స్వయానా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మీలా నేను నటించలేను అంటూ ఏ హీరోనైనా మెచ్చుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. నాగార్జునకు ఆ అవకాశం దక్కింది. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన కూలి ప్రీ రిలీజ్ కం ప్రెస్ మీట్ లో తలైవర్ వీడియో ద్వారా అందుబాటులోకి వచ్చి తన మనసులో భావాలు పంచుకున్నారు. సైమన్ గా నాగ్ తన క్యారెక్టర్ ని అద్భుతంగా పోషించారని, బాషాలో ఆంటోనీ లాగా కూలిలో సైమన్ శాశ్వతంగా గుర్తుండిపోతాడని కాంప్లిమెంట్ ఇచ్చారు. కింగ్ ఎనర్జీ, ఎక్స్ పీరియన్స్ గురించి ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించి అక్కినేని అభిమానులకు కిక్ ఇచ్చారు.
ఇక్కడ కాకతాళీయంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. రఘువరన్ అనే విలన్ కి సూపర్ బ్రేక్ ఇచ్చింది నిర్మాత నాగార్జునే. శివ ద్వారా దాన్ని సాకారం చేశారు. తర్వాత ఆయన పెద్ద స్థాయికి చేరుకోవడం చూశాం. బాషాలో ఆంటోనీగా రఘువరన్ పెర్ఫార్మన్స్ పీక్స్ లో ఉంటుంది. ఇప్పుడా స్థాయిలో కూలిలో నాగ్ పోషించిన సైమన్ ఉంటుందని రజిని స్వయంగా చెప్పడం విశేషం. నాగార్జున తన అనుభవాన్ని పంచుకుంటూ హీరోతో సమానంగా తనకు ప్రాధాన్యం ఉండటం గుర్తించి ఈ కథను రజనీకాంత్ గారు నిజంగా ఒప్పుకున్నారా అని లోకేష్ కనగరాజ్ ని అడిగానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ట్రైలర్ వచ్చాక కూలి మీద రకరకాల అంచనాలు ఏర్పడ్డాయి. తెలివిగా కట్ చేయడంతో జానర్, కథ లాంటివి ఎక్కవుగా డీకోడ్ కాకుండా జాగ్రత్త పడ్డారు. బయట ప్రచారం జరుగుతున్నట్టు ఇదేమి టైం ట్రావెల్ సినిమా కాదని చెబుతున్న లోకేష్ థియేటర్లో చూశాక సర్ప్రైజ్ అవుతారని చెప్పుకొచ్చాడు. సత్యరాజ్ మాట్లాడుతూ 38 సంవత్సరాల తర్వాత కలుసుకున్నా, మేకప్ లో చూస్తే రజనీకాంత్ లో ఎలాంటి మార్పు లేదని, అదే విషయం ఆయనకు చెబితే నాదేముంది నాగార్జునని కలుసుకో ఆయన ఇంకా ఫిట్ గా ఉన్నాడని చెప్పారట. మొత్తానికి నాగార్జున కెరీర్ లో మొదటిసారి తీసుకున్న రిస్క్ ఎలాంటి ఫలితమిస్తుందో ఆగస్ట్ 14 తేలనుంది.
This post was last modified on August 4, 2025 10:45 pm
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…