ఒక హీరో హీరోయిన్ తరచుగా కలిసి కనిపిస్తే.. వాళ్ల మధ్య ఏదో ఉందనే ప్రచారం మొదలైపోతుంది. అందులోనూ ఆ ఇద్దరిలో ఎవరైనా.. అవతలి వాళ్ల కుటుంబ సభ్యులతో అసోసియేట్ అయ్యారంటే ఈ ప్రచారం మరింత ఊపందుకుంటుంది. ఇప్పుడు తమిళ నటుడు ధనుష్, బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ల గురించి ఇలాగే మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియా జనాలు. బాలీవుడ్ మీడియాలో కూడా వీరి బంధం గురించి వార్తలు వస్తున్నాయి.
సూపర్ స్టార్ రజినీకాంత్ తనయురాలు ఐశ్వర్యను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన ధనుష్.. రెండేళ్ల కిందట ఆమె నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే.
వీళ్లిద్దరికీ అధికారికంగా విడాకులు వచ్చాయా లేదా అన్నది క్లారిటీ లేదు కానీ.. చాలా కాలంగా విడివిడిగానే ఉంటున్న మాట వాస్తవం. కాగా మృణాల్కు 33 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఈ ఇద్దరూ కలిసి ఇప్పటిదాకా సినిమా చేయకపోయినా.. వీరి మధ్య రిలేషన్షిప్ మొదలైందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మృణాల్ నటించిన ‘సన్నాఫ్ సర్దార్-2’ సినిమాకు ముంబయిలో ప్రిమియర్ వేయగా.. దానికి ధనుష్ హాజరవడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి.
ప్రివ్యూ సందర్భంగా ధనుష్, మృణాల్ చాలా సన్నిహితంగా కనిపించారు. ఇద్దరి కెమిస్ట్రీ చూసి వీరి మధ్య ఏదో ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇద్దరూ కలిసి సినిమా చేయకపోయినా.. ఎలా కలిశారు, ఎలా బంధం మొదలైంది అన్నది తెలియదు. ఐతే ధనుష్తో పాటు అతడి ఇద్దరు సిస్టర్స్ను మృణాల్ సోషల్ మీడియాలో ఫాలో అవుతోంది. ఇటీవల మృణాల్.. ధనుష్ కుటుంబాన్ని కూడా కలిసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తుండొచ్చు అనే ప్రచారం ఊపందుకుంది. మరి ఈ వార్తల మీద ధనుష్, మృణాల్ స్పందిస్తారేమో చూడాలి.
This post was last modified on August 6, 2025 5:45 pm
కలిసి రాజకీయం చేయకపోయినా వైఎస్సార్సీపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొన్ని పోలికలు కనిపిస్తున్నాయి. అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఈ…
సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటూ.. తన సినిమాల ఈవెంట్లలో, ఇంటర్వ్యూల్లో హాట్ హాట్ కామెంట్లు చేస్తుంటాడు ప్రముఖ తెలుగు…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'తో ఇప్పుడు తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో 'గద్దలకొండ గణేష్'…
ఆదివారం రోజు అందులోనూ ప్రత్యేకంగా సాయంత్రం షోలకు ఆక్యుపెన్సీలు బాగుండటం సహజమే కానీ ఈవారం మాత్రం బయ్యర్లు ఆనందంతో మునిగిపోయేలా…
తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలులో కీలక మార్పులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతుంది. కళాశాలలకు…
నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఢిల్లీ నిరసనలో ఉగ్రవాదుల కుట్ర కోణం బయట పడిందని ఢిల్లీ టాస్క్ఫోర్స్…