పేరుకి మలయాళ హీరోనే అయినా తెలుగువాళ్లకు బాగా దగ్గరైన దుల్కర్ సల్మాన్ కు భలే సినిమాలు పడుతున్నాయి. కంటెంట్ కోసం దర్శకులు నిర్మాతలు నానా తిప్పలు పడుతుంటే మనోడు మాత్రం మహానటి, సీతారామం లాంటి క్లాసిక్స్ ని పట్టేస్తున్నాడు. తాజాగా కాంత కూడా అదే కోవలో చేరేలా ఉంది. దగ్గుబాటి రానాతో పాటు మరో ఇద్దరితో కలిసి దుల్కర్ సల్మాన్ దీనికి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. సెప్టెంబర్ 12 విడుదల కాబోతున్న కాంత కథ గురించి ఇప్పటిదాకా ఎలాంటి క్లూస్ లేవు కానీ ఇవాళ లాంచ్ చేసిన రెండు నిమిషాల టీజర్ లో స్టోరీ లైన్ ఏంటో ఇంటరెస్టింగ్ గా చెప్పారు.
అది స్వాతంత్రం వచ్చిన కొత్తలో తెలుగు సినిమా పైకొస్తున్న సువర్ణ యుగం. శాంత పేరుతో మొదటి హారర్ మూవీకి శ్రీకారం చుడతాడో మహా దర్శకుడు (సముతిరఖని). శిష్యుడి (దుల్కర్ సల్మాన్) నే కథానాయకుడిగా పెట్టుకుంటాడు. ఓ అందాల బొమ్మ (భాగ్యశ్రీ బోర్సే) హీరోయిన్ గా చేరుతుంది. తండ్రి కొడుకుల్లా అప్పటిదాకా కలిసి మెలిసి ఉన్న హీరో, డైరెక్టర్ కు మధ్య ఈగో వార్ మొదలవుతుంది. పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో మంట పుడుతుంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుందంటే మీడియా ముందుకొచ్చి హీరో తన సినిమా పేరు శాంత కాదు కాంత అని ప్రకటించేంత. అసలేం జరిగిందో తెలుసుకోవడమే కథ.
పాత కాలం బ్యాక్ డ్రాప్ కాబట్టి అప్పటి వాతావరణాన్ని సృష్టించి కాంతకు కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చారు. దుల్కర్, సముతిరఖని ఇద్దరూ పోటాపోటీగా పెర్ఫార్మ్ చేయడాన్ని హైలైట్ చేశారు. పైనేదో కథను గెస్ చేసేలా విజువల్స్ చూపించారు కానీ అసలు ట్విస్టులు, జానర్ వేరే ఉన్నాయి. జాను చంతర్ సంగీతం, డానీ సంజె లోపెజ్ ఛాయాగ్రహణం సమకూర్చిన కాంత కథ ప్రధానంగా పైన చెప్పిన మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్ మేళవించిన కాంత గురించి రహస్యం బయట పడాలంటే సెప్టెంబర్ 12 దాకా వేచి చూడాలి. స్పిరిట్ మీడియా, వేఫరేర్ ఫిలిమ్స్ సంయుక్త నిర్మాణంలో కాంత రూపొందింది.
This post was last modified on July 28, 2025 5:25 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…