Movie News

నేషనల్ అవార్డ్ – భగవంత్ కేసరికి జాతీయ గౌరవం

71 జాతీయ అవార్డుల్లో భగవంత్ కేసరికి గౌరవం దక్కింది. ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారం దక్కించుకుని బాలయ్యకు మరో మైలురాయి అందించింది. అమ్మాయిలను చదివించాలి, స్వశక్తులుగా ఎదిగేందుకు ప్రోత్సహించాలి అనే సందేశంతో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆ టైంలో లియో రూపంలో ఎదురైన పోటీని తట్టుకుని భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డు అంటే నిర్మాత సాహు గారపాటితో పాటు టీమ్ మొత్తానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే విషయమే. ముఖ్యంగా బాలయ్య అభిమానులకు.

భగవంత్ కేసరికి ఇవ్వడం వెనుక ప్రధాన కారణం సినిమాలో ఉన్న ట్రూ ఎమోషన్. కొన్ని మాస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ బాలయ్య రెగ్యులర్ స్టైల్ లో కాకుండా అనిల్ రావిపూడి హీరో వయసుకు తగ్గ పాత్రను డిజైన్ చేసి గొప్పగా చూపించాడు. శ్రీలీలతో స్క్రీన్ మీద చూపించిన బాండింగ్ మహిళలను ఆకట్టుకుంది. పేరుకు కాజల్ అగర్వాల్ బాలకృష్ణకు జోడిగా ఉన్నా అవసరం లేని పాటలు పెట్టి సోల్ ని చంపలేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోబట్టే పలు స్కూళ్ళు కళాశాలల్లో ఈ సినిమాని స్క్రీన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అరవై కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ నమోదు చేసుకుంది.

నిజానికి గతంలో బాలకృష్ణ నటించిన కొన్ని సినిమాలకు జాతీయ అవార్డు రావాల్సింది. భైరవ ద్వీపం, ఆదిత్య 369, జననీ జన్మభూమి, సీతారామకళ్యాణం లాంటి వాటికి అభిమానులు ఆశించారు. కానీ జరగలేదు. ఇన్నేళ్లకు రావడం సంతోషించాల్సిన విషయమే. బాలకృష్ణకు గత మూడేళ్ళగా మంచి దశ నడుస్తోంది. ఒకపక్క నాలుగు బ్లాక్ బస్టర్లు పడ్డాయి. ఇంకోవైపు దశాబ్దాలుగా ఫ్యాన్స్ ఎదురు చూసిన పద్మభూషణ్ దక్కింది. నట స్వర్ణోత్సవం అంగరంగ వైభవం జరిగింది. టీవీ యాంకర్ గానూ తన ముద్ర వేశారు. ఇంత ఊపులో ఉన్న బాలయ్య చేస్తున్న షోకు తగ్గట్టు అన్ స్టాపబుల్ అనిపించేస్తున్నారు.

This post was last modified on August 1, 2025 8:06 pm

Share

Recent Posts

కాక్రోచులను వెనక్కి తరిమిన వారెవరు?

విద్యార్థి ఉద్య‌మాల‌కు తెర‌దీసిన కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ) నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు తొలిసారి ప‌రాభవం ఎదురైంది. ఇటీవ‌ల నీట్ ప్ర‌శ్న ప‌త్రం…

2 minutes ago

పూర్ణ డాన్సులో రజినీకాంత్ కనిపించట్లేదు

ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…

48 minutes ago

క‌ళ్లు చెదిరే ధ‌ర‌… రాయ‌దుర్గంలో ఎక‌రా 264 కోట్లు!

హైద‌రాబాద్ న‌గ‌రంలోని రాయ‌దుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్ర‌భుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్న‌డూ లేని విధంగా క‌ళ్లు చెదిరే…

56 minutes ago

ఆ వివాదాస్పద ఐపీఎస్ ఇంట పెళ్లికి జగన్

హైదరాబాద్‌లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…

1 hour ago

ఆ ఒక్కటి అడగొద్దంటే ఎలా విశ్వంభరా

ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…

1 hour ago

వైసీపీ ఎంపీ అవినాష్ ఇంట్లో భారీగా డ‌బ్బు స్వాధీనం

వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు సోద‌రుడి వ‌రుస‌య్యే క‌డ‌ప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…

3 hours ago