రజినీకాంత్ తమిళంలోనే కాదు.. తెలుగులోనూ సూపర్ స్టారే. దశాబ్దాలుగా ఆయన సినిమాలు తెలుగులో గొప్ప ఆదరణ పొందుతున్నాయి. రజినీ సినిమా వస్తుంటే.. పోటీగా ఇక్కడి చిత్రాలను రిలీజ్ చేయడానికి భయపడ్డ పరిస్థితులు కూడా ఉన్నాయి ఒకప్పుడు. ఆయన చిత్రాలకు తెలుగులో వచ్చే మిడ్ రేంజ్ మూవీస్కు దీటుగా ఇక్కడ బిజినెస్ జరుగుతుంది. బాషా, నరసింహా, చంద్రముఖి, రోబో, కబాలి, 2.0, జైలర్ లాంటి చిత్రాలకు వచ్చిన వసూళ్లు చూసి ఇక్కడి వాళ్లు విస్తుబోయారు. ఐతే తన చిత్రాలకు ఇంత ఆదరణ దక్కుతున్నా.. రజినీ ఇక్కడికి వచ్చి ప్రమోషన్లలో పాల్గొనడం అరుదు.
ఒకప్పుడైనా వచ్చి ప్రెస్ మీట్లలో పాల్గొనడం లాంటివి చేసేవారు. కానీ చాలా ఏళ్లుగా ఇటు రావడమే మానేశారు. మధ్యలో రజినీ మార్కెట్ దెబ్బ తిని కొన్ని సినిమాలకు బజ్ క్రియేట్ కాలేదు. అప్పుడు కూడా రజినీ లైట్ తీసుకున్నారు. ‘జైలర్’ తర్వాత మళ్లీ ఆయన మార్కెట్ పైకి లేచింది. ఇక ఆయన కొత్త చిత్రం ‘కూలీ’కి తెలుగులో మామూలు హైప్ లేదు. ఏకంగా 50 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిందీ చిత్రం ఇక్కడ. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. వంద కోట్ల వసూళ్లు దాటడం గ్యారెంటీ. మరి తన మీద, తన సినిమా మీద తెలుగు ప్రేక్షకులు ఇంత ప్రేమ చూపిస్తుంటే.. ఇక్కడికి వచ్చిన ఒక ప్రెస్ మీట్లో రజినీ పాల్గొంటే బాగుంటుంది కదా? కానీ రజినీ ఆ పని చేయలేదు.
సోమవారం హైదరాబాద్లో ‘కూలీ’కి సంబంధించి ఒక పెద్ద ప్రెస్ మీట్ ఒకటి ప్లాన్ చేశారు. దీనికి అక్కినేని నాగార్జున, లోకేష్ కనకరాజ్ తదితరులు హాజరయ్యారు. ఈ ఈవెంట్లో రజినీ కూడా పాల్గొంటారని ముందు వార్తలు వచ్చాయి. కానీ చివరికి చూస్తే ఆయన రాలేదు. ఒక వీడియో బైట్తో సరిపెట్టారు. రజినీకి వయసు మీద పడడం, గతంలో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం వాస్తవం. కానీ ఈ మధ్య ఉత్సాహంగానే ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నారు. చెన్నైలో నిర్వహించిన భారీ ప్రమోషనల్ ఈవెంట్కు హాజరయ్యారు. సుదీర్ఘ ప్రసంగం కూడా చేశారు. అలాంటపుడు ఒకసారి హైదరాబాద్కు వచ్చి తన సినిమా ప్రెస్ మీట్లో పాల్గొని ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 4, 2025 11:00 pm
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…