సీతారామం, హాయ్ నాన్న చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన బాలీవుడ్ భామ.. మృణాల్ ఠాకూర్. ఐతే గత ఐదారేళ్లలో ఈ రెండూ తప్పితే ఆమె ఖాతాలో చెప్పుకోదగ్గ విజయాలు లేవు. ముఖ్యంగా తాను కథానాయికగా ఎదిగిన బాలీవుడ్లో ఆమెకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 2019లో హృతిక్ రోషన్ మూవీ ‘సూపర్ 30’తో బ్రేక్ అందుకున్న మృణాల్.. ఆ తర్వాత బాలీవుడ్లో ఒక్క సక్సెస్ కూడా అందుకోలేకపోయింది. బాట్లా హౌస్, తూఫాన్, జెర్సీ, సెల్ఫీ, గుమ్రా, ఆంఖ్ మిచోలి, పిప్పా… ఇలా వరుసగా పరాజయాలు ఎదుర్కొంది.
తాజాగా మృణాల్ ఖాతాలో మరో డిజాస్టర్ జమ అయింది. అదే.. సన్నాఫ్ సర్దార్-2. అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ఈ చిత్రం గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోవడం వల్ల ఈ సినిమాకు ఓపెనింగ్స్ కరవయ్యాయి. 50 పర్సంట్ ఆఫర్ పెట్టినా కూడా తొలి రోజు థియేటర్లలో జనం కనిపించలేదు. దీనికి తోడు సినిమాకు డివైడ్ టాక్ రావడంతో వీకెండ్లో కూడా సినిమా చెప్పుకోదగ్గ వసూళ్లు సాధించలేకపోయింది. వీక్ డేస్ వచ్చేసరికి థియేటర్లు ఖాళీ అయిపోయాయి. చాలా త్వరగా సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది. తన సొంత ఇండస్ట్రీలో ఓ హిట్ కోసం ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న మృణాల్కు మరోసారి నిరాశ తప్పలేదు.
తెలుగులోనూ చివరగా మృణాల్ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ డిజాస్టర్ అయింది. దీంతో ఇక్కడ కూడా ఆమె కెరీర్ కొంచెం స్లో అయింది. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ అడివి శేష్కు జోడీగా నటిస్తున్న ‘డెకాయిట్’ మూవీ మీదే ఉన్నాయి. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తాడని పేరున్న శేష్.. ఆమెకు ఓ హిట్ ఇస్తాడనే ఆశలున్నాయి. హిందీలో ఆమె చేతిలో మరో మూవీ సినిమాలున్నాయి. మరోవైపు అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సరసన ఆమె నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…