ఒకే ఆలోచన ఇద్దరికి రావడం మాములే. క్రియేటివ్ ఫీల్డ్ లో తరచుగా ఇది జరుగుతూ ఉంటుంది. కొన్ని వివాదాలు అయిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని గుర్తుపట్టకుండా మాయమైపోవడం ఎప్పటికీ ప్రపంచానికి తెలియవు. కొన్ని ఎటూ తప్పించుకునే ఛాన్స్ లేక బయటపడతాయి. మొన్న ఫిబ్రవరిలో విడుదలైన తండేల్ నాగచైతన్యకు మొదటి వంద కోట్ల గ్రాసర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. వరస ఫ్లాపులతో సతమతమవుతున్నప్పుడు ఈ సినిమా రూపంలో తనకో పెద్ద ఊరట దక్కింది. హీరోయిన్ సాయిపల్లవి, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం లాంటి ఆకర్షణలు జనాన్ని మెప్పించుకుని మెచ్చుకునేలా చేశాయి. ఇదంతా గతం.
వచ్చే వారం అమెజాన్ ప్రైమ్ లో అరేబియా కడలి అనే వెబ్ సిరీస్ రాబోతోంది. సత్యదేవ్ ప్రధాన పాత్ర పోషించగా ఆనంది ఫిమేల్ లీడ్ గా చేసింది. ట్రైలర్ చూస్తే తండేల్ గుర్తు రాకుండా ఉండటం అసాధ్యం. శ్రీకాకుళం జాలర్లు పొరపాటున సముద్రంలో పాకిస్థాన్ ఆర్మీకి చిక్కడం, అక్కడ జైల్లో నానా నష్టాలు పడటం, వాళ్ళ కుటుంబాలు న్యాయం కోసం ఢిల్లీకి వెళ్లడం ఇదంతా అరేబియా కడలో ఉంది. పాక్ పోలీస్ వ్యాన్ లో హీరో బృందం వెళ్తున్నప్పుడు దాడి జరిగే ఎపిసోడ్ కూడా రెండింట్లో ఒకేలా కనిపిస్తోంది. ఇన్ని సారూప్యతలు చూసి చైతు ఫ్యాన్స్ సైతం షాక్ తింటున్నారు. ఇదేంటని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
నిజానికి ఈ అరేబియా కడలిని చింతకింది శ్రీనివాస్ అనే జర్నలిస్టు రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. క్రిష్ దీనికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ కాగా వివి సూర్యకుమార్ దర్శకుడు. తండేల్ తీస్తున్న టైంలో కొంత కాంట్రావర్సి రాగా ఈ ఘటనలో నిజమైన బాధితులుగా ఉన్న వాళ్లకు రాయల్టీ చెల్లించి గీతా ఆర్ట్స్ హక్కులు కొందనే ప్రచారం ఆ మధ్య జరిగింది. తెరవెనుక ఏం జరిగిందో కానీ అరేబియా కడలి రిలీజ్ లో కొంత ఆలస్యం జరిగింది. కాకపోతే దీనికి తండేల్ కు మధ్య తక్కువ గ్యాప్ ఉండటంతో పోలికల పర్వం తప్పదు. మరి నాగచైతన్య, సాయిపల్లవిలాంటి స్టార్లు చేసిన పాత్రల్లో సత్యదేవ్, ఆనంది ఎలా మెప్పిస్తారో చూడాలి.
This post was last modified on August 1, 2025 2:59 pm
సమస్య చిన్నదయినా, పెద్దదయినా తన దృష్టికి వస్తే పరిష్కారం కావాల్సిందేనని నిత్యం నిరూపిస్తూనే ఉన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్…
మెగా ఫ్యాన్స్ జోష్ మాములుగా లేదు. మొన్నటిదాకా తమ హీరోలు వరస డిజాస్టర్లతో సతమతమవుతున్నప్పుడు వాళ్ళు పడిన బాధ అంతా…
ఏపీ ప్రభుత్వం చేపట్టాలని భావిస్తున్న పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విషయం…
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…