‘ఆదిపురుష్’ నుంచి అప్ డేట్ అంటే… ఈ చిత్రంలో సీత పాత్ర పోషించేదెవరో వెల్లడిస్తారేమో అనుకున్నారు అభిమానులు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన ఆశ్చర్యపరిచాడు ప్రభాస్. 2022 ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా విషయంలో అప్ డేట్ల మీద అప్ డేట్లు ఇస్తుండటం, షూటింగ్కు కూడా సన్నాహాలు చేస్తుండటంతో వచ్చే ఏడాదే ఈ సినిమా విడుదలైపోతుందనే అంచనాలతో ఉన్నారంతా.
కానీ ఊహించని విధంగా సినిమాను అనుకున్నదానికంటే ఏడాది ఆలస్యంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీని కంటే ముందు ప్రకటించిన నాగ్ అశ్విన్-ప్రభాస్ సినిమా విషయంలో ముందు నుంచే అయోమయం నడుస్తుండగా.. తాజా ప్రకటనతో అయోమయం ఇంకా పెరిగిపోయింది.
ముందు ప్రకటించిన నాగ్ అశ్విన్ సినిమాను కాకుండా.. ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్’ను టేకప్ చేయడమే చాలామందికి రుచించలేదు. ఇప్పటికే స్క్రిప్టు పూర్తి చేసి ప్రి ప్రొడక్షన్ పనిలో ఉన్న నాగ్ అశ్విన్ టీంకు ఇది షాక్ అన్నట్లే మాట్లాడుకున్నారు. ఐతే ‘ఆదిత్య 369’ తరహాలో సైంటిఫిక్ టచ్ ఉన్న ఫాంటసీ థ్రిల్లర్ కావడంతో దీని చిత్రీకరణకు ఎక్కువ సమయం పడుతుందని.. అందుకే వేగంగా ‘ఆదిపురుష్’ను పూర్తి చేసి.. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు మీదికి ప్రభాస్ వెళ్లబోతున్నాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ‘ఆదిపురుష్’కే చాలా సమయం తీసుకోబోతున్నాడు ప్రభాస్.
రాధేశ్యామ్ పని ఇంకొన్ని నెలల్లో పూర్తి చేశాక వచ్చే ఏఢాదంతా ‘ఆదిపురుష్’ తన సమయాన్ని కేటాయించేలా ఉన్నాడు ప్రభాస్. ఆ తర్వాత ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్కు చాలా సమయం పట్టేలా ఉంది. బహుశా చిత్ర బృందం ఆ పనిలో ఉండగా.. ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా మీదికి వెళ్లిపోతాడేమో. అది కూడా పోస్ట్ ప్రొడక్షన్కు చాలా సమయం తీసుకునే సినిమా. 2022లో ఆ సినిమా చిత్రీకరణ సాగినా.. విడుదల మాత్రం 2023లోనే అని స్పష్టమవుతోంది. మొత్తంగా చూస్తే ‘మహానటి’ చేశాక నాలుగేళ్లకు కానీ నాగ్ అశ్విన్ తర్వాతి సినిమా విడుదల కాదన్నమాట.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…