ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూనే తిరుగుతోంది. అది ప్రవేశించని రంగం లేదు. వాడుకున్నోళ్లకు వాడుకున్నంత అన్నట్లుగా దాని సాయంతో ఎన్నో అద్భుతాలను ఆవిష్కరిస్తున్నారు. సినీ రంగంలోనూ ఏఐ వాడకం పెరుగుతోంది. మున్ముందు సినిమాల మేకింగ్లో ఏఐ ఎంతో కీలక పాత్ర పోషిస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రతి టెక్నీషియన్ దీన్ని వాడుకునేలా కనిపిస్తున్నారు. సంగీతంలో కూడా ఏఐ పాత్ర కీలకం కాబోతోందనడానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నాయి.
ఇండియాలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన అనిరుధ్ రవిచందర్.. ఇప్పటికే పాటల కోసం చాట్ జీపీటీని వాడడం మొదలుపెట్టేశాడట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో అతను ఓపెన్గా చెప్పేశాడు. చాట్ జీపీటీలో ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకుని.. పాటల్లో దాని సాయం తీసుకుంటున్నట్లు అతను వెల్లడించాడు.
ఒక పాట కంపోజ్ చేస్తుండగా.. చివరి రెండు లైన్ల దగ్గర తాను స్ట్రక్ అయిపోయినట్లు అనిరుధ్ తెలిపాడు. మిగతా పాట అంతా అయిపోయినా.. ఆ రెండు లైన్ల విషయంలో కొత్త ఐడియాలేమీ రాలేదని.. దీంతో చాట్ జీపీటీని ఆశ్రయించానని అనిరుధ్ తెలిపాడు. ముందు రెడీ అయిన లైన్లన్నింటినీ అందులో పోస్ట్ చేసి, సజెషన్స్ ఇచ్చి మిగతా రెండు లైన్ల కోసం ఐడియా అడిగితే.. అది చాలా ఆప్షన్లు ఇచ్చిందని అనిరుధ్ తెలిపాడు.
ఐతే అతను చాట్ జీపీటీని అడిగింది లిరిక్స్ కోసమా.. ట్యూన్ కోసమా అన్నది స్పష్టంగా చెప్పలేదు. అతను అడిగింది ఏదైనప్పటికీ.. ఇలాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ చాట్ జీపీటీ సాయంతో సాంగ్స్ చేస్తున్నాడా అని సోషల్ మీడియా జనాలు ఆశ్చర్యపోతున్నారు. భవిష్యత్తులో సాంగ్స్ కంపోజింగ్ ఎలా ఉండబోతోందో.. ఏఐ అందులో ఎలాంటి పాత్ర పోషించబోతోందో చెప్పడానికి ఇది ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. కాస్త సంగీత జ్ఞానం ఉన్న వాళ్లు దీని సాయంతో ఈజీగానే పాటలు కంపోజ్ చేసేస్తారేమో.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…