పేరుకి మలయాళ హీరోనే అయినా తెలుగువాళ్లకు బాగా దగ్గరైన దుల్కర్ సల్మాన్ కు భలే సినిమాలు పడుతున్నాయి. కంటెంట్ కోసం దర్శకులు నిర్మాతలు నానా తిప్పలు పడుతుంటే మనోడు మాత్రం మహానటి, సీతారామం లాంటి క్లాసిక్స్ ని పట్టేస్తున్నాడు. తాజాగా కాంత కూడా అదే కోవలో చేరేలా ఉంది. దగ్గుబాటి రానాతో పాటు మరో ఇద్దరితో కలిసి దుల్కర్ సల్మాన్ దీనికి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. సెప్టెంబర్ 12 విడుదల కాబోతున్న కాంత కథ గురించి ఇప్పటిదాకా ఎలాంటి క్లూస్ లేవు కానీ ఇవాళ లాంచ్ చేసిన రెండు నిమిషాల టీజర్ లో స్టోరీ లైన్ ఏంటో ఇంటరెస్టింగ్ గా చెప్పారు.
అది స్వాతంత్రం వచ్చిన కొత్తలో తెలుగు సినిమా పైకొస్తున్న సువర్ణ యుగం. శాంత పేరుతో మొదటి హారర్ మూవీకి శ్రీకారం చుడతాడో మహా దర్శకుడు (సముతిరఖని). శిష్యుడి (దుల్కర్ సల్మాన్) నే కథానాయకుడిగా పెట్టుకుంటాడు. ఓ అందాల బొమ్మ (భాగ్యశ్రీ బోర్సే) హీరోయిన్ గా చేరుతుంది. తండ్రి కొడుకుల్లా అప్పటిదాకా కలిసి మెలిసి ఉన్న హీరో, డైరెక్టర్ కు మధ్య ఈగో వార్ మొదలవుతుంది. పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో మంట పుడుతుంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుందంటే మీడియా ముందుకొచ్చి హీరో తన సినిమా పేరు శాంత కాదు కాంత అని ప్రకటించేంత. అసలేం జరిగిందో తెలుసుకోవడమే కథ.
పాత కాలం బ్యాక్ డ్రాప్ కాబట్టి అప్పటి వాతావరణాన్ని సృష్టించి కాంతకు కొత్త ఫ్లేవర్ తీసుకొచ్చారు. దుల్కర్, సముతిరఖని ఇద్దరూ పోటాపోటీగా పెర్ఫార్మ్ చేయడాన్ని హైలైట్ చేశారు. పైనేదో కథను గెస్ చేసేలా విజువల్స్ చూపించారు కానీ అసలు ట్విస్టులు, జానర్ వేరే ఉన్నాయి. జాను చంతర్ సంగీతం, డానీ సంజె లోపెజ్ ఛాయాగ్రహణం సమకూర్చిన కాంత కథ ప్రధానంగా పైన చెప్పిన మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్ మేళవించిన కాంత గురించి రహస్యం బయట పడాలంటే సెప్టెంబర్ 12 దాకా వేచి చూడాలి. స్పిరిట్ మీడియా, వేఫరేర్ ఫిలిమ్స్ సంయుక్త నిర్మాణంలో కాంత రూపొందింది.
This post was last modified on July 28, 2025 5:25 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…