దివ్య స్పందన.. తెలుగు వారికీ పరిచయం ఉన్న కన్నడ నటి. నందమూరి కళ్యాణ్ రామ్ అభిమన్యుతో పాటు సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రంతోనూ తెలుగు వారిని పలకరించిన దివ్య.. కథానాయికగా కెరీర్ ముగిశాక రాజకీయ రంగప్రవేశం చేసింది. కాంగ్రెస్ తరఫున ఒకసారి ఎంపీగా కూడా గెలిచింది. అలాంటి సెలబ్రెటీకి కన్నడ హీరో దర్శన్ అభిమానుల నుంచి రేప్ బెదిరింపులు రావడం గమనార్హం. దర్శన్ అభిమానులు, తనతో పాటు తన పిల్లలను కూడా వదలకుండా బూతులు తిడుతూ, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని.. రేప్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని రమ్య బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దర్శన్ తన అభిమాని అయిన రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆరు నెలల పాటు జైల్లో ఉన్న దర్శన్.. గత ఏడాది చివర్లో బెయిల్ మీద విడదులయ్యాడు. ఐతే ఈ కేసులో రేణుకాస్వామి కుటుంబానికి న్యాయం జరగాలంటూ రమ్య వ్యాఖ్యానించడంతో దర్శన్ అభిమానులకు కోపం వచ్చింది. ఆమెను సోషల్ మీడియాలో దారుణంగా తిట్టడం, బెదిరించడం చేశారు. రమ్యతో పాటు ఆమె కుటుంబ సభ్యుల మీదా దూషణలకు దిగారు. రేణుకాస్వామికి బదులు నువ్వు చావాల్సిందని కూడా కామెంట్లు చేశారు.
దీంతో రమ్య దర్శన్ అభిమానులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ప్రేయసిని దారుణమైన మెసేజ్లతో వేధించిన కారణంతోనే రేణుకాస్వామిని దర్శన్ హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేణుకాస్వామితో దర్శన్ మిగతా అభిమానులను ఆమె పోల్చింది.
”రేణుకా స్వామికి, దర్శన్ అభిమానులకు ఎలాంటి తేడా లేదు. రోజూ కొంతమంది అభిమానులు.. రేప్ చేసి, చంపేస్తామని నన్ను వేధిస్తున్నారు. ఆడవాళ్లను వేధించడం ఓ అలవాటుగా మారిపోయింది. బెంగళూరు పోలీస్ కమీషనర్ని కలవబోతున్నా. నా లాయర్లతో ఈ కేసు గురించి మాట్లాడుతున్నా. ఓ మహిళ విషయంలో ఇంత దారుణంగా వ్యవహరించడం చాలా పెద్ద నేరం. దీన్ని క్షమించకూడదు” అని దివ్య పేర్కొంది. బెయిల్ మీద బయటికి వచ్చాక దర్శన్.. ది డెవిల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అతడి బెయిల్ రద్దు విషయమై ఇటీవల సుప్రీం కోర్టు కర్ణాటక హైకోర్టును తప్పుబట్టిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 28, 2025 7:58 pm
అంశం ఏదైనా సరే.. కేంద్ర ప్రభుత్వం ఒకసారి డిసైడ్ అయితే.. తన అజెండాకు తగ్గట్లుగా పరిస్థితుల్ని మార్చేయటం కొత్తేం కాదు.…
వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో…
బీజేపీ, వైసీపీల మధ్య మైత్రి ఇంకెన్నటికీ చెక్కు చెదరదనే చెప్పాలి. ఎందుకంటే...బీజేపీ ఇప్పటిదాకా ప్రతిపాదించిన ప్రతి అంశానికి బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసీపీ...తాజాగా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా…
బీహార్లో బిజెపి ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన సామ్రాట్ చౌదరి…
వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జగన్.. పేదలకు పట్టెడన్నం కూడా పెట్టలేక పోయారని సీఎం చంద్రబాబు విమర్శించారు.…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన…