విపరీతమైన అంచనాలు మోస్తూ ఆగస్ట్ 14 ఒకే రోజు విడుదల కాబోతున్న వార్ 2, కూలీ రెండు ట్రైలర్లు వచ్చేశాయి. అంచనాల పరంగా రజనీకాంత్ పై చేయి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ ట్రైలర్ వచ్చాక లెక్కలు మారిపోయాయి. ఆశించిన స్థాయిలో లోకేష్ కనగరాజ్ కోరుకున్న హై ఇవ్వలేకపోయాడని కొందరు కామెంట్ చేస్తుండగా, కావాలని స్టోరీ అర్థం కాకుండా అండర్ ప్లేతో అలా కట్ చేయించారని మరికొందరు అంటున్నారు. ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు డీ కోడింగ్ చేసుకుని సోషల్ మీడియా లో కథలు కూడా అల్లేశారు. ఇక వార్ 2 యాక్షన్ విజువల్స్ పరంగా సంతృప్తి పరిచినా ఇంకేదో మిస్సయిన ఫీలింగ్ కలిగించింది.
చెప్పాలంటే క్రికెట్ మ్యాచ్ లో సమాన పరుగులతో రెండు జట్ల మధ్య టై అయినట్టు వార్ 2, కూలి ట్రైలర్ రెండూ రెండు త్రాసుల వైపు బ్యాలన్స్ గా ఉన్నాయి. యుఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ కోణంలో చూస్తే కూలి చాలా ఎత్తులో ఉండగా రాబోయే రోజుల్లో చేయబోయే ప్రమోషన్లతో వార్ 2 కూడా ఊపందుకుంటుందని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ రెండు టీముల చేతిలో ఇంకో బాధ్యత ఉంది. రిలీజ్ కు రెండు మూడు రోజుల ముందు ఇంకో ఫ్రెష్ ట్రైలర్ ని వదలడం ద్వారా అంచనాల లెక్కలను మార్చుకోవచ్చు. కానీ చేస్తారా చేయరా అనేది అనుమానంగానే ఉంది. ముఖ్యంగా కూలీ.
ఇది పక్కనపెడితే ఇంకో తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ల పరంగా దూసుకెళ్లాల్సిన టైం అయితే వచ్చింది. ఇప్పటిదాకా వార్ 2 వైపు నుంచి పెద్దగా సౌండ్ లేదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ ఈవెంట్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ 10 జరిగే అవకాశాలున్నాయి కానీ వేదిక ఏదనేది ఇంకా నిర్ధారణ కాలేదు. పేరుకి హిందీ డబ్బింగ్ అయినప్పటికీ స్ట్రెయిట్ మూవీ రేంజ్ లో వార్ 2ని విడుదల చేస్తుండగా, కూలి సైతం నేనేం తీసిపోలేదనే తరహాలో హడావిడి చేస్తోంది. ఎవరిది పైచేయి అవుతుందో, ఎవరు విజేతగా నిలుస్తారో లేక సమంగా కప్పు పంచుకుంటారో వేచి చూడాలి.
This post was last modified on August 5, 2025 12:41 pm
జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…