పేరుకి మలయాళ హీరోనే అయినా తెలుగువాళ్లకు బాగా దగ్గరైన దుల్కర్ సల్మాన్ కు భలే సినిమాలు పడుతున్నాయి. కంటెంట్ కోసం దర్శకులు నిర్మాతలు నానా తిప్పలు పడుతుంటే మనోడు మాత్రం మహానటి, సీతారామం లాంటి క్లాసిక్స్ ని పట్టేస్తున్నాడు. తాజాగా కాంత కూడా అదే కోవలో చేరేలా ఉంది. దగ్గుబాటి రానాతో పాటు మరో ఇద్దరితో కలిసి దుల్కర్ సల్మాన్ దీనికి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. సెప్టెంబర్ 12 విడుదల కాబోతున్న కాంత కథ గురించి ఇప్పటిదాకా ఎలాంటి క్లూస్ లేవు కానీ ఇవాళ లాంచ్ చేసిన రెండు నిమిషాల టీజర్ లో స్టోరీ లైన్ ఏంటో ఇంటరెస్టింగ్ గా చెప్పారు.
అది స్వాతంత్రం వచ్చిన కొత్తలో తెలుగు సినిమా పైకొస్తున్న సువర్ణ యుగం. శాంత పేరుతో మొదటి హారర్ మూవీకి శ్రీకారం చుడతాడో మహా దర్శకుడు (సముతిరఖని). శిష్యుడి (దుల్కర్ సల్మాన్) నే కథానాయకుడిగా పెట్టుకుంటాడు. ఓ అందాల బొమ్మ (భాగ్యశ్రీ బోర్సే) హీరోయిన్ గా చేరుతుంది. తండ్రి కొడుకుల్లా అప్పటిదాకా కలిసి మెలిసి ఉన్న హీరో, డైరెక్టర్ కు మధ్య ఈగో వార్ మొదలవుతుంది. పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో మంట పుడుతుంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుందంటే మీడియా ముందుకొచ్చి హీరో తన సినిమా పేరు శాంత కాదు కాంత అని ప్రకటించేంత. అసలేం జరిగిందో తెలుసుకోవడమే కథ.
పాత కాలం బ్యాక్ డ్రాప్ కాబట్టి అప్పటి వాతావరణాన్ని సృష్టించి కాంతకు కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చారు. దుల్కర్, సముతిరఖని ఇద్దరూ పోటాపోటీగా పెర్ఫార్మ్ చేయడాన్ని హైలైట్ చేశారు. పైనేదో కథను గెస్ చేసేలా విజువల్స్ చూపించారు కానీ అసలు ట్విస్టులు, జానర్ వేరే ఉన్నాయి. జాను చంతర్ సంగీతం, డానీ సంజె లోపెజ్ ఛాయాగ్రహణం సమకూర్చిన కాంత కథ ప్రధానంగా పైన చెప్పిన మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్ మేళవించిన కాంత గురించి రహస్యం బయట పడాలంటే సెప్టెంబర్ 12 దాకా వేచి చూడాలి. స్పిరిట్ మీడియా, వేఫరేర్ ఫిలిమ్స్ సంయుక్త నిర్మాణంలో కాంత రూపొందింది.
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…
ఏపీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ.. ప్రస్తుత ఉండి శాసనసభ్యుడు రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్ చేసిన కేసులో హైకోర్టు సంచలన…