ఏంటీ లావణ్య త్రిపాఠి.. భర్తను చితగ్గొట్టేస్తోందా? పాపం వరుణ్ తేజ్ అని జాలిపడకండి. ఇది ఆమె నిజ జీవితానికి సంబంధించిన విషయం కాదు. సినిమా సంగతి. పెళ్ళి తర్వాత సినిమాలు బాగా తగ్గించేసి, ఒక దశలో పూర్తిగా సినీ రంగానికి గుడ్ బై చెప్పేసినట్లు కనిపించిన లావణ్య.. కొంచెం గ్యాప్ తర్వాత ‘సతీ లీలావతి’ అనే సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమాను మొదలుపెట్టిన లావణ్య.. తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించే సమయానికే చకచకా సినిమాను పూర్తి చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సినిమా నుంచి ఫస్ట్ టీజర్ను లాంచ్ చేశారు. ఇది భర్తను చిత్రహింసలు పెట్టే భార్య కథ కావడం విశేషం. మలయాళంలో పెద్ద హిట్టయిన ‘జయ జయ జయ జయహే’ సినమాను గుర్తు చేసేలా ఈ సినిమా టీజర్ సాగింది.
‘శాకుంతలం’ చిత్రంలో దుష్యంతుడి పాత్ర పోషించిన మలయాళ నటుడు దేవ్ పటేల్ ‘సతీ లీలావతి’లో లావణ్య భర్త పాత్రలో నటించాడు. హ్యాపీగా పెళ్లి చేసుకున్న ఒక యువ జంట జీవితంలో వెంటనే కలహాలు మొదలవుతాయి. ఇలా గొడవ పడడం కంటే విడాకులు తీసుకుందాం అంటాడు భర్త. కట్ చేస్తే.. తర్వాతి రోజు అతను కుర్చీకి కట్టేయబడి ఉంటాడు. అలా అతణ్ని బంధించి చితక బాదేస్తుంటుంది భార్య. ఆ ఇంట్లో ఏదో జరుగుతోందని అనుమానం వ్యక్తం చేస్తూ బయటి నుంచి ఒక బ్యాచ్ ఇంట్లోకి రావడానికి ట్రై చేస్తుంటుంది.
ఇంతకీ ఈ భార్య శాడిజానికి కారణమేంటి.. భర్తను ఎందుకలా బాదేస్తుంది.. ఈ విషయాలన్నీ సస్పెన్స్ అన్నమాట. ఈ మధ్య తెలుగు సినిమాల్లో బాగా నవ్వులు పండిస్తున్న తమిళ నటుడు వీటీవీ గణేష్ ఇందులో ఓ కీలక పాత్ర చేశాడు. మరో తమిళ కమెడియన్ మొట్ట రాజేంద్రన్.. సప్తగిరి సహా కామెడీ బ్యాచ్ పెద్దగానే ఉంది. ఇదొక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ అనే సంకేతాలను ఇచ్చింది టీజర్. ఇంతకుముందు నానితో ‘భీమిలి కబడ్డీ జట్టు’ సినిమా తీసిన తాతినేని సత్య ఈ చిత్రాన్ని రూపొందించాడు. కొత్త నిర్మాత నాగ కిషోర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ను చిత్ర బృందం ప్రకటించనుంది.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…