సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాకు ప్రత్యేకంగా ఓవర్ పబ్లిసిటీ అక్కర్లేదు. అలాంటిది ఆయనకు లోకేష్ కనగరాజ్, నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ తోడైతే చెప్పేదేముంది. ఆకాశమే హద్దుగా అంచనాలు ఎక్కడికో వెళ్లిపోతాయి. కానీ సన్ పిక్చర్స్ ప్రమోషన్లను లైట్ తీసుకోవడం లేదు. ఆడియన్స్ కి దగ్గరయ్యేందుకు ఎంత చేయాలో అంతకంటే ఎక్కువే చేసి చూపిస్తోంది. ప్రోమోలు, ఇంటర్వ్యూలు, వైరల్ కంటెంట్లు ఒకటా రెండా ప్రతి దాంట్లోనూ తనదైన ముద్ర చూపిస్తూ కాంపిటీషన్ లో ఉన్న వార్ 2ని వెనక్కు నెట్టేసింది. ఒకరకంగా చెప్పాలంటే సన్ స్ట్రాటజీలు చూసి రజనితో పాటు ఇతర హీరోల ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
సర్వాంతర్యామి తరహాలో ఎక్కడ చూసినా కూలి కనిపించేలా వినిపించేలా సన్ టీమ్ వేస్తున్న ప్లాన్లు బ్రహ్మాండంగా వర్కవుట్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ పార్సిల్ చేసే వస్తువుల బాక్సుల మీద పెద్ద పెద్ద కూలి స్టిక్కర్లు వేయించడం కస్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే కర్ణాటకకు వెళ్లే బాక్సుల మీద కన్నడ భాషలో టైటిల్ ఫాంట్ వేశారు. అంతే కాక ఉపేంద్రని రజనితో సమానంగా హైలైట్ చేయడం ద్వారా రీజనల్ సెంటిమెంట్ టచ్ చేస్తున్నారు. ఇదే ఫార్ములాతో ఏపీ తెలంగాణ బాక్సులకు నాగార్జున పిక్ ని ఎక్కువ ఫోకస్ చేయడం ద్వారా అటెన్షన్ పెంచుతున్నారు.
వచ్చే వారం చెన్నైలో జరగబోయే కూలి ఈవెంట్ సరికొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుందని కోలీవడ్ మీడియా కోడై కూస్తోంది. రెగ్యులర్ వేడుకలకు భిన్నంగా చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారని, ఒక పెద్ద సినిమాకు ఏ మాత్రం తీసిపోని రీతిలో లైవ్ ఈవెంట్ ఉంటుందని, ఫ్యాన్స్ మళ్ళీ మళ్ళీ చూసి ఎంజాయ్ చేసేలా లోకేష్ కనగరాజ్ టీమ్ డిజైన్ చేసిందని అంటున్నారు. ఆగస్ట్ 14 దాకా ఇలాంటివి నాన్ స్టాప్ గా చేసేలా సర్వం సిద్ధం చేశారు. బయట రాష్ట్రాల ప్రమోషన్లకు రజనీకాంత్ కు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవెంతవరకు సఫలీకృతమవుతాయో చూడాలి. ఏది ఏమైనా కూలీ మేనియా మాములుగా లేదు.
ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ అడ్డంకులు రావడం సహజం. ఒక్కోసారి నెలలు సంవత్సరాల తరబడి రిలీజులు ఆగిపోతాయి. కానీ ఓటిటిలో…
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…
ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…