‘ఆదిపురుష్’ నుంచి అప్ డేట్ అంటే… ఈ చిత్రంలో సీత పాత్ర పోషించేదెవరో వెల్లడిస్తారేమో అనుకున్నారు అభిమానులు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన ఆశ్చర్యపరిచాడు ప్రభాస్. 2022 ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా విషయంలో అప్ డేట్ల మీద అప్ డేట్లు ఇస్తుండటం, షూటింగ్కు కూడా సన్నాహాలు చేస్తుండటంతో వచ్చే ఏడాదే ఈ సినిమా విడుదలైపోతుందనే అంచనాలతో ఉన్నారంతా.
కానీ ఊహించని విధంగా సినిమాను అనుకున్నదానికంటే ఏడాది ఆలస్యంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీని కంటే ముందు ప్రకటించిన నాగ్ అశ్విన్-ప్రభాస్ సినిమా విషయంలో ముందు నుంచే అయోమయం నడుస్తుండగా.. తాజా ప్రకటనతో అయోమయం ఇంకా పెరిగిపోయింది.
ముందు ప్రకటించిన నాగ్ అశ్విన్ సినిమాను కాకుండా.. ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్’ను టేకప్ చేయడమే చాలామందికి రుచించలేదు. ఇప్పటికే స్క్రిప్టు పూర్తి చేసి ప్రి ప్రొడక్షన్ పనిలో ఉన్న నాగ్ అశ్విన్ టీంకు ఇది షాక్ అన్నట్లే మాట్లాడుకున్నారు. ఐతే ‘ఆదిత్య 369’ తరహాలో సైంటిఫిక్ టచ్ ఉన్న ఫాంటసీ థ్రిల్లర్ కావడంతో దీని చిత్రీకరణకు ఎక్కువ సమయం పడుతుందని.. అందుకే వేగంగా ‘ఆదిపురుష్’ను పూర్తి చేసి.. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు మీదికి ప్రభాస్ వెళ్లబోతున్నాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ‘ఆదిపురుష్’కే చాలా సమయం తీసుకోబోతున్నాడు ప్రభాస్.
రాధేశ్యామ్ పని ఇంకొన్ని నెలల్లో పూర్తి చేశాక వచ్చే ఏఢాదంతా ‘ఆదిపురుష్’ తన సమయాన్ని కేటాయించేలా ఉన్నాడు ప్రభాస్. ఆ తర్వాత ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్కు చాలా సమయం పట్టేలా ఉంది. బహుశా చిత్ర బృందం ఆ పనిలో ఉండగా.. ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా మీదికి వెళ్లిపోతాడేమో. అది కూడా పోస్ట్ ప్రొడక్షన్కు చాలా సమయం తీసుకునే సినిమా. 2022లో ఆ సినిమా చిత్రీకరణ సాగినా.. విడుదల మాత్రం 2023లోనే అని స్పష్టమవుతోంది. మొత్తంగా చూస్తే ‘మహానటి’ చేశాక నాలుగేళ్లకు కానీ నాగ్ అశ్విన్ తర్వాతి సినిమా విడుదల కాదన్నమాట.
This post was last modified on November 19, 2020 10:56 am
టాలీవుడ్లో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో క్రిష్ ఒకడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో క్రిష్ ఎన్నడూ రొటీన్ సినిమా…
మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో…
స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని సినిమాల్లో చూడటమే కానీ నిజ జీవితంలో దాన్ని ఆచరించే వాళ్ళను వేళ్ళ మీద…
ఒక జడ్జి ప్రజల్ని చీమలతో పోల్చితో మరొకరు నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసింది. దాని…
ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు…
అదేంటో గానీ... ఉన్న రోగానికి మందేస్తే... ఆ రోగం సంగతేమో గానీ... కొత్త రోగం వచ్చి పడుతోంది. ఈ తరహా…