Movie News

ధనుష్ ఆవేదనలో ప్రమాదం పసిగట్టాలి

ఇటీవలే రీ రిలీజైన రాంఝాన (తమిళ డబ్బింగ్ అంబికాపతి) క్లైమాక్స్ లో చనిపోయిన తన పాత్రను మళ్ళీ బ్రతికినట్టు ఏఐ ద్వారా మార్చేయడం ధనుష్ ని తీవ్రంగా కలవరపరిచింది. 12 సంవత్సరాల క్రితం తాను ఒప్పుకున్న సినిమా ఇది కాదని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వాడి ఇలా చేయడం తప్పని చెబుతూ, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృత్తం కాకుండా కఠిన నిబంధనలు తీసుకు రావాల్సిన అవసరం చాలా ఉందని సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన ప్రత్యేక నోట్ లో పేర్కొన్నాడు. వినడానికి ఇదో చిన్న విషయంగా ఇప్పటికి కనిపిస్తున్నా భవిష్యత్తులో దీని పరిణామాలు తీవ్రంగా ఉండబోతున్నాయి.

రీ రిలీజ్ క్రేజ్ ఉందనే సాకుతో ఇలా ఇష్టం వచ్చినట్టు క్లైమాక్సులు, ముఖ్యమైన ఎపిసోడ్లను మార్చుకుంటూ పోతే క్రియేటివిటీ పక్కదారి పట్టడం ఖాయం. ఫ్యాన్స్ ఎమోషన్స్ ని క్యాష్ చేసుకునే ఉద్దేశంతో ఇలాంటి ప్రయోగాలు చేయడం బిజినెస్ కోణంలో వాళ్లకు రైట్ అనిపించవచ్చు. కానీ ఒరిజినాలిటీ దెబ్బ తిన్నాక దాని తాలూకు ప్రభావం తర్వాత జనరేషన్ల మీద పడుతుంది. ఉదాహరణకు ఇప్పుడు అంబికాపతి చూస్తున్న ఒక ఇరవై ఏళ్ళ కుర్రాడు ధనుష్ బ్రతికి ఉండటమే అసలు క్లైమాక్స్ అనుకుంటాడు. దీని వల్ల చనిపోయినప్పుడు పండాల్సిన ఎమోషన్ అతని కోణంలో జీరో అయిపోతుంది.

ధనుష్ భయపడుతున్న రిస్క్ ఇదే. ఇవాళ సభాపతికి చేశారు. రేపు ఇంకొకరికి చేయరనే గ్యారెంటీ లేదు. పెదరాయుడులో రజనీకాంత్ ని తిరిగి బ్రతికిస్తే ఏమవుతుంది. వినడానికి నవ్వొస్తుంది కానీ ఆ కోణంలో ఎవరైనా ఆలోచించి దానికి తెగబడితే దానికున్న క్లాసిక్ స్టేటస్ కి మచ్చ పడుతుంది. ఓ రెండు వేలు ఖర్చు పెడితే చనిపోయిన వాళ్ళను ఏఐలో సృష్టించి వాళ్ళ బంధువులు, పిల్లల పెళ్లిలలో వీడియోల ద్వారా డబ్బులు సంపాదిస్తున్న సంస్థలు పెరిగిపోతున్నాయి. అలాంటిది కోట్ల రూపాయలు పెడుతున్న నిర్మాతలు కనక టెంప్ట్ అయిపోయి ఇష్టం వచ్చినట్టు ఏఐ వాడితే అనవసరమైన రచ్చకు కారణం అవుతారు.

This post was last modified on August 4, 2025 10:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

8 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago