ఎంతో కష్టపడి హీరోగా నిలదొక్కుకున్నాడు విజయ్ దేవరకొండ. సరైన లుక్స్, యాక్టింగ్ స్కిల్స్ లేకుండా కేవలం బ్యాగ్రౌండ్ను నమ్ముకుని వచ్చి హీరోలుగా నిలదొక్కుకోవడానికి కష్టపడే వారసులను.. విజయ్తో పోల్చి ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు. ఐతే వేరే హీరోలను ఇలా ట్రోల్ చేసే విజయ్ అభిమానులు.. విజయ్ తమ్ముడి విషయంలో ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి తలెత్తింది.
విజయ్తో పోలిస్తే అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ.. తన తొలి చిత్రం ‘దొరసాని’లో అన్ని రకాలుగా తేలిపోయాడు. ముఖ్యంగా లుక్స్ విషయంలో అతను చాలా విమర్శలే ఎదుర్కొన్నాడు. తమ్ముణ్ని హీరోగా చేయడంపై విజయ్ను సైతం చాలామంది తప్పుబట్టారు. కానీ అన్నదమ్ములు అవేమీ పట్టించుకోలేదు. తొలి సినిమా పోయినా.. ఆనంద్ అన్న అండతో బాగానే అవకాశాలు సంపాదించాడు.
ఆనంద్ రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చకచకా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 20న అమేజాన్ ప్రైమ్లో అది విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ మాట్లాడుతూ.. తన అన్నతో పోలికే తనకు అది పెద్ద ప్రతికూలత అని చెప్పాడు. తనను విజయ్తో ప్రేక్షకులు పోల్చి చూడొద్దన్నాడు.
‘‘విజయ్తో పోలికే నాకు అతి పెద్ద సమస్య. అతను హీరోగా చాలా పెద్ద స్థాయికి వెళ్లాడు. పెద్ద విజయాలు చూశాడు. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. విజయ్తో పోల్చి నా గురించి, నా సినిమాల గురించి ప్రేక్షకులు చాలా మాటలు అన్నారు. దీన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమైంది. ఐతే విజయ్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి రావడం వల్ల నాకు కలిగిన ప్రయోజనాలు ఎన్నో’’ అని ఆనంద్ తెలిపాడు. భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు రూపొందించిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ట్రైలర్తో అయితే బాగానే ఆకట్టుకుంది. మరి సినిమాగా ఏమాత్రం మెప్పిస్తుందో చూడాలి.
This post was last modified on November 18, 2020 7:23 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…