స్వయానా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ మీలా నేను నటించలేను అంటూ ఏ హీరోనైనా మెచ్చుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంటుంది. నాగార్జునకు ఆ అవకాశం దక్కింది. ఇవాళ హైదరాబాద్ లో జరిగిన కూలి ప్రీ రిలీజ్ కం ప్రెస్ మీట్ లో తలైవర్ వీడియో ద్వారా అందుబాటులోకి వచ్చి తన మనసులో భావాలు పంచుకున్నారు. సైమన్ గా నాగ్ తన క్యారెక్టర్ ని అద్భుతంగా పోషించారని, బాషాలో ఆంటోనీ లాగా కూలిలో సైమన్ శాశ్వతంగా గుర్తుండిపోతాడని కాంప్లిమెంట్ ఇచ్చారు. కింగ్ ఎనర్జీ, ఎక్స్ పీరియన్స్ గురించి ఓ రేంజ్ లో పొగడ్తల వర్షం కురిపించి అక్కినేని అభిమానులకు కిక్ ఇచ్చారు.
ఇక్కడ కాకతాళీయంగా గమనించాల్సిన విషయం ఒకటుంది. రఘువరన్ అనే విలన్ కి సూపర్ బ్రేక్ ఇచ్చింది నిర్మాత నాగార్జునే. శివ ద్వారా దాన్ని సాకారం చేశారు. తర్వాత ఆయన పెద్ద స్థాయికి చేరుకోవడం చూశాం. బాషాలో ఆంటోనీగా రఘువరన్ పెర్ఫార్మన్స్ పీక్స్ లో ఉంటుంది. ఇప్పుడా స్థాయిలో కూలిలో నాగ్ పోషించిన సైమన్ ఉంటుందని రజిని స్వయంగా చెప్పడం విశేషం. నాగార్జున తన అనుభవాన్ని పంచుకుంటూ హీరోతో సమానంగా తనకు ప్రాధాన్యం ఉండటం గుర్తించి ఈ కథను రజనీకాంత్ గారు నిజంగా ఒప్పుకున్నారా అని లోకేష్ కనగరాజ్ ని అడిగానని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ట్రైలర్ వచ్చాక కూలి మీద రకరకాల అంచనాలు ఏర్పడ్డాయి. తెలివిగా కట్ చేయడంతో జానర్, కథ లాంటివి ఎక్కవుగా డీకోడ్ కాకుండా జాగ్రత్త పడ్డారు. బయట ప్రచారం జరుగుతున్నట్టు ఇదేమి టైం ట్రావెల్ సినిమా కాదని చెబుతున్న లోకేష్ థియేటర్లో చూశాక సర్ప్రైజ్ అవుతారని చెప్పుకొచ్చాడు. సత్యరాజ్ మాట్లాడుతూ 38 సంవత్సరాల తర్వాత కలుసుకున్నా, మేకప్ లో చూస్తే రజనీకాంత్ లో ఎలాంటి మార్పు లేదని, అదే విషయం ఆయనకు చెబితే నాదేముంది నాగార్జునని కలుసుకో ఆయన ఇంకా ఫిట్ గా ఉన్నాడని చెప్పారట. మొత్తానికి నాగార్జున కెరీర్ లో మొదటిసారి తీసుకున్న రిస్క్ ఎలాంటి ఫలితమిస్తుందో ఆగస్ట్ 14 తేలనుంది.
This post was last modified on August 4, 2025 10:45 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…