71 జాతీయ అవార్డుల్లో భగవంత్ కేసరికి గౌరవం దక్కింది. ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారం దక్కించుకుని బాలయ్యకు మరో మైలురాయి అందించింది. అమ్మాయిలను చదివించాలి, స్వశక్తులుగా ఎదిగేందుకు ప్రోత్సహించాలి అనే సందేశంతో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆ టైంలో లియో రూపంలో ఎదురైన పోటీని తట్టుకుని భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డు అంటే నిర్మాత సాహు గారపాటితో పాటు టీమ్ మొత్తానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే విషయమే. ముఖ్యంగా బాలయ్య అభిమానులకు.
భగవంత్ కేసరికి ఇవ్వడం వెనుక ప్రధాన కారణం సినిమాలో ఉన్న ట్రూ ఎమోషన్. కొన్ని మాస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ బాలయ్య రెగ్యులర్ స్టైల్ లో కాకుండా అనిల్ రావిపూడి హీరో వయసుకు తగ్గ పాత్రను డిజైన్ చేసి గొప్పగా చూపించాడు. శ్రీలీలతో స్క్రీన్ మీద చూపించిన బాండింగ్ మహిళలను ఆకట్టుకుంది. పేరుకు కాజల్ అగర్వాల్ బాలకృష్ణకు జోడిగా ఉన్నా అవసరం లేని పాటలు పెట్టి సోల్ ని చంపలేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోబట్టే పలు స్కూళ్ళు కళాశాలల్లో ఈ సినిమాని స్క్రీన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అరవై కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ నమోదు చేసుకుంది.
నిజానికి గతంలో బాలకృష్ణ నటించిన కొన్ని సినిమాలకు జాతీయ అవార్డు రావాల్సింది. భైరవ ద్వీపం, ఆదిత్య 369, జననీ జన్మభూమి, సీతారామకళ్యాణం లాంటి వాటికి అభిమానులు ఆశించారు. కానీ జరగలేదు. ఇన్నేళ్లకు రావడం సంతోషించాల్సిన విషయమే. బాలకృష్ణకు గత మూడేళ్ళగా మంచి దశ నడుస్తోంది. ఒకపక్క నాలుగు బ్లాక్ బస్టర్లు పడ్డాయి. ఇంకోవైపు దశాబ్దాలుగా ఫ్యాన్స్ ఎదురు చూసిన పద్మభూషణ్ దక్కింది. నట స్వర్ణోత్సవం అంగరంగ వైభవం జరిగింది. టీవీ యాంకర్ గానూ తన ముద్ర వేశారు. ఇంత ఊపులో ఉన్న బాలయ్య చేస్తున్న షోకు తగ్గట్టు అన్ స్టాపబుల్ అనిపించేస్తున్నారు.
This post was last modified on August 1, 2025 8:06 pm
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…