దివ్య స్పందన.. తెలుగు వారికీ పరిచయం ఉన్న కన్నడ నటి. నందమూరి కళ్యాణ్ రామ్ అభిమన్యుతో పాటు సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంతోనూ తెలుగు వారిని పలకరించిన దివ్య.. కథానాయికగా కెరీర్ ముగిశాక రాజకీయ రంగప్రవేశం చేసింది. కాంగ్రెస్ తరఫున ఒకసారి ఎంపీగా కూడా గెలిచింది. అలాంటి సెలబ్రెటీకి కన్నడ హీరో దర్శన్ అభిమానుల నుంచి రేప్ బెదిరింపులు రావడం గమనార్హం. దర్శన్ అభిమానులు, తనతో పాటు తన పిల్లలను కూడా వదలకుండా బూతులు తిడుతూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని.. రేప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని రమ్య బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దర్శన్ తన అభిమాని అయిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరు నెలల పాటు జైల్లో ఉన్న దర్శన్.. గత ఏడాది చివర్లో బెయిల్ మీద విడదులయ్యాడు. ఐతే ఈ కేసులో రేణుకాస్వామి కుటుంబానికి న్యాయం జరగాలంటూ రమ్య వ్యాఖ్యానించడంతో దర్శన్ అభిమానులకు కోపం వచ్చింది. ఆమెను సోషల్ మీడియాలో దారుణంగా తిట్టడం, బెదిరించడం చేశారు. రమ్యతో పాటు ఆమె కుటుంబ సభ్యుల మీదా దూషణలకు దిగారు. రేణుకాస్వామికి బదులు నువ్వు చావాల్సిందని కూడా కామెంట్లు చేశారు.
దీంతో రమ్య దర్శన్ అభిమానులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ప్రేయసిని దారుణమైన మెసేజ్లతో వేధించిన కారణంతోనే రేణుకాస్వామిని దర్శన్ హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేణుకాస్వామితో దర్శన్ మిగతా అభిమానులను ఆమె పోల్చింది.
”రేణుకా స్వామికి, దర్శన్ అభిమానులకు ఎలాంటి తేడా లేదు. రోజూ కొంతమంది అభిమానులు.. రేప్ చేసి, చంపేస్తామని నన్ను వేధిస్తున్నారు. ఆడవాళ్లను వేధించడం ఓ అలవాటుగా మారిపోయింది. బెంగళూరు పోలీస్ కమీషనర్ని కలవబోతున్నా. నా లాయర్లతో ఈ కేసు గురించి మాట్లాడుతున్నా. ఓ మహిళ విషయంలో ఇంత దారుణంగా వ్యవహరించడం చాలా పెద్ద నేరం. దీన్ని క్షమించకూడదు” అని దివ్య పేర్కొంది. బెయిల్ మీద బయటికి వచ్చాక దర్శన్.. ది డెవిల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అతడి బెయిల్ రద్దు విషయమై ఇటీవల సుప్రీం కోర్టు కర్ణాటక హైకోర్టును తప్పుబట్టిన సంగతి తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…
కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…
జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…
కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…
ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…
ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…