తున్నాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్ తనయురాలు ఐశ్వర్యను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన ధనుష్.. రెండేళ్ల కిందట ఆమె నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే.
వీళ్లిద్దరికీ అధికారికంగా విడాకులు వచ్చాయా లేదా అన్నది క్లారిటీ లేదు కానీ.. చాలా కాలంగా విడివిడిగానే ఉంటున్న మాట వాస్తవం. కాగా మృణాల్కు 33 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటిదాకా సినిమా చేయకపోయినా.. వీరి మధ్య రిలేషన్షిప్ మొదలైందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మృణాల్ నటించిన ‘సన్నాఫ్ సర్దార్-2’ సినిమాకు ముంబయిలో ప్రిమియర్ వేయగా.. దానికి ధనుష్ హాజరవడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ప్రివ్యూ సందర్భంగా ధనుష్, మృణాల్ చాలా సన్నిహితంగా కనిపించారు. ఇద్దరి కెమిస్ట్రీ చూసి వీరి మధ్య ఏదో ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇద్దరూ కలిసి సినిమా చేయకపోయినా.. ఎలా కలిశారు, ఎలా బంధం మొదలైంది అన్నది తెలియదు. ఐతే ధనుష్తో పాటు అతడి ఇద్దరు సిస్టర్స్ను మృణాల్ సోషల్ మీడియాలో ఫాలో అవుతోంది. ఇటీవల మృణాల్.. ధనుష్ కుటుంబాన్ని కూడా కలిసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తుండొచ్చు అనే ప్రచారం ఊపందుకుంది. మరి ఈ వార్తల మీద ధనుష్, మృణాల్ స్పందిస్తారేమో చూడాలి.
This post was last modified on August 6, 2025 5:45 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…