ఎంతో కష్టపడి హీరోగా నిలదొక్కుకున్నాడు విజయ్ దేవరకొండ. సరైన లుక్స్, యాక్టింగ్ స్కిల్స్ లేకుండా కేవలం బ్యాగ్రౌండ్ను నమ్ముకుని వచ్చి హీరోలుగా నిలదొక్కుకోవడానికి కష్టపడే వారసులను.. విజయ్తో పోల్చి ట్రోల్ చేస్తుంటారు నెటిజన్లు. ఐతే వేరే హీరోలను ఇలా ట్రోల్ చేసే విజయ్ అభిమానులు.. విజయ్ తమ్ముడి విషయంలో ఎలా స్పందించాలో అర్థం కాని పరిస్థితి తలెత్తింది.
విజయ్తో పోలిస్తే అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ.. తన తొలి చిత్రం ‘దొరసాని’లో అన్ని రకాలుగా తేలిపోయాడు. ముఖ్యంగా లుక్స్ విషయంలో అతను చాలా విమర్శలే ఎదుర్కొన్నాడు. తమ్ముణ్ని హీరోగా చేయడంపై విజయ్ను సైతం చాలామంది తప్పుబట్టారు. కానీ అన్నదమ్ములు అవేమీ పట్టించుకోలేదు. తొలి సినిమా పోయినా.. ఆనంద్ అన్న అండతో బాగానే అవకాశాలు సంపాదించాడు.
ఆనంద్ రెండో సినిమా ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ చకచకా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 20న అమేజాన్ ప్రైమ్లో అది విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ మాట్లాడుతూ.. తన అన్నతో పోలికే తనకు అది పెద్ద ప్రతికూలత అని చెప్పాడు. తనను విజయ్తో ప్రేక్షకులు పోల్చి చూడొద్దన్నాడు.
‘‘విజయ్తో పోలికే నాకు అతి పెద్ద సమస్య. అతను హీరోగా చాలా పెద్ద స్థాయికి వెళ్లాడు. పెద్ద విజయాలు చూశాడు. పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. విజయ్తో పోల్చి నా గురించి, నా సినిమాల గురించి ప్రేక్షకులు చాలా మాటలు అన్నారు. దీన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమైంది. ఐతే విజయ్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి రావడం వల్ల నాకు కలిగిన ప్రయోజనాలు ఎన్నో’’ అని ఆనంద్ తెలిపాడు. భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ నిర్మాణంలో కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు రూపొందించిన ‘మిడిల్ క్లాస్ మెలోడీస్’ ట్రైలర్తో అయితే బాగానే ఆకట్టుకుంది. మరి సినిమాగా ఏమాత్రం మెప్పిస్తుందో చూడాలి.
This post was last modified on November 18, 2020 7:23 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…