ఏంటీ లావణ్య త్రిపాఠి.. భర్తను చితగ్గొట్టేస్తోందా? పాపం వరుణ్ తేజ్ అని జాలిపడకండి. ఇది ఆమె నిజ జీవితానికి సంబంధించిన విషయం కాదు. సినిమా సంగతి. పెళ్ళి తర్వాత సినిమాలు బాగా తగ్గించేసి, ఒక దశలో పూర్తిగా సినీ రంగానికి గుడ్ బై చెప్పేసినట్లు కనిపించిన లావణ్య.. కొంచెం గ్యాప్ తర్వాత ‘సతీ లీలావతి’ అనే సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమాను మొదలుపెట్టిన లావణ్య.. తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించే సమయానికే చకచకా సినిమాను పూర్తి చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా నుంచి ఫస్ట్ టీజర్ను లాంచ్ చేశారు. ఇది భర్తను చిత్రహింసలు పెట్టే భార్య కథ కావడం విశేషం. మలయాళంలో పెద్ద హిట్టయిన ‘జయ జయ జయ జయహే’ సినమాను గుర్తు చేసేలా ఈ సినిమా టీజర్ సాగింది.
‘శాకుంతలం’ చిత్రంలో దుష్యంతుడి పాత్ర పోషించిన మలయాళ నటుడు దేవ్ పటేల్ ‘సతీ లీలావతి’లో లావణ్య భర్త పాత్రలో నటించాడు. హ్యాపీగా పెళ్లి చేసుకున్న ఒక యువ జంట జీవితంలో వెంటనే కలహాలు మొదలవుతాయి. ఇలా గొడవ పడడం కంటే విడాకులు తీసుకుందాం అంటాడు భర్త. కట్ చేస్తే.. తర్వాతి రోజు అతను కుర్చీకి కట్టేయబడి ఉంటాడు. అలా అతణ్ని బంధించి చితక బాదేస్తుంటుంది భార్య. ఆ ఇంట్లో ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేస్తూ బయటి నుంచి ఒక బ్యాచ్ ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తుంటుంది.
ఇంతకీ ఈ భార్య శాడిజానికి కారణమేంటి.. భర్తను ఎందుకలా బాదేస్తుంది.. ఈ విషయాలన్నీ సస్పెన్స్ అన్నమాట. ఈ మధ్య తెలుగు సినిమాల్లో బాగా నవ్వులు పండిస్తున్న తమిళ నటుడు వీటీవీ గణేష్ ఇందులో ఓ కీలక పాత్ర చేశాడు. మరో తమిళ కమెడియన్ మొట్ట రాజేంద్రన్.. సప్తగిరి సహా కామెడీ బ్యాచ్ పెద్దగానే ఉంది. ఇదొక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ అనే సంకేతాలను ఇచ్చింది టీజర్. ఇంతకుముందు నానితో ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమా తీసిన తాతినేని సత్య ఈ చిత్రాన్ని రూపొందించాడు. కొత్త నిర్మాత నాగ కిషోర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ను చిత్ర బృందం ప్రకటించనుంది.
This post was last modified on July 29, 2025 3:38 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…