71 జాతీయ అవార్డుల్లో భగవంత్ కేసరికి గౌరవం దక్కింది. ఉత్తమ తెలుగు చిత్రంగా పురస్కారం దక్కించుకుని బాలయ్యకు మరో మైలురాయి అందించింది. అమ్మాయిలను చదివించాలి, స్వశక్తులుగా ఎదిగేందుకు ప్రోత్సహించాలి అనే సందేశంతో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఆ టైంలో లియో రూపంలో ఎదురైన పోటీని తట్టుకుని భారీ వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఏకంగా నేషనల్ అవార్డు అంటే నిర్మాత సాహు గారపాటితో పాటు టీమ్ మొత్తానికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే విషయమే. ముఖ్యంగా బాలయ్య అభిమానులకు.
భగవంత్ కేసరికి ఇవ్వడం వెనుక ప్రధాన కారణం సినిమాలో ఉన్న ట్రూ ఎమోషన్. కొన్ని మాస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ బాలయ్య రెగ్యులర్ స్టైల్ లో కాకుండా అనిల్ రావిపూడి హీరో వయసుకు తగ్గ పాత్రను డిజైన్ చేసి గొప్పగా చూపించాడు. శ్రీలీలతో స్క్రీన్ మీద చూపించిన బాండింగ్ మహిళలను ఆకట్టుకుంది. పేరుకు కాజల్ అగర్వాల్ బాలకృష్ణకు జోడిగా ఉన్నా అవసరం లేని పాటలు పెట్టి సోల్ ని చంపలేదు. ఇన్ని జాగ్రత్తలు తీసుకోబట్టే పలు స్కూళ్ళు కళాశాలల్లో ఈ సినిమాని స్క్రీన్ చేసిన దాఖలాలు ఉన్నాయి. అరవై కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ నమోదు చేసుకుంది.
నిజానికి గతంలో బాలకృష్ణ నటించిన కొన్ని సినిమాలకు జాతీయ అవార్డు రావాల్సింది. భైరవ ద్వీపం, ఆదిత్య 369, జననీ జన్మభూమి, సీతారామకళ్యాణం లాంటి వాటికి అభిమానులు ఆశించారు. కానీ జరగలేదు. ఇన్నేళ్లకు రావడం సంతోషించాల్సిన విషయమే. బాలకృష్ణకు గత మూడేళ్ళగా మంచి దశ నడుస్తోంది. ఒకపక్క నాలుగు బ్లాక్ బస్టర్లు పడ్డాయి. ఇంకోవైపు దశాబ్దాలుగా ఫ్యాన్స్ ఎదురు చూసిన పద్మభూషణ్ దక్కింది. నట స్వర్ణోత్సవం అంగరంగ వైభవం జరిగింది. టీవీ యాంకర్ గానూ తన ముద్ర వేశారు. ఇంత ఊపులో ఉన్న బాలయ్య చేస్తున్న షోకు తగ్గట్టు అన్ స్టాపబుల్ అనిపించేస్తున్నారు.
This post was last modified on August 1, 2025 8:06 pm
‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అలాంటి హీరోతో సినిమా తీసే…
తెలంగాణ రాష్ట్ర సేన.. అంటూ టీఆర్ ఎస్ పార్టీని స్థాపించిన కవిత వ్యవహారంపై బీఆర్ ఎస్ నాయకులు మౌనంగా ఉన్నారు.…
మోహన్ లాల్ దృశ్యం 3 మరోసారి రిలీజ్ డేట్ ప్రకటించింది. మే 21 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా…
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…