Movie News

కన్ఫ్యూజ్ చేసి పడేసిన ప్రభాస్

‘ఆదిపురుష్’ నుంచి అప్ డేట్ అంటే… ఈ చిత్రంలో సీత పాత్ర పోషించేదెవరో వెల్లడిస్తారేమో అనుకున్నారు అభిమానులు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన ఆశ్చర్యపరిచాడు ప్రభాస్. 2022 ఆగస్టు 11న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా విషయంలో అప్ డేట్ల మీద అప్ డేట్లు ఇస్తుండటం, షూటింగ్‌కు కూడా సన్నాహాలు చేస్తుండటంతో వచ్చే ఏడాదే ఈ సినిమా విడుదలైపోతుందనే అంచనాలతో ఉన్నారంతా.

కానీ ఊహించని విధంగా సినిమాను అనుకున్నదానికంటే ఏడాది ఆలస్యంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీని కంటే ముందు ప్రకటించిన నాగ్ అశ్విన్-ప్రభాస్ సినిమా విషయంలో ముందు నుంచే అయోమయం నడుస్తుండగా.. తాజా ప్రకటనతో అయోమయం ఇంకా పెరిగిపోయింది.

ముందు ప్రకటించిన నాగ్ అశ్విన్ సినిమాను కాకుండా.. ‘రాధేశ్యామ్’ తర్వాత ప్రభాస్ ‘ఆదిపురుష్’ను టేకప్ చేయడమే చాలామందికి రుచించలేదు. ఇప్పటికే స్క్రిప్టు పూర్తి చేసి ప్రి ప్రొడక్షన్ పనిలో ఉన్న నాగ్ అశ్విన్ టీంకు ఇది షాక్ అన్నట్లే మాట్లాడుకున్నారు. ఐతే ‘ఆదిత్య 369’ తరహాలో సైంటిఫిక్ టచ్ ఉన్న ఫాంటసీ థ్రిల్లర్ కావడంతో దీని చిత్రీకరణకు ఎక్కువ సమయం పడుతుందని.. అందుకే వేగంగా ‘ఆదిపురుష్’ను పూర్తి చేసి.. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు మీదికి ప్రభాస్ వెళ్లబోతున్నాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ‘ఆదిపురుష్’కే చాలా సమయం తీసుకోబోతున్నాడు ప్రభాస్.

రాధేశ్యామ్ పని ఇంకొన్ని నెలల్లో పూర్తి చేశాక వచ్చే ఏఢాదంతా ‘ఆదిపురుష్’ తన సమయాన్ని కేటాయించేలా ఉన్నాడు ప్రభాస్. ఆ తర్వాత ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలా సమయం పట్టేలా ఉంది. బహుశా చిత్ర బృందం ఆ పనిలో ఉండగా.. ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా మీదికి వెళ్లిపోతాడేమో. అది కూడా పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలా సమయం తీసుకునే సినిమా. 2022లో ఆ సినిమా చిత్రీకరణ సాగినా.. విడుదల మాత్రం 2023లోనే అని స్పష్టమవుతోంది. మొత్తంగా చూస్తే ‘మహానటి’ చేశాక నాలుగేళ్లకు కానీ నాగ్ అశ్విన్ తర్వాతి సినిమా విడుదల కాదన్నమాట.

This post was last modified on November 19, 2020 10:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

52 minutes ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

2 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

3 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

3 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

3 hours ago

యుద్ధంలో కేబుల్స్ కట్?

అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…

4 hours ago