71 జాతీయ అవార్డుల పురస్కారాల్లో టాలీవుడ్ జెండా ఎగిరింది. వివిధ విభాగాల్లో మన సినిమాలు పురస్కారాలు అందుకున్నాయి. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’ అవార్డు దక్కించుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏవిజిసి (యానిమేషన్ – విజువల్ ఎఫెక్ట్స్ – గేమింగ్ అండ్ కామిక్) విభాగంలో ‘హనుమాన్’ సత్తా చాటింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, గ్రాఫిక్స్ సూపర్ వైజర్ జెట్టి వెంకట్ కుమార్, నిర్మాత నిరంజన్ రెడ్డికు దీన్ని అందజేయబోతున్నారు. ఉత్తమ నేపధ్య గాయకుడిగా ‘బేబీ’లో ప్రేమిస్తున్నా పాటకు పివిఎస్ఎస్ రోహిత్ అవార్డు గెలుచుకోవడం విశేషం.
ఉత్తమ స్క్రీన్ ప్లే ఒరిజినల్ క్యాటగిరీలో ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్ తన ముద్ర చూపించారు. గతంలో కలర్ ఫోటో నిర్మాతగా సాయి రాజేష్ ఇదే వేదిక మీద అవార్డు తీసుకోవడం మూవీ లవర్స్ మర్చిపోలేదు. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి డెబ్యూతోనే ఈ ఘనత సాధించడం విశేషం. ‘గాంధీ తాత చెట్టు’ కమర్షియల్ గా విజయం సాధించకపోయినా ప్రయత్న పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తెలుగువాడైన హర్షవర్ధన్ రామేశ్వర్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ‘యానిమల్’ మూవీకి గుర్తింపు దక్కింది. ఆ సినిమాకిచ్చిన అద్భుతమైన స్కోర్ కు అతను ఖచ్చితంగా అర్హుడే.
‘బలగం’లో పాటకు గాను గీత రచయిత కాసర్ల శ్యామ్ కు జాతీయ అవార్డు వచ్చింది. గతంలో ఈ గౌరవాన్ని అందుకున్న వేటూరి (మాతృదేవోభవ), సుద్దాల అశోక్ తేజ (ఠాగూర్) లాంటి దిగ్గజాల సరసన కాసర్ల శ్యామ్ నిలవడం విశేషం. లిరిక్ రైటర్ గా కెరీర్ మంచి ఊపందుకుంటున్న టైంలో ఇది జరగడం తనకు మంచి బూస్ట్ అవుతుంది. మొత్తానికి తెలుగు సౌరభాలు ఈసారి గట్టిగానే వెల్లివిరిశాయి. హాయ్ నాన్న, విరూపాక్ష లాంటి సినిమాలకు రావొచ్చని భావించిన మూవీ లవర్స్ కోరిక నెరవేరలేదు. ఏదైతేనేం ఆగస్ట్ నెల మొదటి రోజు కేంద్ర ప్రభుత్వం శుభవార్తలతో టాలీవుడ్ లో సందడి వాతావరణం నెలకొంది.
This post was last modified on August 1, 2025 8:25 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…