టాలీవుడ్లో చాలా వేగంగా స్టార్ హీరోయిన్గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. కెరీర్ ఆరంభంలో ‘వెంకటాద్రి ఎక్స్ప్రెస్’, ‘కరెంటు తీగ’ లాంటి చిన్న, మీడియం రేంజ్ సినిమాలు చేసిన ఆమె.. తర్వాత వరుసబెట్టి పెద్ద స్టార్లతో సినిమాలు చేసింది. ఆమె కంటే ముందు అగ్ర కథానాయికలుగా ఉన్న వాళ్లందరి జోరు తగ్గిపోగా.. రకుల్ వరుసగా భారీ చిత్రాలతో టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. కానీ ఆ కిరీటం ఎంతో కాలం నిలవలేదు. వరుస పరాజయాలు రకుల్ కెరీర్ను దెబ్బ తీశాయి. ఉన్నట్లుండి టాలీవుడ్ నుంచి అంతర్ధానమయ్యే పరిస్థితికి వచ్చేసింది.
కానీ అదే సమయంలో ఆమెకు బాలీవుడ్లో అవకాశాలు వచ్చాయి. యారియా, దే దే ప్యార్ దే లాంటి సినిమాల్లో నటించింది. ఇందులో ‘దేదే ప్యార్ దే’ పెద్ద హిట్టయింది కూడా. ఈ చిత్రంలో తన వయసు కంటే దాదాపు డబుల్ ఉన్న అజయ్ దేవగణ్తో జోడీ కట్టింది రకుల్. ఐతే కథ రీత్యా ఆ పాత్రకు బాగానే ఫిట్ అయింది.
‘దేదే ప్యార్ దే’లో ఇటు అందంతో, అటు అభినయంతో ఆకట్టుకున్న రకుల్.. మరోసారి అజయ్ దేవగణ్తో నటించబోతుండటం విశేషం. ఆమె తన స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కనున్న చిత్రంలో అజయ్ అవకాశమిచ్చాడు. ఇంతకుముందు దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ ‘శివాయ్’ చిత్రాన్ని రూపొందించిన అజయ్.. ఇటీవలే దర్శకుడిగా తన రెండో చిత్రం ‘మే డే’ను ప్రకటించాడు.
ఇందులో అజయ్ పైలట్ పాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇందులో రకుల్ కూడా నటించనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఇంకొన్ని రోజుల్లోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. ‘దే దే ప్యార్ దే’ సినిమాలో రకుల్ పెర్ఫామెన్స్కు అజయ్ బాగానే ఇంప్రెస్ అయ్యాడని తన సొంత సినిమాలో అవకాశమివ్వడాన్ని బట్టి అర్థమవుతోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది మధ్యలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on November 19, 2020 11:00 am
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. పార్టీ వర్గాలతో చర్చలు జరిపిన ఆయన..…
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
+ దేశ సరిహద్దులను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? నిస్సందేహంగా కేంద్ర ప్రభుత్వానిదే. + దేశ సరిహద్దుల నుంచి పెరుగుతున్న చొరబాట్లను…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…